దళిత ద్రోహి జగన్ రెడ్డి.



*దళిత ద్రోహి జగన్ రెడ్డి



*జగన్ జమానాలో 11 వేలకు పైగా దళితులపై దాడులు...188 మంది ఊచకోత*


*జగన్ చేసిన తప్పులను రాష్ట్ర ప్రజలు క్షమించరు*


*జగన్ చెవిలో పువ్వు పెట్టి రాజకీయ విరామం ఇవ్వండి*


*సంపద సృష్టించే నాయకుడు కావాలా...దివాలా తీయించే నాయకుడు కావాలా?*


*పేదలకు రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మిస్తాం*

 

*సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేట ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు*


నాయుడుపేట (ప్రజా అమరావతి):- సభకు విచ్చేసిన జనం ప్రభంజనం చూస్తుంటే కూటమి విజయం ఖాయం. శిశుపాలుడు వంద తప్పులు చేసినా శ్రీకృష్ణుడు క్షమించాడు. జగన్ రెడ్డి వెయ్యి తప్పులు చేశాడు. జగన్ రెడ్డిని  మీరు క్షమిస్తారా?

తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మీ ఉత్సాహం కూటమి విజయానికి నాంధి కావాలి. సూళ్లూరు పేట ప్రజలు వైసీపీని నమ్మి 2019 లో ఓట్లేస్తే వారిని నిలువునా మోసం చేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరి ప్రజలను నమ్మించి గొంతు కోశాడు. ముద్దులు పెట్టి పిడుగుద్దులు గుద్దాడు. రాష్ట్రంలోని ప్రతీ ఒక్క ఎస్సీలకు న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నాను.

జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఎవ్వరికీ న్యాయం జరగలేదు. అందుకే ప్రతీ ఒక్కరిలో ఆక్రోశం ఉంది. రైతులు, యువకులు ఫ్యాన్ రెక్కలు విరిచి డస్ట్ బిన్ పడేసేదానికి సిద్దంగా ఉన్నారు. మహిళలు సంతోషంగా లేరు. నిత్యవసర వస్తువుల ధరలు రెండింతలయ్యాయి. జగన్ రెడ్డి ఇచ్చేది పది దోచేది వంద రూపాయలు. ప్రజలను గొర్రెలుగా భావించిన దుర్మార్గమైన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యానికి పనికిరాడు. జగన్ రెడ్డి అబద్దాలు చెప్పడంలో దిట్ట. పేదవాళ్లకు సహాయం చేయాలని ఆయనకు ఏ కోశాన లేదు.

తిరుపతి పార్లమెంటులో కూటమి అభ్యర్ధి వరప్రసాదరావు, సూళ్లూరుపేటలో నెలవల సుబ్రమణ్యం కుమార్తె విజయశ్రీ కి మీ  సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. వీరిని గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలి. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూరించాలంటే ఎన్డీఏతో పొత్తు తప్పనిసరి. కుటుంబ పెద్ద తాగుబోతయితే, రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతిపరుడైతే ఆ కుటుంబం, రాష్ట్రం బాగుపడదు. రాష్ట్రంలో అన్ని కులాలు, మతాలు, వర్గాల ప్రజలు దెబ్బతిన్నారు. 

చదువుకున్న యువకులు ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలకు పోవాల్సిన అవసరం లేకుండా టిడిపి ప్రభుత్వంలో పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తే జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రం నుంచి పరిశ్రమలను తరిమేశాడు. ఇక్కడ తిరుపతి, నెల్లూరు, చెన్నై మూడు నగరాలున్నాయి. రెండు విమానాశ్రయాలు ఉన్నాయి. నెల్లూరులో మరో ఎయిర్ పోర్టు ఉంటే మూడు నగరాలలో మూడు విమానాశ్రమాలు వస్తాయి. రెండు పోర్టులున్నాయి. శ్రీసిటీతో తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్ గా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం.

