డీపీఓ కార్యాలయంలో ఘనంగా ఓటర్లు దినోత్సవం.

 డీపీఓ కార్యాలయంలో ఘనంగా ఓటర్లు దినోత్సవం.



స్వేచ్చాయుత, నిక్షపక్షపాత, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వాహణకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని పిలుపు


సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్


ఏలూరు (ప్రజా అమరావతి): 14వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు జిల్లా పంచాయతీ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఓటు వేయడం లాంటిది మరొకటి లేదని, నేను తప్పకుండ ఓటు వేస్తానని అనే ఎన్నికల సంఘం 2024 సంవత్సరం నినాదంతో జిల్లా గ్రామ పంచాయతీ కార్యాలయం సిబ్బంది జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సందర్బంగా డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ స్వేచ్చాయుత, నిక్షపక్షపాత, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని, ఎన్నికల నియమావాళి మేరకు ఉద్యోగులు విధులు నిర్వహించాలని డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్. అనంతరం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సీనియర్ సహాయకులు కిషోర్, సురేష్, జూనియర్ సహాయకులు సునీత, విజయ తదితరులు పాల్గొన్నారు.


Comments