అమరావతి (ప్రజా అమరావతి);
*క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.*
*జగనన్న ఆరోగ్య సురక్షపై సీఎంకు వివరాలందించిన అధికారులు.*
– జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా అక్టోబరు 11, 2023 వరకూ 1,22,69,512 కుటుంబాలపై సర్వే చేసిన ఆరోగ్య సిబ్బంది.
– ఇప్పటివరకూ మొత్తంగా 3,17,65,600 మందిని కవర్ చేసిన ఆరోగ్య సిబ్బంది.
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే...:*
– జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకమైనది: సీఎం
– ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టనే కాదు, వైద్య ఆరోగ్య శాఖ ప్రతిష్టను కూడా పెంచుతుంది: సీఎం
– ఈ కార్యక్రమంలో రోగులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందాలి : సీఎం.
– రోగులకు ఇస్తున్న సదుపాయాలు మెరుగ్గా ఉండాలి: సీఎం.
– ప్రతి కలెక్టర్కూ దీనిపై ప్రత్యేక ఆదేశాలు ఇవ్వండి: సీఎం.
– కలెక్టర్కు మరిన్ని నిధులు ఇవ్వండి : సీఎం.
– ఒకవైపు హెల్త్క్యాంపులను నిర్వహించడమే కాదు, చికిత్స అవసరమని గుర్తించిన వారి ఆరోగ్యం బాగు అయ్యేంతవరకూ చేయిపట్టుకుని నడిపించాలి, చేయూతను అందించడంలో ఇది మొదటిది:
– అలాగే ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పాత పేషెంట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి :
– పాత పేషెంట్ల విషయంలో చేయిపట్టుకుని నడిపించాలి :
– చికిత్స అనంతరం వీరు వాడాల్సిన మందుల విషయంలో అవి ఖరీదైనా సరే వారికి అందించాల్సిన బాధ్యత ఉంది, ఇది రెండో అంశం :
– క్రమం తప్పకుండా వారికి చెకప్లు చేసే బాధ్యత తీసుకోవాలి:
– ఆరోగ్య శ్రీలో కవర్ కాకుండా గతంలో చికిత్సలు చేయించుకున్న పాత రోగుల విషయంలో కూడా వారికి చేయూతను అందించడం అన్నది మూడో బాధ్యత :
– వీరి బాధ్యతను కూడా తీసుకునేలా ఎస్ఓపీని రూపొందించండి :
– ఆరోగ్య పరంగా, చికిత్సల పరంగా, చెకప్ల పరంగా, మందులపరంగా ఎవరికి ఏ అవసరాలు ఉన్నా వారికి అవి తీర్చే దిశగా ఈ చేయూత ఉండాలి:
– ప్రతి సచివాలయం వారీగా ఇలా ఎవరెవరు ఉన్నారనేది వివరాలు తీసుకోండి:
– దీనికి అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే సమకూరుస్తుంది:
– విలేజ్క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లతో దీన్ని అనుసంధానం చేయాలి:
– అంతే కాకుండా క్రమం తప్పకుండా హెల్త్క్యాంపులను నిర్వహించాలి:
- ప్రతీ నెలకు మండలంలో నాలుగు సచివాలయాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలి :
– రోగుల సంతృప్తి, క్యాంపుల్లో సదుపాయాలు, రోగులకు చేయూత నందించడం, ఆరోగ్య సురక్ష కార్యక్రమంమీద అవగాహన, విస్తృత ప్రచారం ఈ 4 అంశాలమీద తప్పనిసరిగా సమీక్ష చేసుకోవాలి:
- ఆరోగ్య సురక్ష మీద ప్రతి వారం క్రమం తప్పకుండా నా దగ్గర సమీక్షలు చేయాలి:
– ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలని తెలియని వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు:
– ఆరోగ్య శ్రీ చికిత్సల కోసం వెళ్లే రోగులకు ప్రయాణ ఛార్జీలుకూడా ఇవ్వాలని సీఎం ఆదేశం.
– ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా ఆరోగ్య శ్రీ యాప్ని డౌన్లోడ్ చేయాలి:
– దీని వల్ల పర్యవేక్షణ మరింత సులభతరం అవుతుంది.
– క్యాంపులకు స్పెషలిస్టులను పంపే విషయంలో మరింత శ్రద్ధ వహించాలి:
– ఎక్కడా కూడా తొందరపాటు లేకుండా రోగులకు మంచి సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి :
– క్యాంపులకు తప్పనిసరిగా నలుగురు వైద్యులు వెళ్లాలి, అందులో ఇద్దరు స్పెషలిస్టులు ఉండేలా చూడాలి :
– దీనికి తగినట్టుగా స్పెషలిస్టులను అందుబాటులో ఉంచేలా చూసుకోవాలి:
– అలాగే పరీక్షలు చేసేటప్పుడు మరింత నిర్ధారణ కోసం అదనపు పరీక్షలు కూడా చేసి, సరైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలి:
– ఇప్పటివరకూ 5216 ఆరోగ్య సురక్ష క్యాంపుల నిర్వహించామని తెలిపిన అధికారులు.
సగటున ఒక్కో క్యాంపులో 357 మంది వస్తున్నట్టు వెల్లడి.
– క్యాంపుల ద్వారా దాదాపు 2841 మంది రక్తహీనత ఉన్న బాలికలను గుర్తించామని, వీరికి అన్నిరకాలుగా మందులు, పౌష్టికాహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి.
– రక్తహీనతతో ఉన్నవారిని గుర్తించిన వారికి పౌష్టికాహారాన్ని అక్కడే అందించేలా ఎస్ఓపీ రూపొందించాలన్న సీఎం.
– పుట్టుకతోనే వివిధ రోగాలతో బాధపడుతున్న వారికి 251 మందిని శిబిరాల్లో గుర్తించామన్న అధికారులు.
– అలాగే దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలోనూ మార్పులు రావాలన్న సీఎం.
– నిపుణులైన వైద్యులు ఆరోగ్య సురక్షా శిబిరాలకు వస్తున్నప్పుడు అక్కడే వీరికి సర్టిఫికెట్లు జారీచేసేలా ఆలోచన చేయాలన్న సీఎం.
– తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న వారికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, వారికి అవసరమైన ఖరీదైన మందులు అందించే కార్యక్రమం కూడా జరగాలన్న సీఎం.
– నాకు మందులు అందడంలేదన్న మాట రోగులనుంచి రాకూడదన్న సీఎం.
– తిరుపతి తరహాలోనే చిన్నపిల్లలకోసం అత్యాధునిక ఆస్పత్రిని విజయవాడ–గుంటూరు, విశాఖపట్నంలలో ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం.
ప్రకాశం జిల్లాలో కూడా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్న సీఎం.
*ఆస్పత్రుల్లో నాడు – నేడు, కొత్త మెడికల్కాలేజీల నిర్మాణ ప్రగతిపై సీఎం సమీక్ష.*
కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణ పనుల్లో పురోగతిని సీఎంకు వివరించిన అధికారులు.
అర్భన్ హెల్త్ క్లినిక్కులు నిర్మాణ పనులను కూడా నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పూర్తి చేస్తామన్న అధికారులు.
addComments
Post a Comment