నాబలం, నా సైన్యం ప్రజలే .


గుత్తి (ప్రజా అమరావతి);

*బాబు ష్యూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం లో భాగం గా గుత్తి లో బహిరంగ సభలో పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు* ప్రసంగం :-

అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకే  నా పోరాటం, నాబలం, నా సైన్యం ప్రజలే 


జగన్ పాలనలో అన్ని బాదుడే బాదుడు, పెట్రోల్, డీజిల్ , నిత్యవసర ధరలు మిగతా రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలోనే ఎక్కువ 

ఆర్టీసీ చార్జీలు పెరిగాయి, కరెంట్ చార్జీలు 8 సార్లు పెంచారు

మద్యం రేట్లు పెంచడమే కాక నాసిరకం మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు

జగన్ ఒక్క ఛాన్స్ అన్నాడని  నమ్మి ప్రజలంతా మోసపోయారు, మీ ఊరులో మీకు ఇసుక దొరుకుతుందా? ఇసుక అక్రమ రవాణాని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే మీపై కేసులు పెడుతున్నారు

యువగళం ప్రజా గళమై ప్రభంజనంలా సాగుతోంది, అందుకే యువగళం వాలంటీర్లపై దాడులు చేసి అరెస్టు చేశారు, 

ఎంతమందిని ఇబ్బంది పెట్టినా పట్టు వదలం, సైకో పాలనపై పోరాటం సాగిస్తాం 

సైకో ముఖ్యమంత్రి ఈ గుత్తికి వచ్చి తన పాలనలో ఏం చేశారో ప్రజలకు చెప్పగలరా? 

బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం కింద అగ్రిమెంట్ ఇస్తున్నా..

40 ఏళ్లుగా నన్ను ఆశీర్విందించారు, మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నా

సార్... ఈ సైకో...పరిశ్రమలు తరిమేశాడు, అప్పులు చేశాడు, మీరు అధికారంలోకి వస్తే ఎలా  ఎలా చేస్తారని కొంతమంది నన్ను అడుగుతున్నారు

అదే నా ప్రత్యేకత, అదే నాకు మీ ఆశీస్సులు నేను 1995లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి జీతాలిచ్చే పరిస్ధితి లేదు, 

కానీ 2020 విజన్ తో ముందుకెళ్లి నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికాం, నేడ హైదరాబాద్ మహా నగరం అయిదంటే అది టీడీపీ ఘనతే.

25 ఏళ్ల క్రితమే ఐటీ గురించి ఊహించి ఐటీ అభివృద్దికి కృషి చేశా

రేపు ఈ టెక్నాలజీ ద్వారా మీ జీవితాల్లో వెలుగులు సృస్టిస్తా..సంపద సృష్టించి ఆ సంపద ప్రజలకు పంచే బాధ్యత నాది

అదే బాబు గ్యారెంటీ, భవిష్యత్తుకు ష్యూరిటీ 

ఈ గుంతకల్లు రైల్వే జోన్ నుంచే  గతంలో అన్ని వ్యాపారాలు జరిగేవి

సినిమాలు డ్రిస్టిబ్యూషన్ చేయాలన్నా చైన్నె నుంచి ఇక్కడ తెచ్చి ఇక్కడ నుంచి డ్రిస్టిబ్యూషన్ చేసేవారు. నేడు ఆ వైభవం అంతా ఏమైంది?  

గుత్తి కోట ఒక చరిత్ర...కృష్ట దేవరాయలు గుత్తి చెరువును తవ్వించారు, ఆ చెరువుకు కనీసం నీళ్లివ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది

హంద్రీ నీవా ద్వారా జిల్లాకు నీళ్లు తెచ్చాం, గొల్లపల్లి ప్రాజెక్టును సవాల్ గా తీసుకున్నా....కియా మోటార్స్ తీసుకువచ్చాను.

