పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి.

 పోలవరం ప్రాజెక్టు పనులు  పరిశీలించిన రాష్ట్ర  జల వనరుల శాఖ మంత్రి



 ఎగువ, దిగువ కాపర్ డ్యాం ల  మధ్య సి ఫేస్  ఎక్కువ ఉండడంతో  వేగవంతంగా పనులు జరగడం  లేదు


 దెబ్బతిన్న డయా ఫ్రమ్ వాల్ కి సమాంతరంగా రిపేర్ లేదా  కొత్తగా కట్టే అంశంలో కేంద్ర జల  శక్తి శాఖ నిర్ణయం తీసుకోవలసి  ఉంది


 రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి  రాంబాబు.

తెలంగాణ వీణ,ఏపీ బ్యూరో :


ఏలూరు/ పొలవరం /అక్టోబర్ 25 (ప్రజా అమరావతి): లోయర్ అప్పర్, కాపర్ డ్యాం ల మధ్య నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్టు పనులు  వేగవంతంగా జరపడానికి అవరోధంగా ఉందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.  


బుధవారం రాష్ట్రజల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు పనులను ప్రాజెక్ట్ ఇంజనీర్లతో కలిసి పరిశీలించారు. ఈ పరిశీలనలో ఎగువ, దిగువ కాపర్ డ్యాముల మధ్య ఉన్న సి ఫేజు నీటిని మళ్లించేందుకు నిర్మాణం చేస్తున్న కాలువ పనులను మంత్రి పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది.

అనంతరం పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ ఎగువ దిగువ కాపర్ డ్యామ్ ల మధ్య ఉన్న సిపిఎస్ నీటిని మళ్లించేందుకు నిర్మాణం చేస్తున్న కాలువ పనులను పరిశీలించడం జరిగిందని తెలిపారు. 


దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ కి సమాంతరంగాగ రిపేరు చేయడమా, కొత్తది నిర్మించడమా అనే దానిమీద కేంద్ర జల శక్తి నిర్ణయం తీసుకోవలసి ఉన్నదని, వారి  నిర్ణయం అనంతరం పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. దిగువ, ఎగువ కాపర్ డ్యామ్ ల మధ్య ఏరియాలో డి వాటర్ వర్క్స్ జరుగుతున్నాయని వాటర్ వర్క్స్ అనంతరం వైబ్రో కంపాక్ట్ కాంపౌండ్ మొదలవుతాయని మంత్రి తెలిపారు.


గత ప్రభుత్వంలో 41.15 కాంటూరు వరకు వేసిన అంచనాలకు నేటికీ ఖర్చు పెరిగిందని తెలిపారు. దీని ప్రకారం 31,625, కోట్ల రూపాయలు సిడబ్ల్యుసి రివైజ్డ్ కాస్ట్ కి కమిటీకి బిల్లును పంపడం జరిగిందని తెలిపారు. 


ఈ బిల్లును క్యాబినెట్లో అంగీకరించిన తర్వాత రియంబర్స్మెంట్ నగదు వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ బిల్లు క్యాబినెట్లో పెండింగ్లో ఉందని తెలిపారు. దీన్నిబట్టి 45.72 కోట్లుకు  కాటూరు వరకు మరో పదహారు వేల కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పారు. 41.15 వరకు పూర్తయ్యాక మిగిలిన వాటి గురించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. దీని నిమిత్తం కేంద్రం నుండి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక పర్యాయములు ప్రధానమంత్రిని కలిసి తెలియజేయడం జరిగిందని తెలిపారు.


 ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన  స్పష్టం చేశారు  .


ఈ కార్యక్రమం అనంతరం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని    రాష్ట్ర  జన వనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు పరిశీలించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో పోలవరం చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి, ఎస్ ఈ సుధాకర్ బాబు, పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఎస్ ఈ శ్యామ ప్రసాద్, ఈఈ ఏసుబాబు, తదితర విభాగాల ఇంజనీర్లు పాల్గొన్నారు.

Comments