తెలుగు దేశం పార్టీతోనే మహిళా సాధికారత.


కుప్పం  (ప్రజా అమరావతి);

*తెలుగు దేశం పార్టీతోనే మహిళా సాధికారత*



*మహిళల కోసం టీడీపీ తెచ్చిన ప్రత్యేక పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశాడు*

*తన ఆదాయం కోసం నాసిరకం మద్యంతో సిఎం మహిళల తాళిబొట్లు తెంచాడు*


*వైసీపీ పాలనలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్ కు కేంద్రంగా మారిపోయింది*


*కుప్పం వచ్చిన ప్రతి సారీ నాకు నూతన శక్తి వస్తుంది*


*కుప్పంలో నాడు ఇంటికి రెండు ఆవులు ఉండాలి అంటే ఎగతాళి చేశారు*


*నేడు అదే కుప్పం పాల ఉత్పత్తిలో రికార్డులు సృష్టించింది*


*వైసీపీకి ఎవరు ఓటు వేసినా సమాజానికి ద్రోహం చేసినట్లే*


*సిద్దం అంటున్న జగన్ ను ఓడించడానికి జనమంతా సిద్ధం అంటున్నారు*


*కుప్పంలో మహిళా సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు*


*చిత్తూరు ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుమళ్ల ప్రసాదరావును ఆశీర్వదించమని విజ్ఞప్తి*


*కుప్పం మహిళా సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం వివరాలు*


రాష్ట్రం, దేశంలో మొట్టమొదటిసారిగా మహిళల అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడిన ఏకైక పార్టీ టీడీపీ. మొదటి సారిగా ఎన్టీఆర్  మీ గురించి ఆలోచించి ఆస్తిలో సమానహక్కు కల్పించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చాం. సర్పంచులు, ఎంపీటీసలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు మహిళలు అయ్యారంటే దానికి ఎన్టీఆర్ ఇచ్చిన 8 శాతం రిజర్వేషన్లే కారణం. 

మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకొచ్చాం. చదువుకోని మహిళలను ఇంటికొకరి చొప్పున డ్వాక్రా సంఘాలు పెట్టాం. మిమ్మల్ని ఎగతాళి చేసే రోజుల నుండి ఇంటిని కాపాడే పరిస్థితి వచ్చారని నిరూపించింది టీడీపీనే. 

మహిళల కోసం వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టాం. లక్షల మంది మహిళల జీవితాలు బాగున్నాయంటే అది టీడీపీ చొరవ. 

నేను మొదటి సారి కుప్పం వచ్చినప్పుడు డ్వాక్రా సంఘాలు లేవు..కానీ ఇప్పుడు 60 వేల మంది ఉన్నారు. డ్వాక్రా సంఘాలతో పాటు పాడిపరిశ్రమను ప్రోత్సహించాం. 

ఇంటికి రెండు ఆవులు పట్టిస్తా అంటే నవ్వారు...ఇప్పుడు కుప్పంలో 4 నాలుగు లక్షల లీటర్ల పాలు సేకరణ జరుగుతోంది. 

మహిళలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి వేసిన మొదటి అడుగు పాడిపరిశ్రమ. 

నా తల్లిని చిన్నతనంలో చూశాను...కట్టెల పొయ్యితో ఇబ్బంది పడేది. కట్టెల పొయ్యిలు పోయి మహిళలు ఇబ్బంది లేకుండా ఉండాలని దీపం పథకం ద్వారా వంటగ్యాస్ అందించాను. 

మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతుంటే ఆత్మగౌరవం పేరిట మరుగుదొడ్లు కట్టించాం. మధ్యాహ్న భోజన పథకం పెట్టి అందులోనూ మహిళలకు అవకాశం కల్పించాం. అంగన్వాడీ, రేషన్ షాపులు, సుజల శ్రవంతి వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసి మహిళలకు అవకాశం కల్పించాం. 

ఒంటరి మహిళలకు పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టింది టీడీపీనే. స్కూలుకు వెళ్లడానికి ఆడపిల్లలు ఇబ్బందులు పడుతుంటే ఆడపిల్లలందరికీ సైకిళ్లు అందించాం. 

ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు పెట్టాం. కండక్టర్లుగా కూడా మహిళలను నియమించాం. 

ప్రతి కిలోమీటరుకు ఒక ఎలమెంటరీ స్కూలు, ప్రతి 3 కి.మీ అప్పర్ ప్రైమరీ, మండలానికి ఒక జూనియర్ కాలేజీ, రెవెన్యూ డివిజన్ కు ఒక ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చాం.  

పసుపుకుంకమ ద్వారా రూ.8,800 కోట్లు అందించి...రూ.10 వేల కోట్లు డ్వాక్రా రుణాలు మాఫీ చేశాం. ఉచితంగా 11 రకాల వైద్య సదుపాయాలు అందించాం. 

అన్న అమృత హస్తం కింద గర్భిణులకు పరీక్షలు, బేబీ కిట్లు కూడా అందించాం. తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్, బాలామృతంతో పాటు ప్రసవించినప్పుడు రూ.5,500 ఆర్థికసాయం అందించాం.  పెళ్లికానుకలతో పాటు ఒక అన్నగా సామూహిక సీమంతాలు నిర్వహించాం.  

కానీ ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయా.? ఆడపిల్లలకు జగన్ ఫ్రభుత్వం ఏం చేసింది. 

కొత్త పథకాలకు శ్రీకారం చుట్టాం...ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది ఆడబిడ్డలకు నెలకు రూ.15 వందలు ఆడబిడ్డ నిధి కింద అందిస్తాం. నేరుగా మీ అకౌంట్లోకే డబ్బులు వస్తాయి. 

ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం ద్వారా ఒక్కొక్కరికి రూ.15 వేలు అందిస్తాం. 

గ్యాస్ ధరలు పెరిగాయి...పెట్రోల్, డీజల్, కందిపప్పు, చింతపండు, పంచదార అన్ని ధరలు పెరిగాయి. మద్యం ధరకు రెక్కలు వచ్చాయి. క్వార్టర్ మద్యం రూ.60 నుండి 200లకు పెంచి వంద దోచేసిన జలగ జగన్. 

నాసిరకం మద్యంతో ఆడబిడ్డల తాళిబొట్లు తెంచాడు. మీకు ఇచ్చేది రూ.10లు..దోచేది రూ.100లు. జలగ మాదిరిగా జగన్ జనం రక్తం తాగుతున్నారు. 

కుప్పంలో రాళ్లు, ఇసుకను కూడా దోచుకున్నారు. రౌడీలు జాగ్రత్తగా ఉండాలి...జజారులో నిలబెడతా. 

రాష్ట్రంలో మహిళలంతా టీడీపీ పక్షమే. టీడీపీకి ఓటేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని భర్తలకు మహిళలు చెప్పాలి. 

నన్నే ఎన్నో సార్లు వేదించారు. అసెంబ్లీలో నన్ను తిట్టారు. రాజకీయాల్లో లేని నా సతీమణి భువనేశ్వరిని అవమానించారు. 

నాడే చెప్పా...కౌరవసభను గౌరవసభగా చేసి సీఎంగానే అడుగుపెడతానని. మీ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఈ 40 రోజులు మీరు కష్టపడి టీడీపీని గెలిపించాలి. 

ఎక్కడికి వెళ్లినా రాని ఆనందం కుప్పం వస్తే ఉంటుంది. నాకు స్ఫూర్తి కుప్పం. మీ నిండు మనసుతో నన్ను 7 సార్లు ఆదరించి గెలిపించారు. 

మళ్లీ గెలిచే ముందు మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. నిజమైన దేవతలు ఆడబిడ్డలే. 

ఆడబిడ్డలు కోరుతున్నా...మీకు అండగా ఉంటా. మీ ద్వారా మీ కుటుంబాన్ని బాగు చేసే పరిస్థితి రావాలి...మీ ఆదాయాన్ని పెంచి చూపిస్తాం. 

