తిరుమ‌ల‌లో ధార్మిక స‌ద‌స్సు ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన – టీటీడీ ఛైర్మ‌న్‌ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి.

 తిరుమ‌ల‌లో ధార్మిక స‌ద‌స్సు ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన – టీటీడీ ఛైర్మ‌న్‌ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి


తిరుమల,  ఫిబ్ర‌వరి 02 (ప్రజా అమరావతి): తిరుమ‌ల ఆస్థాన మండ‌పంలో ఫిబ్ర‌వ‌రి 3 నుండి 5వ తేదీ వ‌ర‌కు టీటీడీ హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నున్న‌ ధార్మిక స‌ద‌స్సు ఏర్పాట్ల‌ను టీటీడీ ఛైర్మ‌న్‌ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి శుక్ర‌వారం అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

మ‌ఠాధిప‌తులు, పీఠాధితుల స‌మావేశంలో కుర్చునేందుకు చేస్తున్న‌ ఏర్పాట్లు, భ‌ద్ర‌త‌, త‌దిత‌ర వాటిని ప‌రిశీలించి, సంబంధిత అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఛైర్మ‌న్ వెంట సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, సిపిఆర్వో డా. టి.ర‌వి, ఈఈ శ్రీ జ‌గ‌న్మ‌క్ష‌హ‌న్ రెడ్డి, విజివో శ్రీ నందకిషోర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Comments