టీడీపీ హయాంలో ఒక్క సాగునీటి రంగానికే రూ. 64 వేల కోట్లు కోసమే ఖర్చు చేశాం

అనంతపురం జిల్లాలో ప్రతి చెరువుకు నీళ్లిస్తే బంగారం పండిస్తారు

నాడు 90 శాతం సబ్సిడికి మైక్రో ఇరిగేషన్  ఇచ్చాం, దీని వల్ల పండ్ల తోటలు పండించి లక్షలు సంపాదించారు, అది సంపద సృష్టించటం అంటే 

పోలవరం పూర్తి చేసి రాయలసీమకు నీళ్లివ్వాలనుకున్నా...పట్టి సీమ ద్వారా గోదావరి జలాలు కృష్టి డెల్టాకు తీసుకొచ్చి అక్కడ నుంచి గుత్తికి తీసుకొచ్చేలా శ్రీకారం చుట్టిన పార్టీ టీడీపీ

గుత్తి పట్టణంలో రూ. 173 కోట్లు త్రాగునీటి కోసం  కేటాయించాం,  దాన్ని పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది, 40 రోజులకు ఒక సారి కూడా నీళ్లివ్వటం లేదు

ఇసుకపై వీళ్ల బోడి పెత్తనం ఏంటి? సైకో ముఖ్యమంత్రి సైకో ఎమ్మెల్యేల ద్వారా అక్రమంగా ఇసుక అమ్ముకుంటున్నారు

నా విధానం అభివృద్ది  జగన్ విధానం విధ్వంసం

మద్యపాన నిషేదం చేస్తాన్నాడు చేశాడా?  మళ్లీ వచ్చి మీ చెవుల్లో పువ్వులు పెట్టాలనుకుంటున్నాడు, మీరంతా కలిసి జగన్ చెవిలో పూలు పెట్టాలి

విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చా..1995 నుంచి 2004 వరకు  మిగులు విద్యుత్ సాధించాం, 

తర్వా మళ్లీ నేను అధికారంలోకి వచ్చే 2014 నాటికి  22 మిలియన్ యూనిట్ల కరెంట్ కొరత ఉంది నేను వచ్చిన 100 రోజుల్లో మిగులు విద్యుత్ సాధించాం

ఏనాడైనా కరెంట్ చార్జీలు పెంచామా? కరెంట్ కోతలు విధించామా? సోలార్ విద్యుత్ ను రూ. 10 నుంచి రూ. 2 కి తగ్గించాం.

నేడు జగన్ అసమర్ద, అవినీతి వల్ల కరెంట్ చార్జీలు 8 సార్లు పెంచి పేదలను దోపిడి చేస్తున్నారు

గతంలో రూ. 200 బిల్లు కట్టేవారు, నేడు రూ. 800 నుంచి 1000 కడుతున్నారు

మీ గ్రామంలోనే సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది

ఉరవ కొండలో విండ్ మిల్లులు పెట్టి సాయంత్రం పూట గాలి ద్వారా కరెంట్ వచ్చేలా చేశాం

నేడు పంప్డ్ ఎనర్జీ ద్వారా హైడల్ విద్యుత్ ఉత్పత్తి చేయెచ్చు, ఇలా చేస్తే విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం లేదు

అనంతపురంలో ఎక్కువ భూమి, ఎండ దేవుడిచ్చాడు, దీన్ని ఉపయోగించుకుంటే సంపదే సంపద

పైన గ్రీన్ ప్యానల్ ఏర్పాటు చేసి దాని కింద కూరగాయలు పంటలు వేయెచ్చు, పైన కరెంట్ కింద కూరగాయలు పండించొచ్చు

ఇది సంపద సృష్టించే విధానం, ఇదే బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ

మనం వచ్చిన తరువాత ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15000 ఇస్తాను.

ఆడబిడ్డనిధి కింద నెలకు రూ.1500 ఇస్తా. ఏడాదికి రూ. 18 వేలు మీ అకౌంట్ లో వేస్తా. 18 వేలను రూ. లక్షా 80 వేలు చేసి దాన్ని రూ. 18 లక్షలకు పెంచే మార్గం చూపిస్తా

2047 నాటికి రాష్ర్రంలో పేదవాడు లేకుండా ఉండేలా చేసే శక్తి మనకు ఉంది, 

పి 4 విధానంతో పేదల్ని ధనికుల్ని చేస్తా.. 

దీపం పథకం కింద మూడు ఉచిత సిలిండర్లు ఇస్తాం. అవసరం అయితే అదనంగా మరో సిలిండర్ ఉచితంగా ఇస్తా

మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.

యువతకు యువగళం నిరుద్యోగ బృతి కింద నెలకు రూ.3వేలు ఇస్తా. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా.

ప్రపంచాన్ని మీ దగ్గర తెచ్చి మిమ్మల్ని శక్తివంతంగా తయారు చేస్తా....

