నేషనల్ డెంటల్ కమిషన్ కొత్త ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా.



 నేషనల్ డెంటల్ కమిషన్ కొత్త ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా

ఆంధ్రప్రదేశ్‌లో 3  జమ్మూ,  కాశ్మీర్‌లో 1 నర్సింగ్ కళాశాలలకు శంకుస్థాపన 

డా. మాండవ్య  చే నేషనల్ డెంటల్ కమిషన్ నేషనల్ డెంటల్ రిజిస్టర్‌  ప్రారంభం

 డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందానికి మంత్రి అధ్యక్షత 

డెంటల్ కమీషన్ ఆగమనం దంత విద్య పరిపాలనలో కొత్త శకాన్ని సూచిస్తుంది. డెంటల్ కమీషన్ చట్టం ద్వారా, దంత విద్యను మరింత ఆచరణాత్మకంగా, సరసమైనదిగా, మొత్తం వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది, రోగులకు  అందుబాటులో మంచి చికిత్సను అందిస్తుంది : డాక్టర్ మన్సుఖ్ మాండవియా

"


 నోటి ఆరోగ్యం గురించి విస్తృతంగా అవగాహన కల్పించడం,  నోటి ఆరోగ్య సంరక్షణ దిశలో మరిన్ని అవకాశాలను సృష్టించడం మా సంకల్పం "



న్యూఢిల్లీ 5 ఫిబ్రవరి (ప్రజా అమరావతి);

కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి ఆంధ్రప్రదేశ్‌లో మూడు జమ్మూ .. కాశ్మీర్‌లో ఒక నర్సింగ్ కళాశాలలకు శంకుస్థాపన చేశారు.   అదనంగా, అండర్ గ్రాడ్యుయేట్ డెంటల్ కాలేజీల అంచనా, రేటింగ్ కోసం డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందానికి డాక్టర్ మాండవ్య అధ్యక్షత వహించారు. నేషనల్ హెల్త్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ డెంటల్ రిజిస్టర్‌ను ప్రారంభించారు. డాక్టర్ మాండవ్యతో త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా .. జమ్మూ .. కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా వర్చువల్ గా పాల్గొన్నారు.


"దంత వైద్య కమీషన్ - ఆగమనం దంత విద్య .. పరిపాలనలో కొత్త శకానికి నాంది పలికింది" అని డాక్టర్ మాండవ్య పేర్కొన్నారు. "డెంటల్ కమిషన్ చట్టం ద్వారా, దంత విద్యను మరింత ఆచరణాత్మకంగా, సరసమైనదిగా .. మొత్తం వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది, రోగులకు సరసమైన మంచి చికిత్స అందుతుంది." "మన దేశానికి ప్రయోజనం చేకూర్చే ఈ డొమైన్‌లోని అపారమైన అవకాశాలను ఉపయోగించుకునేందుకు వీలుగా నోటి పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం అత్యవసరం" అని డాక్టర్ మాండవ్య ప్రకటించారు. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దార్శనికత‌ను ప్రస్తావిస్తూ , డా. మాండ‌వియ ఆరోగ్య సేవ‌ల సౌలభ్యం .. లభ్యతను పెంపొందించడం ద్వారా అందరి ప్రయోజనాల కోసం అందించిన మార్పుల పరిమాణాన్ని నొక్కి చెబుతూ ఆరోగ్యం పట్ల చురుకైన విధానాన్ని ప్రశంసించారు.


సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర ఆరోగ్య మంత్రి జాతీయ దంత రిజిస్టర్ (ఎన్‌డిఆర్)ను ప్రారంభించారు. వన్ నేషన్ వన్ రిజిస్టర్ కింద ఇది రూపొందింది, దేశ ప్రజలు పారదర్శక పద్ధతిలో దంతవైద్యుని గుర్తింపు .. అర్హతను పొందుతారని మంత్రి అన్నారు, ఇంకా మాట్లాడుతూ  “భారతదేశంలో ప్రాక్టీస్ చేస్తున్న దంతవైద్యులందరికీ సంబంధిత స్టేట్ డెంటల్ కౌన్సిల్ నుంచి ధృవీకరించిన తర్వాత NDR యునిక్ ఐడెంటిఫికేషన్ (DCI ID) అందిస్తుంది. రాష్ట్ర దంత మండలిచే ధృవీకరించిన దంతవైద్యులను గుర్తించడానికి కూడా NDR పౌరులకు సహాయం చేస్తుంది.


