వారం రోజుల్లో నిర్దోషిగా చంద్రబాబు బయటకు వస్తారు.

 *చంద్రన్నకు మద్దతుగా కదంతొక్కిన రాజమండ్రి ప్రజలు*

*కొవ్వొత్తుల ర్యాలీకి భారీగా తరలివచ్చిన మహిళలు*

*సంక్షేమం, అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా?*

*దేవాన్ష్ చదివినా రిమాండ్ రిపోర్టు తప్పని చెబుతాడు*

*వారం రోజుల్లో నిర్దోషిగా చంద్రబాబు బయటకు వస్తారు


*

*న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది*

*కుదేలైన రాష్ట్రానికి చంద్రబాబు అవసరం చాలా ఉంది*

*క్లిష్టసమయంలో అండగా నిలచిన ప్రజలకు ధన్యవాదాలు*

*క్యాండిల్ లైట్ ర్యాలీలో పాల్గొన్న భువనేశ్వరి, బ్రాహ్మణి*

రాజమండ్రి (ప్రజా అమరావతి): మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ మహిళలు శనివారం సాయంత్రం భారీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రాజమహేంద్రవరం తిలక్ రోడ్డులోని సాయిబాబా ఆలయం నుండి శ్యామలానగర్ రామాలయం జంక్షన్ వరకు నిర్వహించిన  ప్రదర్శనకు నగరం నలుమూలల నుంచి వేలాది మహిళలు స్వచ్చందంగా తరలివచ్చారు. నగరానికి చెందిన మహిళలు, ప్రముఖులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున హాజరై చంద్రబాబునాయుడుకు సంఘీభావం తెలిపారు. చంద్రబాబునాయుడు తక్షణం విడుదల చేయాలంటూ నినాదాలతో నగర వీధులు హోరెత్తాయి. ర్యాలీ అనంతరం శ్యామలానగర్ రామాలయం వద్ద నారా బ్రాహ్మణి విలేకరులతో మాట్లాడుతూ…చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేసిన రోజు భారతదేశ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. ఆయన 42 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసిన విజనరీ, భారతదేశానికి ఐటీని తెచ్చిన దార్శనికుడు, నీతి నిజాయితీగా రాష్ట్రప్రజల కోసం కష్టపడిన చంద్రబాబుగారి లాంటి సీనియర్ నాయకుడిని ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం అక్రమం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి పరిణామం చూసి ఓ యువతిగా నేను చాలా బాధపడుతున్నాను. చంద్రబాబు కుటుంబ సభ్యురాలిగా కాకుండా సాధారణ మహిళగా చంద్రబాబు అరెస్టును తీవ్రంగా గర్హిస్తున్నాను. చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడికే రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలి. చంద్రబాబు వంటి నాయకుడు లేకపోతే యువతీ యువకులకు నైపుణ్యం, ఉద్యోగాలు వచ్చేవా? అభివృద్ధి చేయడం, సంక్షేమం అందించడం, ఉద్యోగాలు ఇవ్వడమే చంద్రబాబు చేసిన నేరమా? నేడు రాష్ట్రంలో యువతీ, యువకులకు ఎలాంటి శిక్షణ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేవు. 

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర యువతకు గంజాయి, లిక్కర్ ఇచ్చి వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. రాష్ట్ర యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టడంపై రాష్ట్రంలో పెల్లుబుకుతున్న ఆగ్రహజ్వాలలు పెల్లుబికుతున్నాయి. చంద్రబాబుకు జరిగిన అన్యాయంపై మహిళలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారు, ఐటీ ఉద్యోగులంతా చంద్రబాబుకు అండగా నిలబడుతున్నారు. జాతీయస్థాయి నాయకులు, వివిధ రాష్ట్రాల నాయకులు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించి మద్దతుగా నిలుస్తున్నారు. వారందరికీ నా ధన్యవాదాలు. విజయవాడ బెంజ్ సర్కిల్, గుంటూరు, నేడు రాజమండ్రిలో చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన మహిళలను పోలీసులు అనేక ఇబ్బందులు పెట్టారు. రోడ్డు మీదకు వచ్చి చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు.

మేం ఎప్పుడూ ఒంటరి వాళ్లం కాదు.. రాష్ట్రప్రజలు, తెలుగుదేశంపార్టీ కుటుంబ సభ్యులు మాకు అండగా ఉన్నారు. చంద్రబాబులాంటి వ్యక్తిని  అరెస్టు చేస్తారని, మేం ఇలా రోడ్డుపైకి వచ్చి పోరాడాల్సి వస్తుందని ఊహించలేదు. చంద్రబాబు జైల్లో, లోకేష్ ఢిల్లీలో, మేం రాజమండ్రిలో, మా కుమారుడు దేవాన్ష్ హైదరాబాద్ లో ఉండాల్సిన పరిస్థితులు కల్పించారు. చంద్రబాబు ఐటీని తెచ్చి, రాష్ట్ర ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు ఇచ్చే ప్రతిఫలం ఇదేనా?. చంద్రబాబు పర్యటనలకు రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన స్పందన వస్తోంది. దీన్ని ఓర్చుకోలేక మాపై కక్ష సాధిస్తున్నారు. మరో 6నెలల్లో ఎన్నికలు రాబోతున్నందున ప్రభుత్వంపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకత తట్టుకోలేక చంద్రబాబును నిరాధార ఆరోపణలు చేసి అరెస్టు చేశారు. లోకేష్ యువగళం పాదయాత్రకు యువత పెద్దఎత్తున స్పందన రావడం కూడా ప్రభుత్వ కక్షసాధింపునకు ఒక కారణం.

చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్ ను దేవాన్ష్ చదివినా చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని చెబుతాడు. లోకేష్ ను కూడా నేడో రేపో అరెస్టు చేయాలని చూస్తున్నారు. తప్పుచేయని మేం ఎవరికీ భయపడం. మా వెనుక 5కోట్లమంది ఆంద్రప్రదేశ్ ప్రజలు, బలమైన టీడీపీ కుటుంబం ఉంది. మాలో పోరాట స్ఫూర్తి ఉంది. మాకు న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉంది. వచ్చే వారంలో చంద్రబాబు నిర్ధోషిగా బయటకు వస్తారని నాకు నమ్మకం ఉంది. చంద్రబాబు బయటకు రావాలి, ఏపీకి న్యాయం జరగాలి. దీనికోసం మా పోరాటం కొనసాగుతుంది. చంద్రబాబునాయుడు కియా, జోహో వంటి అనేక పరిశ్రమలు, కంపెనీలు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. చంద్రబాబు తప్పు చేయలేదని యావత్ దేశం నమ్ముతోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా తెలుగుప్రజలు రోడ్ల మీదకు వచ్చి చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారని బ్రాహ్మణి అన్నారు. మీడియాతో మాట్లాడిన అనంతరం శ్యామలాపురం రామాలయం జంక్షన్ వద్దనున్న సీతారాములవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీని ముగించారు. కార్యక్రమంలో మాజీమంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గన్ని కృష్ణ, ఆదిరెడ్డి వాసు,  ఆదిరెడ్డి అప్పారావు, రాజమహేంద్రవరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Comments