ఆర్ధికంగా వెనుకబడిన ఓసీ అక్కచెల్లెమ్మల కోసం.


బనగానపల్లె, నంద్యాల జిల్లా (ప్రజా అమరావతి);


*వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం.*


*రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 4,19,583 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.629.37 కోట్ల ఆర్ధిక సాయాన్ని నంద్యాల జిల్లా బనగానపల్లెలో బటన్‌ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.* 


*బనగానపల్లెలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.*


*అనంతరం బహిరంగసభలో పాల్గొన్న ముఖ్యమంత్రి.*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*


*దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం.*

దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ బనగానపల్లె నుంచి చేస్తున్నాం. 

చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చూపిస్తూ... ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడికి, స్నేహితుడికీ, ప్రతి అవ్వాతాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.



*ఆర్ధికంగా వెనుకబడిన ఓసీ అక్కచెల్లెమ్మల కోసం.*


ఆర్థికంగా వెనుకబడిన ఓసీ అక్కచెల్లెమ్మలు, వారి కుటుంబాలకు కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న వైయస్సార్‌ ఈబీసీ నేస్తం అనే ఈ పథకంతో 45–60 సంవత్సరాల వయసులో ఉన్న నా అక్కచెల్లెమ్మలందరికీ రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ.. తదితర ఓసీల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు కూడా ఆర్థిక స్వావలంబన కలిగిస్తూ ఏటా రూ.15,000 చొప్పున చేయి పట్టుకుని నడిపిస్తూ వరుసగా మూడేళ్లపాటు సహాయం అందించే కార్యక్రమమే ఈ వైయస్సార్‌ ఈబీసీ నేస్తం. 



*పేదరికానికి కులం ఉండదు*

పేదరికానికి కులం ఉండదు. పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉండాలి. ఆదుకునే గుణం ఉండాలి, తోడుగా నిలబడాలి అనే ఆరాటం ఉండాలి. 

వాస్తవంగా చెప్పాలంటే  వైయస్సార్‌ ఈబీసీ నేస్తంగానీ, వైయస్సార్‌ కాపు నేస్తంగానీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవి కావు. అయినా వారికి తోడుగా ఉండాలని, పేదరికం వల్ల వారు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని వారి కోసం కూడా మీ బిడ్డ ప్రభుత్వం అడుగులు వేసింది. 



*4,19,583 మంది అక్కచెల్లెమ్మలకు రూ.629 కోట్లు జమ.*

ఈ రోజు వైయస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా 4,19,583 మంది నా అక్కచెల్లెమ్మలకు రూ.629 కోట్లు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం. 


ఈరోజు జమ చేస్తున్న ఈ సొమ్ముతో కలుపుకొంటే మూడు దఫాల్లో 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు రూ.1877 కోట్లు వైయస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం ద్వారా మంచి చేయగలిగాం. 

ఈబీసీ నేస్తం పథకంలో కొత్తగా ఆర్థిక సాయం అందుకుంటున్న అక్కచెల్లెమ్మలు 65,618 మంది అయితే, 1,07,824 మంది నా అక్కచెల్లెమ్మలు ఇదే ఈబీసీ నేస్తం రెండు సార్లు పొందారు.

3,21,827 మంది అక్కచెల్లెమ్మలు మొత్తంగా మూడు సార్లు వైయస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా లబ్ధి అందుకున్నారు. 


అదే అక్కచెల్లెమ్మకు వరుసగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తోడుగా నిలుస్తూ చేయిపట్టుకుని నడిపించగలిగితే, వారు ఈ డబ్బులతో వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంటుంది. తమ కాళ్లపై తాము నిలబడే పరిస్థితి ఉంటుంది. తద్వారా వారి కుటుంబాలన్నీ బాగు పడే పరిస్థితి వస్తుంది. వాళ్లు నిర్వహించుకుంటున్న ఈ వ్యాపారంతో నెలనెలా కనీసం రూ. 6–10 వేలు అదనంగా ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. 


