కొల్లిపర మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంగం నూతన అధ్యక్షునిగా అరిమండ. కృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం.

   కొల్లిపర (ప్రజా అమరావతి );          గుంటూరు జిల్లా కొల్లిపర మండల ప్రాథమిక వ్యవసాయ  సహకార పరపతి సంగం నూతన అధ్యక్షునిగా అరిమండ.  కృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం



చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ మాట్లాడుతూ కొల్లిపర మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ మంచి సొసైటీ అని కొనియాడారు. అంతకు ముందు ఉన్న సొసైటీ అధ్యక్షులు బొంతు. శ్రీనివాస్ రెడ్డి కూడా బాగా పనిచేశారని తెలిపారు. ఈ సొసైటీ ద్వారా ఎక్కువ మంది రైతులకు ఉపయోగపడే విధంగా సర్వీసు చేసిన సొసైటీ అని అన్నారు .   అరిమండ.  కృష్ణారెడ్డి అధ్యక్షులుగా  ప్రమాణ స్వీకారం చేయు సభలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గ్రామ రైతాంగం అవసరాలన్నీ సొసైటీ ద్వారా నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వానికి, సొసైటీకి, గ్రామంలో ఉన్న రైతాంగానికి ఉపయోగపడాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. సంఘం అధ్యక్షులతోపాటు సభ్యులుగా రెడ్డి. శివనాగిరెడ్డి, భీమవరపు. రవీంద్రారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి డివిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ అధికారి టి. శోభన్ బాబు, కొల్లిపర సొసైటీ మంచి సేవ చేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భీమవరం పద్మావతి, గ్రామ సర్పంచ్ పిల్లి రాధిక, గ్రామ వైసిపి నాయకులు భీమవరపు. శివకోటిరెడ్డి ,     తుములురు సొసైటీ అధ్యక్షులు  ఈమని  హరికోటి  రెడ్డి, కొల్లిపర  ఎంపీపీ ఝాన్సీ, సొసైటీ సీఈవో గుదిబండి. నాగిరెడ్డి, మండలంలో ఉన్న సొసైటీ అధ్యక్షులు, వైసీపీ నాయకులు,   రైతులు పాల్గొన్నారు.

Comments