జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా లక్ష మంది పేదలకు రిఫరల్ సేవలు.

 *ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ*



*జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా లక్ష మంది పేదలకు రిఫరల్ సేవలు


*


*జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న ప్రజలు*


*ముఖ్యమంత్రి ఆశయానికనుగుణంగా పగడ్బందీగా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల నిర్వహణ*


*45 రోజుల పాటు ఆరోగ్యశ్రీ పై స్పెషల్ డ్రైవ్*


*పెద్ద ఎత్తున ఆరోగ్యశ్రీ యాప్ల డౌన్లోడ్ కు చర్యలు*


*వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు*


మంగళగిరి, గుంటూరు జిల్లా, అక్టోబర్31 (ప్రజా అమరావతి);


జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు ఇప్పటి వరకు 55 లక్షల మంది ఓపీకి 

రాగా , వీరిలో దాదాపు లక్ష మందికి ఆరోగ్యశ్రీ కింద మెరుగైన వైద్యానికి డాక్టర్లు రిఫరల్ కు పంపించారని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు అన్నారు. కేవలం రిఫరల్ తో ఆగిపోకుండా చికిత్స అనంతరం తిరిగి గ్రామాలకొచ్చాక కూడా ఆయా పేషంట్ లు ఏమేరకు సంతృప్తి పొందారో ఫీడ్ బ్యాక్ తీసుకుని బాగుందని సంతృప్తి చెందే వరకూ ప‌ర్యవేక్షించాని ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి సూచించారన్నారు. ఆ దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. 

మంగళగి‌రి టిడ్కో ఇళ్ల సముదాయాల మార్కండేయ కాలనీ అర్బన్ ప్రయిమరీ 

హెల్త్ సెంటర్లో నిర్వహిస్తున్న జగనన్న ఆ‌రోగ్య సురక్ష శిబిరాన్ని మంగళవారం నాడు ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ‌రోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, ఆరోగ్యశ్రీ సిఇవో ఎం.యన్.హ‌రీంద‌‌ర ప్రసాద్, గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రావణ్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ గతంలో ఒక యుపిహెచ్సి పరిథిలో ఒక జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని నిర్వహించాలనుకున్నామనీ , అయితే ప్రతి వార్డు సచివాలయంలో కూడా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. అలాగే ఆరోగ్య శ్రీ యాప్ లను  వాలంటీర్ల ద్వారా డౌన్లోడ్ చేయించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తద్వారా సమీపంలో ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు,ఆరోగ్య మిత్రల ఫోన్ నంబర్లు వంటి సమాచారం యాప్ ద్వారా అందుబాటులోకొస్తాయన్నారు. అలాగే ఆరోగ్య శ్రీకి సంబంధించి పూర్తి సమాచారంతో ముద్రించిన బ్రోచర్లను కూడా ఇంటింటికీ పంపిణీ చేశామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకూ 12 వేలకు పైగా శిబిరాల్ని నిర్వహించామనీ, సరాసరి 450 ఓపీలు నమోదయ్యాయనీ కృష్ణ బాబు పేర్కొన్నారు. వీరందరికీ పరీక్షలు, మందులతో పాటు స్పెషలిస్ట్ డాక్టర్ల సేవల్ని ఉచితంగా అందించామన్నారు. అవసరమైన వారికి మెరుగైన వైద్యం కోసం రిఫరల్ కూడా చేశారన్నారు. ఆరోగ్య శ్రీ పై కూడా పెద్ద ఎత్తున అవగాహన కల్పించామన్నారు. పేద ప్రజలకు ఏరకమైన ఆరోగ్య సమస్య  వచ్చినా ప్రభుత్వం నుండి ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశమన్నా‌రు. ఆరోగ్య శ్రీపై  ప్రజలకు  విస్తృతమైన అవగాహన కల్పించేందుకు 45 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ ను చేపడతామన్నారు. ఆరోగ్యశ్రీ యాప్ ను పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేసేందుకు ఎఎన్ ఎం/సిహెచ్వోలు   వాలంటీర్ల తో కలిసి పనిచేస్తారని కృష్ణ బాబు తెలిపారు.


*వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు ఆకస్మిక తనిఖీ*


గ్రామాల్లో అక్కడికక్కడే పూర్తి స్థాయి షుగ‌ర్ టెస్టులు చేయడానికి చర్యలు


తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చెయ్యాలని కమీషనర్ నివాస్ , ఆరోగ్య శ్రీ సిఇవో హరీంధరప్రసాద్ లకు ఆదేశాలు


మంగళగిరి టిడ్కో కాలనీ, మార్కండేయ కాలనీ యుపిహెచ్సీలోని జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని తనిఖీ చేసిన కృష్ణ బాబు


ఆరోగ్య శ్రీ బ్రోచర్ ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారా అని ఆరా


ఆరోగ్యశ్రీ బ్రోచర్లోని సమాచారాన్ని చదివారా అని రోగుల్ని అడిగి తెలుసుకున్న కృష్ణ బాబు


శిబిరానికొచ్చిన రోగులు‌ , వృద్ధులు, గర్భిణులతో మాట్లాడిన కృష్ణ బాబు


ఆరోగ్య శ్రీ యాప్ ను ఎఎన్ఎంలు  డౌన్లోడ్ చేయిస్తున్నా‌రా అని ఆరా


జగనన్న ఆరోగ్య సురక్ష బ్యాగులు , ఫోల్డర్లు సరిపడా ఉన్నాయా లేదా


డాక్టర్ దగ్గర డేటా ఎంట్రీ ఆపరేటర్ అందుబాటులో లేకపోతే ఎలా అంటూ

ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కృష్ణ బాబు


Comments