నర్సింగ్ వర్క్‌ ఫోర్స్‌ ను బలోపేతం చేయడానికి .. ప్రాంతాల అంతటా ఆరోగ్య సంరక్షణ అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వ నిబద్ధతను హైలైట్ చేస్తూ , డాక్టర్ మాండవ్య "ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీలతో కలిసి 157 కొత్త నర్సింగ్ కాలేజీలను స్థాపించే ప్రభుత్వ పథకంలో ఈ వేడుక ఒక భాగం ." అన్నారు  " ఆరోగ్యం .. వైద్య మౌలిక సదుపాయాల రంగంలో సాధించిన పురోగతులు నాణ్యమైన, అందుబాటులో  ఆరోగ్య సంరక్షణను అందిస్తాయి .. ఆరోగ్య సంరక్షణ రంగంలో అనేక అవకాశాలను తెరుస్తాయి, దేశానికి చాలా ప్రయోజనం చేకూరుస్తాయి " అని భరోసా వ్యక్తపరచారు విదేశాల్లో శిక్షణ పొందిన భారతీయ నర్సులకు పెరుగుతున్న డిమాండ్‌తో, జపాన్ లో ప్రారంభించిన విదేశీ భాషా కోర్సును ఉదహరిస్తూ విదేశాలలో అవకాశాలను పొందడంలో విద్యార్థులకు అదనపు ప్రయోజనాన్ని అందించే విదేశీ భాషా కోర్సులను అస్సాంలోని రెండు నర్సింగ్ కాలేజీలలో ప్రభుత్వం వైద్య విద్యా సంస్థల్లో చేర్చిందని ప్రకటించారు.

శ్రీ మాణిక్ సాహా ఆరోగ్య రంగంలో జరుగుతున్న పరివర్తనను ప్రశంసించారు .. "ఈ సంస్థల స్థాపన సామాన్యులకు సరసమైన ఆరోగ్య సంరక్షణ సేవలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది" అని పేర్కొన్నారు.


జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆరోగ్య సంరక్షణలో నర్సుల కీలక పాత్రను నొక్కిచెప్పారు .. నర్సింగ్ కళాశాలల స్థాపన అనేది ఆరోగ్య సంరక్షణలో అర్హత కలిగిన మానవ వనరులను నిర్మించడంలో ఆరోగ్య సంరక్షణ ఒక ముఖ్యమైన ముందడుగు అని అన్నారు..

ఆరోగ్య ,  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర, ఆరోగ్య,  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ విపుల్ అగర్వాల్, సీనియర్ ప్రభుత్వ అధికారులు, పద్మశ్రీ (1992), పద్మ భూషణ్ (2005) (HONY) పాల్గొన్నారు . BRIG. డాక్టర్ అనిల్ కోహ్లి, పద్మశ్రీ డాక్టర్ ఆర్కే బాలి, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డాక్టర్ దిబ్యేందు మజుందార్, డెంటల్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్, డాక్టర్ మోంటు ఎం. పటేల్, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, డాక్టర్ టి దిలీప్ కుమార్, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, అధ్యాపకులు, విద్యార్థులు,  సర్దార్ పటేల్ పోస్టు గ్రాడ్యుయేట్  ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ అండ్ మెడికల్ సైన్స్, రాజ్ భవన్ జమ్ము , బుద్ధ డెంటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, జమ్మూ .. కాశ్మీర్ నర్సింగ్ కాలేజ్ , మంచలీపట్నం నర్సింగ్ కాలేజ్, ఆంధ్రప్రదేశ్, డెంటల్ కాలేజ్, RIMS, రాంచీ , సవీత డెంటల్ కాలేజ్, చెన్నై, శిక్ష 'ఓ' అనుసంధన్ (IDS) నుంచి కూడా ఈ కార్యక్రంలో పాల్గొన్నారు.

Comments