రైతుల నోటికాడి బుక్కను గుంజుకున్న కాంగ్రెస్‌: ఎమ్మెల్సీ కవిత*

 రైతుల నోటికాడి బుక్కను గుంజుకున్న కాంగ్రెస్‌: ఎమ్మెల్సీ కవిత.



నిజామాబాద్‌ (ప్రజా అమరావతి): కాంగ్రెస్‌ పార్టీ తన రైతు వ్యతిరేక విధానాన్ని మరోసారి రుజువు చేసుకున్నదని ఎమ్మెల్సీ కవిత  అన్నారు. రైతుల నోటికాడ బుక్కను గుంజుకుందని విమర్శించారు. ఆ పార్టీ నాయకులు వెంబటబడి రైతు బంధును నిలిపివేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. రైతు బంధు ఎన్నికల కోసం పెట్టిన పథకం కాదని చెప్పారు. ఇప్పటికే రూ.72 వేల కోట్లు రైతుబంధు రూపంలో రైతుల ఖాతాల్లో వేశామన్నారు. రైతులంతా బీఆర్‌ఎస్‌ వైపు ఉన్నారన్న అభద్రతలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నదని విమర్శించారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్‌ మరోసారి రైతులను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించిందన్నారు. అన్నదాతలంతా ఓటు ద్వారా ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. రైతుబంధు కావాలా.. రాబందులు కావాలా అని ప్రశ్నించారు.


మతం పేరుతో ఒక పార్టీ, కులం పేరుతో మరోపార్టీ నడుస్తున్నదని విమర్శించారు. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక ముసాయిదా తయారు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో నిరుపేదలకు వరమని చెప్పారు. బీఆర్‌ఎస్‌ను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలన్నారు. విభజన హామీలపై కాంగ్రెస్‌ నాయకులు ఏనాడూ మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణపై కేంద్ర విషం చిమ్ముతున్నదని చెప్పారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ వెయ్యి బుల్డోజర్లు పంపినా కారుతో సమాధానం చెబుతామన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ అగ్రనేతలు తెలంగాణపై మిడతల దండులా తెలంగాణపై పడ్డారన్నారు.

తమది ఎంప్లాయీస్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించామని చెప్పారు. ఉపాధి హామీ కూలీల ప్రయోజనాలపై కాంగ్రెస్‌ ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. పేదలు, మధ్యతరగతి వర్గాలపై కాంగ్రెస్‌ పార్టీకి ప్రమలేదన్నారు.


సింగరేణిని ప్రైవేటుకు అప్పగించిందే హస్తంపార్టీ అన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ప్రియాంకా గాంధీ చదువుతున్నారని ఎద్దేవాచేశారు. రాహుల్‌ గాంధీ జోడో యాత్రలో తెలంగాణ ప్రస్తావన లేదన్నారు. బీజేపీని కాంగ్రెస్‌ నేతలు ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ రెండు పార్టీల నేతలంతా ఎక్కడున్నారని నిలదీశారు. బీజేపీ హయాంలో బాగుపడ్డది కేవలం కార్పొరేట్లు మాత్రమేనని విమర్శించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. చెందిందన్నారు.

Comments