ఈ ప్రాంత ప్రజలు ప్రపంచాన్ని శాసించాలన్న ఉద్దేశంతో టిడిపి ప్రభుత్వంలో ప్రపంచంలోని అన్ని కంపెనీలను ఇక్కడకు తెచ్చాం. టీసీఎల్, హీరో. జోరో, సెల్ కాన్, డిక్సన్ లాంటి కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాం. కానీ జగన్ రెడ్డి జాకీ, అమర్ రాజాను లాంటి కంపెనీలను ఇక్కడ నుంచి తరిమేశాడు. యువతకు ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలి. ఐఐటీ, ఐసర్ లాంటి కంపెనీలను తిరుపతికి తీసుకొచ్చా. టీసీఎల్, హీరో. జోరో, సెల్ కాన్, డిక్సన్, కియాలు బాబు బ్రాండు అయితే.. జగన్ బ్రాండు బూం బూం. జగన్ రెడ్డి ఎర్రచెందనం స్మగ్లర్లకు ఎమ్మెల్యే టికెట్లు, లూటీదార్లకు ఎంపీ సీట్లు ఇస్తున్నాడు.

జగన్ రెడ్డి అసమర్ధ పాలనతో నేడు రాష్ట్రం నిరుద్యోగంలో నెం.1 గా ఉంది. మీరంతా చాలా తెలివైన వాళ్లు. జగన్ రెడ్డి అబద్దాలు చెప్పి ప్రజల చెవుల్లో పూలు పెట్టాలనుకుంటున్నాడు. మీరే జగన్ రెడ్డి చెవులో పువ్వు పెట్టి శాశ్వతంగా ఆయనకు రాజకీయ విరామం ఇవ్వాలి.

2019 ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ అన్నాడు, మెగా డీఎస్సీ అని చెప్పి మోసం చేశాడు. జగన్ రెడ్డి చరిత్ర మరిచి నాపై విమర్శలు చేస్తున్నాడు. జగన్ రెడ్డి బచ్చాగా గోలీలు ఆడుకుంటున్న సమయంలోనే నేను సి.ఎం. ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి కంటే ముందే నేను ముఖ్యమంత్రి. జగన్ రెడ్డి ఓ సారి చరిత్ర తెలుసుకో.

మెగా డీఎస్పీపైనే నా మొదటి సంతకం చేస్తా. రెండు, మూడు నెలల్లో డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగాలు ఇస్తా. నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు ఉంటే 8 సార్లు డీఎస్పీ ఇచ్చి 1.50 లక్షల టీచర్ ఉద్యోగాలు ఇచ్చా. ఎన్టీఆర్ మూడు సార్లు డీఎస్పీలు ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మొత్తం 11 డీఎస్సీలు ఇచ్చాం. కానీ జగన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ ఇవ్వలేదు. జగన్ రెడ్డి హయాంలో యువతకు ఇచ్చిన ఉద్యోగాలు గుండు సున్నా. యువత తరపున నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా? జగన్ రెడ్డి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చానని చెబుతున్నాడు. నెలకు రూ.5 వేలు జీతం గల ఉద్యోగం ఒక ఉద్యోగమేనా. వాలంటీర్లు వైసీపీ ప్రలోభాలకు గురికావద్దని మనవి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారిని మేం కొనసాగిస్తాం. కాబట్టి మీరు తటస్తంగా ఉండండి. మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా. బాగా చదువుకున్న వారికి లక్ష రూపాయలు సంపాదించే అవకాశం చూపిస్తాం.

వైసీపీ ప్రతీ స్కీంలో స్కాం ఉంటుంది. మధ్యపాన నిషేదం చేయలేదు. టిడిపి హయాంలో రూ.60 ఉన్న క్వాటర్ లిక్కర్ బాటిల్ నేడు రూ.200 అయ్యింది. మందుబాబులు రోజంతా కష్టపడి సాయంత్రం ఒక పెగ్గు వేసుకుంటారు. ఈ బలహీనతను క్యాష్ చేసుకుని మందుబాబులను దోచుకుంటున్నాడు. సూళ్లురుపేటలో కంటే ప్రక్కనే ఉన్న తమిళనాడులో మంచి బ్రాండు మందు దొరుకుతుంది. ప్రక్క రాష్ట్రలో పెట్రోలు, డీజిల్ రేట్లు కూడా చవక. అందుకే ఇక్కడి ప్రజలు అక్కడకు వెళ్లి బైకు నిండా పెట్రోలు కొట్టిచ్చుకుని ఒక పెగ్ వేసుకుని వస్తున్నారు. తమిళనాడులోని మధ్యం షాపుల్లో ఆన్ లైన్ పేమెంట్లు ఉన్నాయి. కానీ, ఇక్కడ మాత్రం హార్డ్ క్యాష్‌తోనే పేమెంట్లు చేయాలి. జగన్ రెడ్డి మందుబాబులను దోచేస్తున్నాడు. ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంపుతున్నాడు. అందుకే నాణ్యమైన మధ్యం తీసుకొచ్చి రేట్లనూ అదుపులో పెడుతాం. ఆరోగ్యాలు కాపాడుతాం.