*వైయస్సార్‌ చేయూత* 

ఈ పథకం ద్వారా 45–60 సంవత్సరాల వయసున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ, వైయస్సార్‌ కాపు నేస్తం ద్వారా 45–60 సంవత్సరాల వయసున్న కాపు అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ, వారికి అండగా నిలబడటం, ఆర్థిక సాధికారతకు సహకారం అందిస్తున్నట్లుగానే.. వైయస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ కుటుంబాల్లో ఉన్న నా అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడుతూ వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం  అమలు చేస్తున్నాం.  


అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ... ఒక చేయూత ద్వారానే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు దాదాపుగా 33,14,000 మందికి మంచి చేసే అడుగులు ఈ 58 నెలల కాలంలో పడ్డాయి. 


*వైయస్సార్ కాపునేస్తం.*

వైయస్సార్‌ కాపు నేస్తం ద్వారా 4,64,000 మందికి మంచి జరిగిస్తూ అడుగులు పడ్డాయి.  వైయస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా మరో 4,95,000 మంది అక్కచెల్లెమ్మలకు మంచి చేసాం. 

మొత్తంగా 45–60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న అక్కచెల్లెమ్మలు 42,74,000 మందికి మంచి చేస్తూ... ఈ 58 నెలల కాలంలో అడుగులు పడ్డాయి. 


ఓ అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్‌ గానీ, అమ్మ ఒడి, వైయస్సార్‌ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఇళ్ల పట్టాలపంపిణీ, అక్కచెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్, ఇళ్లు కట్టించే కార్యక్రమం, విద్యా దీవెన, వసతి దీవెన.. ఇవన్నీ కూడా నా అక్కచెల్లెమ్మలు బాగుండాలి, కుటుంబాలు బాగుండాలని ఎక్కడా కూడా కులం, వర్గం, మతం, ప్రాంతం చూడడం లేదు. చివరకు ఏ పార్టీకి ఓటు వేశారనేది కూడా చూడటం లేదు. 

అర్హత ఉంటే చాలు.. ప్రతి అక్కచెల్లెమ్మకూ తోడుగా ఉంటూ ఎక్కడా లంచాలు, వివక్షకు చోటు లేకుండా నేరుగా నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ మన ప్రభుత్వం అడుగులు వేస్తుంది.


అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, అందరి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ వాలంటీర్‌ వారి ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో అండగా నిలబడుతున్న పరిస్థితి. 

గ్రామంలోనే సచివాలయం ఏర్పాటు చేసి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటి వద్దకే సేవలందిస్తున్న పరిస్థితి కేవలం ఈ 58 నెలల పాలనలోనే జరిగింది. 

సంక్షేమ పథకాల్లో సింహ భాగం నా అక్కచెల్లెమ్మల పేరుమీదే, వారి పేరు మీదే బ్యాంకు అకౌంటు తెరిచి అందులో నేరుగా జమ చేస్తూ వారి చేతికే అందిస్తున్న ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగాకేవలం ఈ 58 నెలల కాలంలోనే జరుగుతుంది.


*పదేళ్ల మీ బ్యాంకు డేటా చూడండి*

మీ..మీ బ్యాంకులకు మీరు వెళ్లండి. బ్యాంకు మేనేజర్లతో అడగండి. 10 సంవత్సరాల డేటా ఇవ్వండని అడగండి. 

చంద్రబాబు పాలనలో 5 సంవత్సరాలకు సంబంధించనది, మన 5 సంవత్సరాల పాలన డేటాను ఒకసారి చూసుకోండి. 


చంద్రబాబు 5 సంవత్సరాల డేటా చూస్తే మీ బ్యాంకు అకౌంటుకు కనీసం ఒక్క రూపాయి అయినా పంపించాడా?

అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలకు సంబంధించిన బ్యాంకు అకౌంటు డీటెయిల్స్‌ చూస్తే ఎన్ని లక్షల రూపాయలు నేరుగా మీ చేతికే వచ్చిందన్నది కనిపిస్తుంది. 

గతంలో ఏ పథకం ఉందో ఎవరికీ తెలియదు? ఎప్పుడిస్తారో తెలియదు? అసలిస్తారో లేదో తెలియని పరిస్థితి నుంచి ఈరోజు మన గ్రామంలోనే ఒక సచివాలయ వ్యవస్థ, అందులో మన ఊరి పిల్లలో అక్కడ పనిచేస్తున్నారు.  ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌గా పనిచేస్తున్న చెల్లెమ్మ, తమ్ముడూ మన ఇరుగుపొరుగువారే పనిచేస్తున్నారు.


ఒకటో తేదీ ఉదయం ఆదివారమైనా, సెలవుదినమైనా లెక్కచేయకుండా చిక్కటి చిరునవ్వుతో ఇంటికే వచ్చి మీ మనవడిలా, మనవరాలిలా తోడుగా ఉంటూ లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఈరోజు ప్రతి పథకం ప్రతి కుటుంబానికీ అందుతోంది. 


ఇలా ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ జరగని, చూడని విధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్లిపోవడం జరిగింది. ఎప్పుడూ జరగని విధంగా అడుగులు పడిన పరిస్థితులు ఇప్పుడే కనిపిస్తున్నాయి. 

ఈ రూ.2.70 లక్షల కోట్లలో రూ.1.89 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మలకే నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్లిపోయిన పరిస్థితి. 


ఆలోచన చేయండి. మహిలా సాధికారత పరంగా ఎప్పుడూ జరగని విధంగా జరుగుతున్న తేడాను గమనించండి.

మీ బిడ్డ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్‌ చేసి, అందులో ఏదైతే హామీలిచ్చామో ఆ హామీలన్నీ ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ గా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి ఈరోజు ఆ మేనిఫెస్టో తీసుకొని నేరుగా మీ ఇంటికి వచ్చి.. ప్రతి అక్కచెల్లెమ్మకు ఆ మేనిఫెస్టో చూపించి, మన ప్రజా ప్రతినిధులు అక్కా మీరే చూడండి.. జగనన్న చెప్పిన ప్రతి ఒక్కటీ చేసి చూపించాడని, మీకే మేనిఫెస్టో ఇచ్చి మీరే టిక్కు పెట్టండని, ధైర్యంగా మీ ఇంటి గడప తొక్క గలిగిన పరిస్థితి ఒక్క వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉంది. 


మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు ప్రజల్ని మోసం చేయడం, రంగురంగుల హామీలివ్వడం, వచ్చిన తర్వాత చెత్తబుట్టలో వేయడం అనే సంప్రదాయాన్ని మారుస్తూ.. ఎన్నికల మేనిఫెస్టో అంటే ఒక బైబిల్, భగవద్గీత, ఖురాన్‌ గా భావిస్తూ... దానికి విశ్వసనీయతను తీసుకొచ్చిన పరిస్థితి కేవలం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరిగింది. 



*బాబు, దత్తపుత్రుడిని చూస్తే... వంచనే గుర్తొస్తుంది.*

మరోవంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబును, దత్తపుత్రుడిని చూడండి. వీరిద్దరి పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది?

14 సంవత్సరాలు, 3 సార్లు సీఎం అయిన ఈ వ్యక్తి  చంద్రబాబు పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గుర్తొచ్చేది బాబు చేసిన వంచనలు గుర్తుకొస్తాయి.

పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుంది.  ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచీ గుర్తుకురాదు. ఒక్క స్కీము కూడా గుర్తుకురాని పరిస్థితి. 


*మ్యారేజీ స్టార్‌...*

దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రస్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. 5 సంవత్సరాలకోసారి కార్లు మార్చినట్లుగా భార్యలను మార్చే ఒక మ్యారేజీ స్టార్, ఓ వంచకుడు గుర్తుకొస్తాడు. 