టీడీపీ 5 ఏళ్ల రూ16 లక్షల కోట్ల పెట్టుబడులతో 5.30 లక్షల ఉద్యోగాలు కల్పించాం, 

నేను ఐటీ ఉద్యోగం ఇస్తే..ఈ సైకో ఇచ్చింది వాలంటీర్ ఉద్యోగాలు 

ఐటీ ఆయుధం మీకిస్తా...ప్రపంచంలో ఉండే ఐటీ కంపెనీలు మీ దగ్గర తెస్తా..వర్క్ ప్రం హోం ద్వారా ఇంటి దగ్గరే ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పిస్తా

మీ గ్రామాల్లోనే వర్క్ సెంటర్లు ఏర్పాటు చేస్తా...లేదంటే ఇతర నగరాలు, దేశాలకు వెళ్లే అవకాశం కల్పిస్తా

ఇదే మీ భవిష్యత్తుకు గ్యారెంటీ నా ష్యూరిటీ, ఇంటింటికి తిరిగి యువత అంతా  ఈ విషయాలు ప్రజలకు చెప్పండి

సైకిల్ ఎక్కి టీడీపీ జెండా పట్టుకోండి అదే మీ భవిష్యత్తుకు గ్యారెంటీ

అనంతపురంను హార్టికల్చర్ హబ్ గా మారుస్తా.. రైతులకు ఏడాదికి రూ. 20 వేలిస్తాం

బీసీలకు రక్షణ చట్టం తెస్తాం, గుత్తిలో ప్రాజెక్టు పూర్తి చేసి ఇంటింటికి కుళాయి ద్వారా నీళ్లిస్తాం

ఆటో డ్రైవర్ల జీవితం భయంకరంగా తయారైంది, 

కర్నాటక కంటే అనంతపురంలో డీజిల్ ధర లీటరుకు రూ.11.56 ఎక్కువ. అంటే 5 లీటర్లపై ఒక్కో డ్రైవర్ రోజుకు రూ.57 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. 

ఈ లెక్కన నెలకు రూ.1,710, ఏడాదికి రూ.20,520 గుంజుతున్నాడు. అంటే 5 ఏళ్లలో రూ.లక్ష గుంజుతున్నాడు

రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి....వీటి వల్ల ఆటోలు, క్యాబులు తీవ్రంగా రిపేర్లకు వస్తున్నాయి. ఒక సారి షెడ్ కు వెళితే రూ5 వేలు, రూ.10 వేలు ఖర్చు.

జగన్ పాలనలో పెనాల్టీల బాదుడూ ఎక్కువే. బీమా లేదని, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కాలేదని, కాకీ చొక్కా వేసుకోలేదని, స్పీడ్ అని, రాంగ్ రూట్ అని, ఫిట్ నెస్ సర్టిఫికెట్ అని భారీగా బాదుతున్నాడు. 

ఇక రవాణా వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ లద్వారా రవాణా రంగం మొత్తం నాశనం అయ్యింది. 

గ్రీన్ ట్యాక్స్ కర్ణాటకలో రూ. 200, తమిళనాడులో రూ. 500 మాత్రమే కానీ ఏపీలో  గ్రీన్ ట్రాక్స్ మూడు శ్లాబులుగా మార్చి భారీగా పెంచారు. 

ఏడాదికి రూ. 200 ఉన్న పన్నును కనిష్టంగా రూ.2395 నుంచి గరిష్టంగా రూ. 30,820 వరకు పెంచారు.

మన రాష్ట్రంలో త్రైమాసిక పన్ను కింద రూ. 43,640, హరిత పన్ను 21,820, నేషనల్ పర్మిట్ ట్యాక్స్ రూ. 17 వేలు  చెల్లించాలి. ఇవన్నీ కలిపితే రూ. 82,460 అవుతుంది.  

మళ్లీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ దాదాపు రూ. 50 వేల వరకు కట్టాలి. అంటే మొత్తంగా 1.32 లక్షలు కట్టాలి.