ఇసుక రాష్ట్రంలో బంగారమైపోయింది. ఒకప్పుడు వెయ్యి రూపాయల ఇసుక ట్రాక్టర్ నేడు రూ.5 వేలు అయ్యింది. జగన్ రడ్డి దోపిడి దాహానికి 40 లక్షల మంది భనవనిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. ఇసుకలో వేలాది కోట్ల స్కాంకు పాల్పడ్డారు. తెలుగుదేవం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చి కార్మికులకు చేతినిండా పనికల్పిస్తాం.

జగన్ రెడ్డి తన భారతి సిమెంటు కంపెనీకి ఆదాయం పెంచుకునేందుకు సిమెంటు రేట్లు పెంచాడు. ఇనుము రేట్లు పెంచేశాడు.. నష్టపోయేది జనం..దోపిడీ చేసుకునేది జగన్.

జగన్ రెడ్డి నేడు సెంటు ఇళ్ల స్థలం ఇస్తే..నేను గతంలోనే రెండు సెంట్లు ఇచ్చాను. జగన్ రెడ్డి ఇచ్చిన ఇళ్ల పట్టాలను నేను రద్దు చేయను. ఇళ్ల స్థలాల కోసం ప్రజల వద్ద తక్కువ రేటుకు భూమి కొని వైకాపా నాయకులు ఎక్కువ రేటుకు ప్రభుత్వానికి అమ్ముకుని దోచుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో మాదిరి రెండు సెట్లు స్థలం ఇచ్చి ఇళ్లు కట్టిచ్చే భాధ్యత తీసుకుంటాం. 

జగన్ రెడ్డి పాలనలో కొండలు కొడలు కరిగిపోతున్నాయి. గూడూరులో సిలికా మిగిలే పరిస్థితి లేదు. తిరుపతిలో టీడీఆర్ బాండ్లలో రూ.25 వేల కోట్లు స్కాంకు పాల్పడ్డారు. విశాఖపట్నం, తణుకు, గుంటూరు, విజయవాడ, తిరుపతి లాంటి నగరాల్లో టీడీఆర్ బాండ్ల పేరుతో పెద్ద ఎత్తున స్కాంకు పాల్పడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే టిడిఆర్ బాండ్లు రద్దు చేస్తాం. అవినీతి లెక్క తేలుస్తాం.

జగన్ రెడ్డి అప్పుల అప్పారావు. జగన్ రెడ్డి తెస్తున్న అప్పుల భారం మనపై పడుతుంది. జగన్ రెడ్డి చివరకు లండన్ పారిపోతాడు. ఐదేళ్లలో రూ.13 లక్షల కోట్లు అప్పు చేశాడు. జగన్ రెడ్డి నిర్వాకం వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం కంటే కట్టాల్సిన వడ్డీ ఎక్కవైపోతుంది. అప్పు ఇచ్చిన వాళ్లు మన ఇళ్లకు వచ్చి జప్తు చేసినట్లే ప్రభుత్వ ఆస్తులను జప్తు చేసే పరిస్థితి దాపురించింది. ఇప్పటికే జగన్ రెడ్డి ఎమ్మార్వో, కలెక్టరేట్, ఆసుపత్రులను తాకట్టు పెట్టాడు. ఇక మన ఇళ్లను తాకట్టు పెట్టాలని చూస్తున్నాడు. ట్యాంకులో నీళ్లు ఉన్నప్పడే కుళాయిలో నీరు వచ్చినట్లు రాష్ట్రానికి ఆదాయం ఉంటేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయి. సంపద సృష్టిస్తేనే సంక్షేమం చేయగలం, ఆదాయం వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వ సంపద సృష్టించి ఆ సంపదను సంక్షేమాంనికి ఖర్చు చేస్తాం. సంక్షేమానికి జగన్ రెడ్డి పది ఇస్తే.. నేను 15 ఇస్తాను. అంతేకాకుండా లక్ష రూపాయలు సంపాదించుకునే మార్గం కూడా చూపెడుతాను. డబ్బులు ఇవ్వడమే కాకుండా పేదలను అన్ని విధాల ఆదుకునేందుకు కార్యక్రమాలను తీసుకొస్తాం.

