అందరికీ సీట్లు, టికెట్లు ఇవ్వలేం : వైవీ సుబ్బారెడ్డి.
విశాఖపట్నం (ప్రజా అమరావతి);
వచ్చే ఎన్నికల్లో కొందరికి టికెట్లు ఇచ్చే అవకాశాలు లేవని.. అందుకే పార్టీ మారుతున్నారని వైసిపి నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో అందరూ సీట్లు, టికెట్లు ఆశించడం సహజమే. అందరికీ సీట్లు, టికెట్లు ఇవ్వలేం. దాడి వీరభద్రరావు రాజీనామాతో పార్టీకేమీ నష్టం లేదు. ప్రజలంతా సీఎం జగన్ వెంటే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
addComments
Post a Comment