ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన టెక్‌ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని.


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన టెక్‌ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని.


ఏపీలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో మూడు 5 స్టార్‌ నుంచి 7 స్టార్‌ హోటల్స్‌ నిర్మాణానికి సంసిద్దత వ్యక్తం చేసిన మహీంద్ర గ్రూప్‌.


ఒక్కో హోటల్‌ నిర్మాణానికి రూ. 250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎంకి వివరించిన మహీంద్ర గ్రూప్‌ ప్రతినిధులు.


ఏపీలో పర్యాటక రంగం అభివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి మహీంద్ర గ్రూప్‌ ప్రతినిధులతో చర్చించిన సీఎం.


విశాఖ సహా మరో 2 పర్యాటక ప్రాంతాల్లో స్టార్‌ హోటల్స్‌ నిర్మాణం చేపట్టనున్న మహీంద్ర గ్రూప్, వచ్చే 2 నెలల్లో శంకుస్ధాపనకు సమాయత్తమవుతున్నట్లు వెల్లడి.


ఈ సమావేశంలో పాల్గొన్న మహీంద్ర గ్రూప్‌ గ్లోబల్‌ హెడ్, అడ్మినిస్ట్రేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సీవీఎన్‌ వర్మ, క్లబ్‌ మహీంద్ర సీవోవో సంతోష్‌ రామన్, టెక్‌ మహీంద్ర విజయవాడ అడ్మిన్‌ మేనేజర్‌ బిరుదుగడ్డ జయపాల్‌.

Comments