జగన్ రెడ్డి అనే పెద్ద పెత్తందారులు పేదల గురించి మాట్లాడుతున్నాడు. పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను రద్దు చేసిన జగన్ రెడ్డికి పేదల గురించి మాట్లాడే అర్హత లేదు. అసమర్ధపాలనలో రాష్ట్రం వెనక్కుపోతోంది. ఒక కుటుంబ పెద్దగానీ, ఒక సంస్ధ యజమాని గానీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ సంపద సృష్టిస్తేనే ఆ కుటుంబం, సంస్థ, రాష్ట్రం ముందుకు పోతుంది. రిలయన్స్ కంపెనీ ప్రస్థాననే ఇక్కడ మంచి ఉదాహరణ. రిలయన్స్ అధినేత ధీరుభాయ్ అంబానీకి ముఖేష్, అనిల్ అంబానీలు ఇద్దరు కుమారులు. తండ్రి చనిపోయిన తర్వాత ముఖేష్, అనిల్ అంబానీలకు తండ్రి ఆస్తిని సమానంగా పంచారు. కానీ అనిల్ అంబాని దివాలా తీశాడు. ముఖేష్ అంబానీ మరింత కుబేరుడయ్యాడు. సంపద సృష్టించకపోతే మన రాష్ట్ర పరిస్థితి కూడా ఇలాగే ఉండే ప్రమాదం ఉంది. అందుకే సంపద సృష్టించే నాయకుడు మీకు కావాలా లేక దివాలా తీయించే నాయకుడు కావాలా? హైదరాబాద్‌లో సంపద సృష్టించాం. అవుటర్‌రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ, ఎయిర్ పోర్టు, జినోమ్ వ్యాలీ..ఇలా హైదరాబాద్ అభివృద్ధికి కావాల్సిన అన్ని మౌళికసదుపాయాలు నేను చేసినవే. విభజన తర్వాత జరిగిన అన్యాయాన్ని పూరించి 2029 కి రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలని ఎంతో కష్టపడ్డా. పేదరిక నిర్మూలన చేశా. కానీ, సైకో జగన్ వచ్చి అంతా నాశనం చేశాడు. నేడు తెలంగాణ కంటే రాష్ట్ర తలసరి ఆదాయం బాగా తగ్గిపోయింది. రాష్ట్రం విడిపోయినప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య తలసరి ఆదాయ వ్యత్యాసం 35 శాతం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చాం. దీనితో ఐదేళ్లలో తలసరి ఆదాయ వ్యత్యాసాన్ని 27 శాతంకు తగ్గించగలిగాం. జగన్ అనే  దుర్మార్గుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా తలసరి ఆదాయ వ్యత్యాసం మరలా 45 శాతంకు పెరిగిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే మన రాష్ట్ర పరిస్థితి సౌత్, నార్త్ కొరియాలా తయారౌతుంది. సౌత్ కొరియా అభివృద్ధిలో దూసుకుపోతుంటే నార్త్ కొరియా దివాలా తీస్తోంది.

పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రామాలు పెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపుతాం. తెలుగుదేశం పార్టీకి బీసీలు కంచుకోట. మత్స్యకారులకు 217 జీవో తీసుకొచ్చి వారి పొట్టగొట్టాడు. డీజీల్ సబ్సడీలు తీసేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరలా ఆధరణ లాంటి పథకాలు తీసుకొచ్చి వారిని ఆదుకుంటాం. 

మైనారిటీ ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.176 కోట్లు ఖర్చు చేసి 33 వేల మందికి ఆర్ధిక సహాయం చేశాం. రంజాన్ తోఫా, దుల్హన్, దుకాన్, మకాన్ పథకాలు తీసుకొచ్చాం. మైనారిటీలకు ఆర్ధికసహాయం చేశాం. కానీ జగన్ రెడ్డి మైనారిటీల కోసం తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని కార్యక్రమాలను రద్దు చేశాడు.  

