హైంద‌వ ధ‌ర్మానికి విస్తృత ప్రాచుర్యం కల్పిస్తాము.

 *హైంద‌వ ధ‌ర్మానికి విస్తృత ప్రాచుర్యం కల్పిస్తాము


*

*అక్టోబ‌రు నుంచి మార్చి వ‌ర‌కు ధ‌ర్మ‌ప్ర‌చార వారోత్స‌వ, మాసోత్స‌వాలు*

*సంస్కృతిలో భాగమైన య‌క్ష‌గాన ప్ర‌క్రియ‌ను వినియోగించుకుంటాం*

*డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవ‌దాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌*


అమ‌రావ‌తి, సెప్టెంబ‌రు 12 (ప్రజా అమరావతి): సనాతన హిందూ ధర్మ పరిరక్షణకై  ప్రస్తుతం నిర్వహిస్తున్న ధర్మప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మేజర్ టెంపుల్స్ పాటు 6-ఎ ఆలయాల్లోనూ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. మంగళవారం వెల‌గ‌పూడి రాష్ట్ర స‌చివాల‌యంలో ఆయన అధ్యక్షతన ధ‌ర్మ‌ప్రచార ప‌రిష‌త్ స‌మావేశం జరిగింది.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా దేవదాయ శాఖ ఆధీనంలో ఉన్న మేజ‌ర్ టెంపుల్స్ ద్వారా ధ‌ర్మ‌ప్ర‌చార మాసోత్స‌వాలను నిర్వహిస్తున్నామని, అయితే 6-ఎ ఆల‌యాల ద్వారా కూడా ధ‌ర్మ‌ప్ర‌చార వారోత్స‌వాల‌ను నిర్వ‌హించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో మాసోత్సవాలను గత మాసం 6 న అన్నవరంలో ప్రారంభించడం జరిగిందన్నారు. 18 వ తేదీన శ్రీకాళహస్తిలో నిర్వహించడమైనదని,  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి  చేతుల మీదుగా ఈ నెల 16 వ తేదీన కాణిపాకం  శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అయితే దేవాదాయ శాఖ పరిధిలో  115 వ‌ర‌కు 6-ఎ ఆల‌యాలు ఉన్నాయ‌ని  ఈ అక్టోబ‌రు నుంచి 2024 మార్చి వ‌ర‌కు ఆ 6-ఎ దేవాలయాల్లో వారోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. 


ధ‌ర్మ‌ప్ర‌చారం కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌వ‌చ‌నాలు, హ‌రిక‌థ‌లు, భ‌క్తి సంగీతం, కూచిపూడి నృత్యాలు, భ‌జ‌న‌లు, కోలాటాలు, పారాయ‌ణ‌లు ఉంటాయ‌ని వివ‌రించారు. వాటితో పాటు సామూహిక ఉచిత కుంకుమ పూజ‌లు, అభిషేకాలు, స‌ర‌స్వ‌తీ హోమాలు, గోపూజ‌లు, క‌ళ్యాణోత్స‌వాలు ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అదే విధంగా న‌గ‌ర‌- గ్రామ సంకీర్త‌న, శోభాయాత్ర‌లు నిర్వ‌హించాల‌న్నారు. గ్రామాల్లోని చిన్నారుల‌కు సంప్ర‌దాయ వేషాలు, పాఠ‌శాల విద్యార్థుల‌కు పురాణ పాత్ర‌లు, భ‌గ‌వ‌ద్ఘీత‌పై వ్యాస‌ర‌చ‌న‌, వ‌క్త‌త్వం, చిత్ర‌లేఖ‌న‌ పోటీలు ఏర్పాటు చేయాల‌న్నారు. ఆల‌యాల‌కు, భ‌క్తుల గృహాల‌కు ఆధ్యాత్మిక అనుబంధాన్ని ప‌టిష్టం చేయాల‌న్నారు. వివిధ శుభ‌కార్యాల‌కు వేదిక‌గా ఆల‌యం నిల‌వాల‌న్నారు. వారోత్స‌వాల‌ను ఏర్పాటు చేసుకుని ప్ర‌చుర‌ణ‌/ ప్ర‌సార మాధ్య‌మాలు, ఆటోలు ద్వారా విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌న్నారు. స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, ఆధ్యాత్మిక వేత్త‌లు, పండితులు, క‌ళాకారులు, స్థానిక ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంస్థ‌లు, దాత‌లు, గ్రామ పెద్ద‌ల‌ను, ముఖ్యంగా యువ‌త‌ను ప్ర‌చారంలో భాగ‌స్వాముల‌ను చేయాల‌న్నారు. ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ స‌భ్యులు, ఆర్జేసీ, డీసీ, ఏసీ, 6-ఎ ఆల‌య ఈవోలు, మేజ‌ర్ టెంపుల్స్ ఈవోలు ప్ర‌త్యేక స‌మావేశాల‌ను ఏర్పాటు చేసుకుని 6-ఎ ఆల‌యాల్లో కార్య‌క్ర‌మాల‌ను రూప‌క‌ల్ప‌న చేయాల‌న్నారు. ఆయా ఆల‌యాల సంప్ర‌దాయాల‌కు అనుగుణంగా ఆల‌య వైభ‌వాన్ని తెలియ‌జేస్తూ ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాలు జ‌ర‌గాల‌న్నారు. కుటుంబ, మాన‌వ, సామాజిక ధ‌ర్మాలు, విశ్వ శ్రేయ‌స్సు త‌దిత‌ర అంశాలు గురించి ప్ర‌వ‌చ‌న క‌ర్త‌లు ప్ర‌వ‌చించాల‌న్నారు.


