జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ “బాక్సింగ్ ” అండర్ – 17 , 19 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బృందానికి పతకాలు.

విజయవాడ (ప్రజా అమరావతి);

జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ “బాక్సింగ్ ”   అండర్ – 17 , 19  బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బృందానికి పతకాలు



క్రీడాకారులను అభినందించిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్ష ఎస్పీడీ

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న 67వ జాతీయ స్కూల్ గేమ్స్ “బాక్సింగ్ ”   అండర్ - 17 ,19  బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు  కాంస్య పతకాలు  దక్కించుకున్నారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తిరాజు తెలిపారు. 

ఈ పోటీలు జనవరి 3 నుంచి జనవరి 10 వరకు ఢిల్లీ   లో జరిగాయని తెలిపారు.  ఈ సందర్భంగా క్రీడాకారులను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ , సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు  ప్రత్యేక అభినందనలు తెలిపారు. 

విజేతలు వీరే:

అండర్ 19  బాలికల (45-48 కేజీలు) విభాగంలో మొహ్మద్ హీనా కౌసర్  (నారాయణ జూనియర్ కాలేజీ ,విశాఖపట్నం)  కాంస్య  పతకం సాధించారు.

అండర్ 19 బాలికల (48-51 కేజీలు ) విభాగంలో కోలుసు నిహారిక  (విశాఖ గవర్నమెంట్ జూనియర్ కాలేజి,విశాఖపట్నం ) కాంస్య  పతకం సాధించారు.

అండర్ 19 బాలికల (51-54  కేజీలు) విభాగంలో గంగవరపు అక్షిత  (గవర్నమెంట్ జూనియర్ కాలేజి ,రాజమహేంద్రవరం,తూర్పు గోదావరి జిల్లా) కాంస్య  పతకం సాధించారు.

అండర్ 17 బాలురు (46-48  కేజీలు) విభాగంలో మైలపిల్లి మేఘన ,సెయింట్ జాన్స్ పారిష్  స్కూల్ ,విశాఖపట్నం జిల్లా )  కాంస్య  పతకం సాధించారు. 


Comments