ఒకరికి విశ్వసనీయత లేదు. మరొకరికి విలువలు లేవు. 



*కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్‌మీద యుద్ధం*

విశ్వసనీయ, విలువలు లేని వీరు మూడు పార్టీలుగా కూటమిగా ఏర్పడి ఈరోజు మీ బిడ్డ మీదకు యుద్ధానికి వస్తున్నారు.. కాదు కాదు.. మూడు పార్టీలుగా కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్‌ మీద యుద్ధానికి వస్తున్నారు. 

ఇదే ముగ్గురు... ఇదే చంద్రబాబు, ఇదే పవన్‌ కల్యాణ్, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీతోనే కలిసి 2014లో కూడా ఇప్పుడు చెబుతున్న మోసపూరిత వాగ్దానాలు ఇదే మాదిరిగానే స్టేజీ మీద కూర్చొని ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఈ మాదిరిగా ఇచ్చారు.

చంద్రబాబు సంతకం పెట్టి మరీ ప్రతి ఇంటికీ పంపించాడు. 

ఇందులో ఈయన రాసిన మాటలు, వాగ్దానాలు.. రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు.

రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఎగనామం పెట్టాడు. పొదుపు సంఘాల రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేస్తానని, నా అక్కచెల్లెమ్మలను అడ్డగోలుగా మోసం చేశాడు.



*మహిళా రక్షణ మరిచి– కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌*

మహిళా రక్షణకు ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నాడు. ఆ ఫోర్స్‌ కథ దేవుడెరుగు.. విజయవాడలో ఏకంగా కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ నడిపించారు.

ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మీ పథకం కింద రూ.25 వేలు ఖాతాల్లోకి వేస్తానన్నారు. ఒక్కరికంటే ఒక్కరికైనా ఆడపిల్ల పుట్టినప్పుడు మీకుగానీ, మీకు తెలిసిన అక్కచెల్లెమ్మలకు గానీ ఒక్కరికంటే ఒక్కరికైనా రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లోకి డిపాజిట్‌ చేశాడా‘ అని అడుగుతున్నాను. 

ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికీ రూ.2 వేల నిరుద్యోగభృతి. సంవత్సరానికి రూ.25వేలు, 5 సంవత్సరాలకు రూ.1.25 లక్షలు. ఒక్కరికంటే ఒక్కరికైనా ఇచ్చాడా? 

ఈ మాదిరిగా పాంప్లేట్లు చూపించాడు. రాష్ట్రాన్ని సింగపూర్‌ చేస్తానన్నాడు. ప్రతి జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌ లో ఏకంగా హైటెక్‌ సిటీలు కడతానన్నాడు. 



*2014లో బాబు అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన హామీలు చూస్తే...*

ఇంతటితో ఆగిపోకుండా మేనిఫెస్టో అని తెచ్చాడు. అక్కచెల్లెమ్మలకు ఇందులో కొన్ని పేజీలు పెట్టాడు. ఆయన  2014లో ఇచ్చిన మేనిఫెస్టోలో పేజీ నంబర్‌ 16, 17లో.. అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన 9 హామీలు గుర్తుచేస్తాను.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే... మద్యం బెల్ట్‌ షాపులను రద్దు చేస్తూ రెండో సంతకం చేస్తామన్నారు.

పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామన్నారు. 

పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పేరుతో రూ.25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తామన్నారు. 

పండంటి బిడ్డ పథకం ద్వారా పేద గర్భిణులకు రూ.10 వేలు అందిస్తామన్నారు. 

పేద మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు ఉచితంగా ఇస్తామన్నారు.

సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి 12 వంట గ్యాస్‌ సిలిండర్లు, ఒక్కో సిలిండర్‌ పై రూ.100 సబ్సిడీ అంటే 5 ఏళ్లలో రూ.6,000 ఇస్తామన్నారు.

హైస్కూలు విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు.

మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కుటీర లక్ష్మి తీసుకొచ్చి ఆర్థిక స్వావలంబన ఇస్తామన్నారు.

మహిళా ప్రొటెక్షన్‌ ఫోర్స్‌.. ఇవన్నీ కేవలం మహిళలకు సంబంధించిన 9 హామీలు.


*2014–19 మధ్యలో ఒక్క హమీ అమలు చేయని బాబు.*

ఇందులో ఏ ఒక్కటైనా చంద్రబాబు అనే వ్యక్తి ఆయన సీఎం అయిన తర్వాత 2014–19లో ఆయన, ఆయనతోపాటు దత్తపుత్రుడు, ఈ బీజేపీ ముగ్గురూ కలిసి ఫొటోలు దిగి, మేనిఫెస్టో రిలీజ్‌ చేసి, సంతకాలు పెట్టి ఇంటింటికీ పంపిచాడు.

ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా? అని అడుగుతున్నాను. 


ఇంతటి దారుణంగా మోసం చేస్తున్న ఈ వ్యక్తులకు మనం మళ్లీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ మనల్ని మోసం చేస్తూ, రంగు రంగుల మేనిఫెస్టో అని పేర్లు చెబుతూ, మళ్లీ మోసం చేసేందుకు ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తామని చెబుతూ, ప్రతి ఇంటికీ బెంజ్‌ కారు కొనిస్తామని చెబితే ఇలాంటి మోసాలను నమ్మడం ధర్మమేనా, న్యాయమేనా? ఆలోచన చేయమని అడుగుతున్నాను. 

మీ బిడ్డకు చంద్రబాబునాయుడుకి తేడాను గమనించండి.


మీ బిడ్డ ఒకవైపున మేనిఫెస్టో అనేది చెబితే 2019లో రిలీజ్‌ చేస్తే ఒక బైబిల్‌ గా, భగవద్గీత, ఖురాన్‌ గా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలు అమలు చేసి మీ దగ్గరికి వచ్చి ఆశీస్సులు అడుగుతున్నాడు.


*పచ్చి మోసగాళ్లు– దగా కోర్లు...*

మరోవైపున పచ్చి మోసగాళ్లు, పచ్చి దగాకోర్లు, పచ్చి మాయామాంత్రికులు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతోంది. 

ఈ యుద్ధంలో మీ బిడ్డకు మోసం చేయడం చేతకాదు. అబద్ధాలు చెప్పడం చేతకాదు. రాబోయే రోజుల్లో ఇలాంటి అబద్ధాలు, మోసాలు ఇంకా ఎక్కువ వింటాం. మీ బిడ్డ ఇచ్చే మేనిఫెస్టోకన్నా ఇంకా రంగురంగుల మేనిఫెస్టో ఇస్తారు.


మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి.

మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు సైనికుల్లా, స్టార్‌ క్యాంపెయినర్లుగా ముందుకు రండి అని పిలుపునిస్తున్నాను. 

మోసం చేసిన వాళ్లకు, అబద్ధాలు చెప్పే వాళ్లకు గట్టి గుణపాఠం చెప్పే కార్యక్రమం ఒక్క నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు మాత్రమే చేయగలుగుతాయి. ఓటు అనే ఒకే ఒక్క దివ్యాస్త్రంతో మాత్రమే చేయగలుగుతామని గట్టిగా చెప్పండి.  మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను.


*కాసేపటి క్రితం..*

ఎమ్మెల్యే రామిరెడ్డి అన్న.. బనగానపల్లెకు అవుకు రిజర్వాయర్‌ నుంచి సీపీడబ్ల్యూఎస్‌ స్కీమ్‌ ద్వారా రూ.100 కోట్లు ఖర్చయ్యే నీళ్ల సప్లయ్‌ గురించి అడిగాడు. ఇది కచ్చితంగా చేసి తీరుతాం. ఈరోజు వంద పడకల సీహెచ్‌ సీ ఆస్పత్రి ప్రారంభోత్సవం చేశాం. ఇందులో 23 మంది డాక్టర్లు మనకు అందుబాటులోకి వచ్చారు. పారామెడికల్‌ స్టాఫ్‌ తో కూడా కలుపుకొంటే 100 మందికిపైగా సిబ్బంది హాస్పటల్‌ లో ఉండి అండగా ఉండే కార్యక్రమానికి ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. 