సూలూరుపేట నియోజకవర్గం ఎస్సీలకు కంచుకోట. జగన్ రెడ్డి అందరికీ ఇచ్చే కార్యక్రమాలే దళితులకు ఇచ్చాడు. వారికి ప్రత్యేకంగా ఏది అమలు చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు రద్దు చేశాడు. నేను అంబేడ్కర్ విదేశీ విద్యా విధానం తీసుకొచ్చి ఎస్సీ పిల్లలను అంతర్జాతీయంగా ఉన్నత విద్యనభ్యసించేలా చేస్తే ఆ పథకానికి అంబేడ్కర్ పేరు తొలగించి జగన్ పేరు పెట్టుకున్నాడు. జగన్ రెడ్డి నీవేమన్నా అంబేడ్కర్ కంటే గొప్పవాడివా? ఇది దళిత ద్రోహం కాదా? దళితులు మాట్లాడితే గొంతు నులుమి చంపేస్తున్నారు. ఐదేళ్లలో 11 వేలకు పైగా దళితులపై దాడులు జరిగాయి. 188 దళితులను ఊచకోత కోశారు. కాకినాడలో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశాడు. దళితులంటే జగన్ రెడ్డికి లెక్కలేదు. దళితులకు టిడిపి అండగా ఉంటుంది. దళితుల్లో పేదరికం పోగొడుతాం. టిప్పర్ డ్రైవర్ కి సీటిస్తే నేను విమర్శించాననడం అబద్ధం. నేను ఎక్కడా విమర్శించలేదు. దళితులపై కపట ప్రేమే వద్దన్నాను. రెడ్లను పెళ్లి చేసుకున్న ఎస్సీలకు సీటు ఇస్తారా? ఇదేనా సామాజిక న్యాయమంటే.  ఇలాంటివి నేను చాలా చూశాను. 

సంపదను సృష్టిస్తాం. సృష్టించిన సంపదను పేదవారికి పంచుతాం. జగన్ పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేస్తున్నాడు. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. ఒక్కొక్కరికి నెలకు రూ.15వేలు చొప్పున ఆడబిడ్డ నిధి కింద కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇచ్చే బాధ్యత నాది. జగన్ అప్పు చేసి ఇస్తున్నాడు. నేను సంపాదించి ఇస్తాను. జగన్ కు నాకు ఉన్న తేడా ఇదే. ప్రతి ఒక మహిళకు, ప్రతి బిడ్డకు తల్లికి వందనం పథకం కింద రూ. 15 వేలు ఇస్తాను.  ఎంతమంది ఉంటే అన్ని 15 వేలు ఇస్తానని నా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నాను. గతంలో నేను దీపం పథకం పెట్టాను. దుర్మార్గుడు జగన్ ఈ దీపం పథకాన్ని ఆపేశాడు. దీపాన్ని ఆపేశాడు. మళ్లీ ఈ పథకాన్ని పునరుద్ధరిస్తానని హామీ ఇస్తున్నాను. దీపం పథకాన్ని ఎవరిచ్చారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. గతంలో వంట గ్యాస్ ఇచ్చింది నేనే. యేడాదికి 3 గ్యాస్  సిలెండర్లు ఉచితంగా ఇస్తానని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నాను. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాను. ఎక్కడికి వెళ్లాలన్నా దర్జాగా వెళ్లవచ్చు. మా చంద్రన్నే డ్రైవర్ అని మీకు అడిగిన డ్రైవర్లకు సమాధానం చెప్పండి. భయపడవద్దు.  మహిళల్లారా మీరు ఎక్కడికి వెళ్లినా భయపడవద్దు. ఎక్కడికి వెళ్లినా మీకు సురక్షితంగా మీ ఇంటికి చేర్చే బాద్యత నాది. ఇది నేను ఆడబిడ్డలకు ఇచ్చే వరం. అన్న చంద్రన్న మీకు ఇచ్చే అభయం. పెత్తనం ఆడబిడ్డలకే ఇస్తాను. ఇంటి తాళం వారికే ఇస్తాను. వారు అభివృద్ధి చేసినదాన్ని కలుపుకొని మగవారు ముందుకెళ్లాలి. 