ధ‌ర్మ‌ప్ర‌చార ర‌థం నిర్వ‌హ‌ణ‌, విధివిధానాల‌ను అధికారులంద‌రూ విధిగా పాటించాల‌ని డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ సూచించారు. వారంలో రెండు లేదా మూడు గిరిజ‌న‌, మ‌త్స్య‌కార‌, వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తులు, తెగ‌లు నివ‌సించే ప్రాంతాల్లో ప్ర‌చార ర‌థం ప‌ర్య‌టించేలా చ‌ర్య‌లు చేప‌ట్టి ప్ర‌జ‌లంద‌రినీ భాగ‌స్వామ్యం చేయాల‌న్నారు. ధ‌ర్మ‌ప్ర‌చార స‌మ‌యంలో ర‌థం నిలిపిన‌చోట ఉద‌యం, సాయంత్రం స్థానిక పండితులు, జిల్లాలోని ప్ర‌ముఖ పండితుల‌తో ప్ర‌వ‌చ‌నాలు ఏర్పాటు చేసి స‌నాత‌న ధ‌ర్మ వైశిష్ట్యాన్ని బోధించాల‌న్నారు. ధ‌ర్మ‌ప్ర‌చార ర‌థంతో పాటు క‌నీసం ఒక వేద‌పండితుడు, అర్‌నకుడు, ప‌రిచారికుడు, భంజ‌త్రీలు, ప‌ర్య‌వేక్ష‌కుడు, జూనియ‌ర్ అసిస్టెంట్‌, అటెండ‌ర్లు స‌హా మొత్తం 14 మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. ప్ర‌తి నెలా ఆ నెల‌లో జ‌రిగే ధ‌ర్మ‌ప్ర‌చార ర‌థ యాత్ర‌కు సంబంధించిన రూట్‌మ్యాప్‌ను 1వ తేదీ నాటికే దేవాదాయ శాఖ కమిష‌న‌ర్‌కు అంద‌జేయాల‌న్నారు. యువ‌త‌లో ఆధ్యాత్మిక భావం పెంపొందించేలా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని సూచించారు. హైంద‌వ ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్రమం నిరంత‌ర ప్ర‌క్రియ‌ని తెలిపారు. స‌మావేశంలో దేవదాయ శాఖ స్పెష‌ల్ సీఎస్ క‌రికాల వ‌లివ‌న్‌, రాష్ట్ర దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ ఎస్‌.స‌త్య‌నారాయ‌ణ, వేదాంతం రాజ‌గోపాల చ‌క్ర‌వ‌ర్తి, ప‌లు ఆల‌యాల ఈవోలు, అధికారులు పాల్గొన్నారు.

                                                                         

Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image