ఈ ముఖ్యమంత్రి చాలా పేదవాడు కానీ కన్న కూతురిని చూడడానికి రూ. 40 కోట్ల ప్రజల డబ్బుతో ప్రత్యేకంగా చార్టెడ్ ప్లైట్ లో లండన్ వెళ్లారు

ఈ పేదవాడికి కూతురుపై ఉన్న ప్రేమ రూ. 40 కోట్లు 

మనం పిల్లల్ని సరిగా చదివించే పరిస్థితి లేదు, కానీ మన రాష్ట్రంలో పేదవాళ్లు మాత్రం కూతురిని చూడడానికి రూ. 40 కోట్లు ఖర్చు చేస్తారని ప్రపంచానికి చాటి చెప్పిన నిరుపేద జగన్ 

గుంతకల్లు, గుత్తిలో రూ. 517 కోట్లతో 602 టిడ్కో ఇళ్లు 80 శాతం నిర్మించాం, కానీ వాటికి రంగులు వేసుకుని పేదలకు పంచకుండా చేశారు

కూతుర్ని చూసేందుకు రూ. 40 కోట్లు ఖర్చు పెట్టిన సీఎంకి మీ ఇళ్లు పూర్తి చేయటానికి మనస్సు రాలేదు

హంద్రీనీవాపై రాగుల పాడు వద్ద లిప్ట్ ఇరిగేషన్ పెట్టి 13 చెరువులకు నీళ్లివ్వాలని రూ. 42 లక్షల శాంక్షన్ చేశాం, కానీ ఆ పని చేశాడా?

గుత్తి పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ. 173 కోట్లు, మామిడిపట్నానికి రూ.69 కోట్లు ఇచ్చాం నీళ్లిచ్చారా? నీళ్లివ్వలేని వ్యక్తికి ఓటు అడిగే హక్కు ఉందా?

గుత్తిలో మైనార్టీ స్కూల్, జూనియర్ కాలేజీ, పాల్ టెక్నిక్ కాలేజీకి రూ. 38 కోట్లతో భవనాలు నిర్మిస్తే వాటిలో  ఆర్డీవో ఆఫీసు పెట్టారు,  అది మైనార్టీలపై జగన్ కి  ఉన్న ప్రేమ

గుంతకల్లు నుంచి కసాపురం వెళ్లే దారిలో రైల్వే అండర్ బ్రిడ్డి నిర్మించారా?  గుంతకల్లులో ఇండోర్ స్టేడియయం పూర్తి చేశారా? అంబేద్కర్ భవనాన్ని పూర్తి చేయలేదు

గుత్తి కోట, కసాపురం ఆంజనేయ స్వామి దేవాలయంకు, బంజారాల ఆరాధ్య దైవం సేవా ఘడ్ అభివృద్దికి డబ్బులిచ్చా... పర్యాటకం కేంద్రంగా చేయాలనుకున్నా..కానీ వీళ్లు విధ్వసం చేశారు

ఇక్కడ ఎమ్మెల్యే కుటుంబమంతా ఎమ్మెల్యేలే, దోపిడి దారులే...ఆదోనిలో ఒక ఎమ్మెల్యే, మంత్రాలయంలో ఒక ఎమ్మెల్యే, ఉరవకొండలో ఎమ్మెల్సీ, వీళ్ల బావమరిది ఒక మంత్రి, అన్న టీటీడీ బోర్డు మెంబర్... వీళ్ల దోపిడికి హద్దే లేదు

కొండల్ని తవ్వి గుట్టల్ని మింగుతున్నారు, జగన్ ముందు నీ ఎమ్మెల్యేల సంగతి చూడు నా  సంగతి ఏం చూస్తావ్  ? 

దోచుకోవడం దాచుకోవటమే  వీళ్ల పని, మామిడి మండలంలో చిత్రావతి నది నుంచి ఇసుక తెచ్చి గుంతకల్లు మార్కెట్ యార్డులో ర్యాంప్ పెట్టి అమ్ముతున్నారు

ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యేకు ముడుపువ్వాలి

టీడీపీ అధికారంలోకి రాగానే గుత్తి, గుంతకల్లు మంచినీటి సమస్య పరిష్కరిస్తాం

హంద్రి నీవా ద్వారా అన్ని చెరువులకు నీళ్లిప్పిస్తాం..బుడగ జంగాలకు కుల ద్రువీకరణ పత్రాలు ఇప్పిస్తాం

ఆగిన పధకాలు అందిస్తాం,  ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తా...అదే నా ష్యూరిటీ

భవిష్యత్ తరాల కోసమే నేను పని చేస్తున్నా...రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజా ఉద్యమం చేస్తున్నా..ఇందులో ప్రజలంతా భాగస్వాములు కావాలి.

Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image