దేవుడి చల్లని దీవెనలుండాలని, మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడి దయ వల్ల రావాలని మనసారా ఆకాంక్షిస్తూ ఇక బటన్‌ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. 


*చివరిగా...*

మీ అందరితో ఇంకో చిన్న విన్నపం చేయదల్చుకున్నాను. ఎన్నికల కోడ్‌ మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతోంది. ఈ రోజు ఈబీసీ నేస్తం కింద బటన్‌ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేస్తున్నాం. డబ్బులొచ్చే కార్యక్రమం ఒక వారం అటో ఇటో జరుగుతుంది. ఏ ఒక్కరూ భయపడాల్సిన పని లేదు. కచ్చితంగా ప్రతి ఒక్కరికీ డబ్బులు చేరుతాయి. 


*చెడిపోయిన మీడియాతో యుద్ధం చేస్తున్నాం.*

ఈ రెండు వారాల పాటు ఓ ఈనాడు చదవొద్దండి, ఆంధ్రజ్యోతి టీవీ, టీవీ5 చూడొద్దండి. ఆటోమేటిక్‌గా డబ్బులు పడిపోతాయి. ఆ తర్వాత ఏం చూసినా పర్లేదు.

మనం యుద్ధం చేస్తున్నది చంద్రబాబుతో మాత్రమే కాదు. చెడిపోయి ఉన్న మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తున్నాం. 

న్యాయంగా, ధర్మంగా మంచి జరిగితే కూడా దాన్ని వక్రీకరించి, అన్యాయంగా చూపించే ఒక చెడిపోయి ఉన్న కుళ్లిపోయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో కూడా యుద్ధం చేస్తున్నామన్నది మర్చిపోకండి. 

మీ అందరికీ కూడా మంచి జరగాలని, దేవుడి దయతో నా అక్కచెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. 


మన రామిరెడ్డి అన్న.. మీ అందరికీ పరిచయస్తుడే. నిరుడుకన్నా ఇంకా గొప్ప మెజార్టీతో ఆశీర్వదించమని కోరుతున్నాను. 

అటువైపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చాలా ధనవంతుడు. చాలా డబ్బులున్నాయి.ఓటుకు రూ.2 వేలైనా రూ.3 వేలైనా ఇస్తాడు. రామిరెడ్డి అన్న ధనవంతుడు కాదు.  అలా ఇవ్వలేకపోవచ్చు. 

ఒక్కటే ఒక్కటి గుర్తుపెట్టుకొండి... రామిరెడ్డి అన్నను గెలిపించిన తర్వాత జగనన్న ప్రభుత్వం వస్తుంది. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు మీరు లెక్క తీస్తే ప్రతి అక్కచెల్లెమ్మకూ కూడా ఇన్ని పథకాల ద్వారా ఇన్ని లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలకు జమ అయ్యాయి. 

ఇవన్నీ కేవలం ఒక్క జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే జరుగుతాయన్నది మనసులో పెట్టుకోండి. 

వాళ్లు డబ్బులు రెండువేలిచ్చినా, మూడు వేలిచ్చినా వద్దనొద్దండి. ఆనందంగా తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు, బటన్‌ నొక్కేటప్పుడు మాత్రం కచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రామిరెడ్డి అన్నకు ఓటు వేస్తేనే జగన్‌ ముఖ్యమంత్రి అవుతాడన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. 


కాబట్టి జగన్‌ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే రామిరెడ్డి అన్నను కచ్చితంగా గెలిపించుకోవాలన్నది గుర్తుపెట్టుకోండి. 

