అభివృథ్టి కావాలంటే జగన్ను ఆశీర్వదించండి.
తెనాలి (ప్రజా అమరావతి);
మరోసారి రాష్ట్రంలో సంక్షేమంతో కూడిన అభివృథ్థి కావాలంటే జగన్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకోవాలని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సతీమణి పుష్ప అన్నారు. బుథవారం సాయంత్రం 7వ వార్డులో ఛైర్మన్ తాడిబోయిన రాథికా రమేష్ , కౌన్సిలర్ మరియు వైస్ ఛైర్మన్ మాలేపాటి హరి తో కలసి వార్ఢు ప్రజలలతో ఆత్మీయ పలకరింపు కార్యక్రమం చేపట్టారు
7వ వార్ఢులో ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రోడ్ల నిర్మాణాలు అభవృథ్థి ప్రజలకు వివరిస్తూ నాయకులు కార్యకర్తలు తో ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారు గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేని సంక్షేమ పథకాలు జగనన్న ప్రజల వద్దకే చేరవేర్చారని ఆయన తెలిపారు అందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ని గెలిపించాలని అలాగే స్థానికంగా మీతో ఉండే తన భర్తను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు .
ఈ కార్యక్రమంలో వైకాపా ప్రముఖులు చుండూరు శాయి , మాజీ ఛైర్మన్ ఆలపాటి విజయలక్ష్మి, కఠారి హరీష్ , వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
addComments
Post a Comment