అన్నదాత అయిన రైతును రాజును చేస్తాం. అన్నదాత పథకం కింద ప్రతి రైతుకి రూ.20 వేలు ఇచ్చే బాధ్యత నాది.  డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాను. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేస్తాం.ఇది నా కమిట్ మెంట్.  యువగళం ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను. నా పేరు చెబితే పెట్టుబడులు వస్తాయి. జగన్ పేరు చెబితే పెట్టుబడులు పారిపోతాయి. అందుకే 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాను. నెల నెల 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తాను. చిన్న పిల్లలను బాగా చదివిస్తాను. పిల్లల అమ్మా నాన్నలను చూస్తే బాధేస్తుంది.  ఉద్యోగాలు రాక వారు కూలి పనిచేసి డబ్బులిచ్చే పరిస్థితికి వచ్చారు. 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి మీకు అండగా ఉంటాను. మెగా డిఎస్సీ ఇస్తాను, జాబ్ క్యాలెండర్ ఇస్తాను. పరిశ్రమలు తెస్తాను. వర్క్ ఫ్రం హోమ్  ద్వారా ఇంట్లోనే కూర్చొని ప్రపంచమంతా పనిచేసే విధానానికి నేను శ్రీకారం చుడతాను. ఇది మీకు సమ్మతమేనా? నాయుడుపేటలో ఐటీ పార్క్ పెడతాం. కంపెనీవారికి వారే వచ్చి కంపెనీలు ప్రారంభించమని చెబుతాను. ఇంటింటికి మంచినీటి సదుపాయం కల్పిస్తాం. బీసీలకు రక్షణా చట్టం తీసుకొస్తాం. పింఛన్ సదుపాయం కల్పించింది నేనేనని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. 2వందలున్న పింఛన్ ను 2 వేలు చేశాను. కొత్త బిక్షగాడు నేను చేయలేదని చెబుతున్నాడు.ఈయనే చేశానని అబద్ధాలు చెబుతున్నాడు. జగన్ అబద్ధాలు చెప్పడంలో దిట్ట. ఒరిజనల్ గా పింఛన్ ను ప్రారంభించింది తెలుగుదేశం పార్టీనే. ఎన్టీరామారావు 35 రూపాయలతో పింఛన్ ప్రారంభించారు. నేను 2వేలకు తీసుకెళ్లాను. పింఛన్ 4 వేలు చేస్తాను. ఇంటివద్దనే ఇస్తాను. మొదటి తేదీననే ఇస్తాను. 3 నెలలు పింఛన్ తీసుకోకపోయినా మీరు బయటికి వెళ్లినా 12 వేలు ఒకేసారి ఇస్తాను. కోతలు ఉండవు. ఆంక్షలుండవు. నేనొస్తే పేదవాడి ప్రభుత్వం. ప్రజల ప్రభుత్వంగా మారుస్తాను.  మీ అందరికి అండగా ఉంటాను. 

బీసీలకు 50 సంవత్సరాలకే  పెన్షన్ ఇస్తాను. ఇది నా కమిట్ మెంట్. నేను 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశాను. పరిపాలన బాగా తెలిసిన వ్యక్తిని. జగన్ ఎక్కడ చదివాడు? అసలు అతనికి డిగ్రీ వచ్చిందా? జగన్ చదివింది రహస్య యూనివర్శిటీ. ఇలాంటి ఫేక్ ఫెలో నా గురించి మాట్లాడితే బాధేస్తుంది. బాబాయి గొడ్డలివేటు, కోడికత్తి డ్రామా చూశారు. ఇప్పుడు కంటైనర్ డ్రామా చూస్తున్నారు. ఇంట్లో నుంచి కంటైనర్ పెట్టి డబ్బులు నింపి  మీ ఊరిలో స్టాక్ పెట్టారు. 20 నుండి 30 కోట్లు పెట్టి డబ్బులు పంచి, మద్యం మత్తెక్కించి ఓట్లు సంపాదించాలని అనుకుంటున్నాడు. నీ ఆటలు సాగవు. ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇంటికొకరు చొప్పున ఒక్కో రోజు ఒకరు బయటికి రావాలి. మీ ఇంటిపైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి. ఎన్డీయే అభ్యర్థులు గెలవాలి. ఈ రాష్ట్రం వెలగాలి. ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలబడాలి.  ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఆ తరువాత ఏం చేయాలో అది చేసి చూపుతాను.


Comments