పేదవాడి భవిష్యత్‌ మారాలన్నా, అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్‌ వచ్చి ఇవ్వాలన్నా, అక్కచెల్లెమ్మల కుటుంబాలు బాగుపడాలన్నా, అక్కచెల్లెమ్మల పిల్లల చదువులు గొప్పగా కొనసాగాలన్నా, రైతన్నల ముఖంలో చిరునవ్వు కనపడాలన్నా, వ్యవసాయం పండుగగా జరగాలన్నా, ఏమి జరగాలన్నా కూడా ఇలా బటన్‌ నొక్కడం, నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు రావడం.. ఇవన్నీ జరగాలన్నా.. 

ఒక వాలంటీర్‌ పొద్దున్నే చిక్కటి చిరునవ్వులతో మీ ఇంటికే వచ్చి బాగున్నావా అవ్వా అని ఒక మనవడిగా, మనవరాలిగా పెన్షన్‌ డబ్బులు మీ చేతిలో పెట్టాలన్నా.. ఇవన్నీ కూడా కేవలం ఒక్క మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే మాత్రమే జరుగుతాయన్నది మర్చిపోవద్దండి. 

పొరపాటు జరిగిందంటే ఇక బటన్లు నొక్కడం, మీ ఇంటికి నేరుగా వచ్చే కార్యక్రమానికి తెరమరుగు పడుతుంది. 


మళ్లీ గ్రామాల్లో జన్మభూమి కమిటీలొస్తాయి, ఎక్కడ పడితే అక్కడ లంచాలు, వివక్ష వస్తాయి.  పేదల బతుకులు, పేద పిల్లల చదువులు అన్నీ కూడా ఆవిరైపోతాయి. అంధకారమయమైపోతాయి. 

పేదల భవిష్యత్‌ బాగుపడే పరిస్థితి నుంచి పూర్తిగా అన్యాయమైపోయే పరిస్థితి ఉంటుందని మాత్రం అందరూ గుర్తెరగమని సవినయంగా కోరుతున్నాను.

 

*టీడీపీ వాళ్లు అన్యాయస్తులు...*

ఎంత అన్యాయస్తులు వీరంటే.. ఇదే బనగానపల్లెలో మనం 3,200 మంది ఇళ్ల స్థలాలిస్తే ఇదే తెలుగుదేశం పార్టీకి చెందిన ఇదే జనార్దన్‌ రెడ్డి అనే వ్యక్తి ఏకంగా కోర్టుకుపోయి చంద్రబాబు గారు.. ఎక్కడ జగన్‌ కు మంచి పేరు వస్తు్తందో?, రామిరెడ్డికి మంచి పేరు వస్తుందో? అని ఏకంగా ఇంటిస్థలాలు ఇవ్వకూడదని కోర్టుకుపోయి అడ్డుకుంటున్న పరిస్థితి కూడా ఇదే బనగానపల్లెలో కనిపిస్తోంది. 


అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ల పట్టాలివ్వాలన్నా యుద్ధం చేయాలి, గవర్నమెంట్‌ బడుల్లో నాడు–నేడు చేయాలన్నా యుద్ధం చేయాలి. 

ఇంగ్లీషు మీడియం తేవాలన్నా యుద్ధం చేయాలి. పిల్లలకు గొప్ప చదువులు చదివించాలన్నా యుద్ధం చేయాలంటే ఎటువంటి రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నామన్నది అందరూ గుర్తెరగాలి. 


ఈ కోర్టు కేసు కూడా దేవుడి దయతో రేపోమాపో క్లియర్‌ అవుతుంది. వారంరోజుల్లోపు 3,200 కుటుంబాలకు మంచి శుభవార్త వస్తుందని సవినయంగా తెలియజేస్తున్నాను. 


మంచి చేయడానికి ఎప్పుడూ మీ బిడ్డ అండగా, తోడుగా ఉంటాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

Comments