జగన్ లా రూ.10 ఇచ్చి వంద కొట్టేసే ఆలోచన నాది కాదు. సంపద సృష్టించి మీ ఆదాయాన్ని పెంచుతా. రూ.10లు ఇచ్చి రూ.100 సంపాదించే మార్గాన్ని చూపిస్తా. 

సంపద సృష్టిస్తూ పేదరికం లేని సమాజం చేస్తా. 

నేను సీఎంగా ఉన్నప్పుడు గురజాలలో ముస్లిం బాలికపై అత్యాచారం జరిగింది...24 గంటల్లో పట్టుకోవాలని ఆదేశించడంతో చెట్టుకు ఉరేసుకుని నిందుతుడు చనిపోయాడు. 

ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు. నేడు రాష్ట్రంలో గంజాయిని వాణిజ్య పంట చేశారు. డబ్బులకు కక్కుర్తి పడి విదేశాల నుండి డ్రగ్స్ తెస్తున్నారు. 

జగన్ తన చీకటి వ్యాపారాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. అవసరం అయితే మహిళలకు ప్రత్యేక చట్టం తెచ్చి రక్షణ కల్పిస్తాం. 

మహిళలు పూర్తిగా రాజకీయాల్లోకి వస్తే కుర్చీ కోసం మగవారు ఎతుక్కునే పరిస్థితి వస్తుంది.

45 ఏళ్లుగా ఆదరిస్తున్న ప్రజలకు రుణపడి ఉన్నా. అన్నగా..తమ్ముడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా...వచ్చే ఎన్నికల్లో మనందరి లక్ష్యం లక్ష మెజారిటీనే పెట్టుకోవాలి. 

నియోజకవర్గంలో 75 శాతం ఓట్లు టీడీపీకే రావాలి. రాష్ట్రం, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించేవారు వైసీపీకి ఓటు వేయరు. 

కుప్పంలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. గౌనివారి శ్రీనివాసులను 30 రోజులు జైల్లో పెట్టారు. 

నేను బతికేది రాష్ట్రం, ప్రజల కోసం. గాడి తప్పిన పాలనను మళ్లీ గాడిలో పెడతా. 

ఏకపక్షంగా ఎన్నికలు జరగాలి. ప్రజలు గెలవాలి...రాష్ట్రం నిలవాలి. నాకు ముఖ్యమంత్రి పదవి కొత్తకాదు. నాకు ముఖ్యం రాష్ట్రం, ప్రజలు. 

ప్రపంచం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే ఏపీ తిరోగమనంలో వెళ్తోంది. 

నేను ఎన్నికల కోసం ఇక్కడికి రాలేదు. కల్లిబొల్లి మాటలు చెప్పేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. సిద్దం అంటున్న వైసీపీని ఓడించడానికి జనమంతా సిద్దంగా ఉన్నారు.

క్వార్టర్ బాటిల్, గంజాయి ఇవ్వడానిక సిద్ధంగా ఉన్నారు. వీళ్లు చెప్పి చేయించే నేరాలు...ఘోరాలు చేస్తే జీవితాలు నష్టపోతాయి. 

వైసీపీకి పని చేస్తే కుటుంబాలకు, సమాజానికి ద్రోహం చేసినట్లే. జగన్ ను ఇంటికి పంపడానికి మహిళలంతా సిద్ధంగా ఉన్నారు. 

పథకాలు తీసేస్తామని వాలంటీర్లు బెదిరిస్తున్నారు...అవి మీ డబ్బులే వారి డబ్బులు కాదు. 

రాష్ట్రంలోనే ఎక్కువ మెజారిటీ వచ్చే నియోజకవర్గం కుప్పమే అవ్వాలి. కుప్పం ప్రజలకు ఏం చేయాలో నేను చూసుకుంటా. 

కుప్పం ప్రజలు నన్ను మనసులో పెట్టుకుని చూసుకున్నారు. నన్ను గెలిపించిన కుప్పం ప్రజలను ఎప్పుడూ మర్చిపోను. మనం ఒకరి జోలికివెళ్లం..మన జోలికి వస్తే వదిలిపెట్టం.

Comments