ఇంటర్మీటంట్ ఫాస్టింగ్ ప్రమాదకారా?** -డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh

 **ఇంటర్మీటంట్ ఫాస్టింగ్ ప్రమాదకారా?**


-డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh


గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు,జిజిహెచ్ కర్నూలు

అమరావతి (ప్రజా అమరావతి);

 ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ వల్ల గుండె జబ్బులు వస్తాయని, స్ట్రోక్ వస్తుందని గత రెండు మూడు రోజులుగా వార్తాకథనాలు వచ్చిన విషయం తెలిసిందే.


మనం ఆహారాన్ని  తీసుకున్న వెంటనే నోట్లో నుంచే జీర్ణక్రియ అనేది ప్రారంభమవుతుంది.. లాలాజలంలో టయలిన్ అనే ఎంజైం ఉంటుంది.. తరువాత మన జీర్ణాశయంలో 4 గంటల పాటు ఉండి అక్కడ జీర్ణాశయంలో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు కాలేయం నుంచి వచ్చే కాలేయ రసాలు బైల్ యాసిడ్స్, క్లోమం నుంచి వచ్చే ఎంజైంలు అన్ని కూడా ఈ  ఆహారంతో కలుస్తాయి.. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి జీర్ణాశయం నుంచి మన ఆహారం బయటకు వెళ్లడానికి  6 గంటల సమయం పడుతుంది..

 జీర్ణాశయం నుంచి ఆహారం కిందకు వెళ్ళతానే ఇక మరల ఆకలి అయినట్లు అనిపిస్తే తినాలని మనం అనుకుంటాం.. కానీ అక్కడే మనం పప్పులో కాలేస్తాం .. అసలైన జీర్ణ వ్యవస్థ అసలైన ఆహారం జీర్ణం కావడం 6 గంటల తర్వాతే ప్రారంభమవుతుంది.. దీనిని ఇంటర్ డైజెస్టివ్ ఫేస్ అని అంటారు..


ఈ ఆహారం జీర్ణ కోసం నుంచి కిందకు వెళ్లిన తర్వాత దాదాపు 3 మీటర్ల పొడుగున ఉండే చిన్న ప్రేవుల ద్వారా వెళ్తూ ఉంటుంది.. అప్పుడు మన ఆహారంలో ఉన్న  పదార్థాల్ని గ్లూకోజ్ గానూ ప్రోటీన్ లాగానే విభజించి వాటిని చిన్న ప్రేవులలో ఉన్న విల్లై ద్వారా అబ్సార్బ్ చేసుకొని అవి మరలా బ్లడ్ లో కలిసి లివర్కు వెళ్లి కొంత స్టోర్ అయ్యి మనకు శక్తిని ప్రసాదిస్తాయి..


తరువాత మిగిలిన వ్యర్థ పదార్థాలు పెద్ద ప్రేగులోకి వెళ్లి వీలైనంత నీటిని పీల్చుకొని విసర్జన జరుగుతుంది.. ఇలా జీర్ణం కావడానికి మొత్తం 24 గంటల వరకు పడుతుంది.. మన శరీరానికి కావలసిన శక్తిని ప్రసాదించేది ఇంటర్ డైజెస్టివ్ ఫేస్ అనే  16 గంటల సమయమే.. మనం చాలామంది జీర్ణకోశంలో ఆహారం ఉంటేనే మనం శక్తి వస్తుంది అని అనుకుంటాం అది తప్పు..


వార్తల విషయానికి వస్తే ఇది ఒక బక్వాస్ స్టేట్మెంట్.. ఆలూ లేదు.. చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు.. చైనాలో ఓ 200 మందికి ఫోన్ చేసి ప్రశ్నలడిగి, అవే ప్రశ్నలు అమెరికాలో ఉండే 200 మందికి అడిగి ఇక గుండె జబ్బులు వస్తాయి అని రాశారు.. దీనికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు జతపరచలేదు.. ఒక బేసిక్ స్టడీ. దీనికి ఎటువంటి ప్రామాణికత లేదు.. 


ఏ వార్తను అందించాలి ఏ వార్తను హైలైట్ చేయాలి అనేది నేటి సమాజంలో లోపిస్తోంది.. ఏదో ఒకటి దొరకగానే దాన్ని హైలెట్  చేయడమనేది జరుగుతోంది.

బాగా గమనించినట్లయితే చాలా జంతువులు పక్షులు అన్నీ కూడా ఒక పూటనే తింటాయి.. మనుషుల మాదిరి చాలాసార్లు తినవు.. తక్కువసార్లు తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు కొంచెం గ్యాప్ ఇవ్వడం వల్ల పేగులలో ఆహారం బాగా జీర్ణమయ్యి ఇంకా బాగా శరీరంలోకి అబ్సార్బ్ అవుతుంది.. 


కావున ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది నిజంగా ఫాస్టింగ్ కాదు. మామూలుగా చేయాల్సిన పని.. అది కాకపోతే మనం ఎక్కువసార్లు తినడం అలవాటు చేసుకున్నాం.. శరీర నిర్మాణంలో జీర్ణాశయం అనేది ఒక స్టోరేజ్ పాయింట్.. పాత కాలంలో ఆహారం సదా దొరకదు కాబట్టి మనకు జీర్ణాశయం అనేది పరిణామ క్రమంలో డెవలప్ అయింది.. అనగా మనం ఆహారాన్ని ఒకేసారి తీసుకొని దానిని నిదానంగా కిందికి పంపిస్తూ జీర్ణం జరగడానికి అలవాటు పడిపోయాం..


కానీ ఈ మారిన నవీన యుగంలో ఆహారాన్ని బయట స్టోరేజ్ చేసే పరిస్థితి వచ్చింది.. కాబట్టి మనకు ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం దొరుకుతుంది.. అందుకని ఎక్కువసార్లు మనం తినాల్సిన అవసరం లేదు..


మనం ఎంత తినాలి అని అనుకుంటే అంతా మనకు కావలసిన, మనకు నచ్చిన పదార్థం ఒక పూట తిన్నా గాని 24 గంటలకు సరిపోతుంది. మన బ్రెయిన్ ఎక్కువసార్లు తినేందుకు ట్యూన్ అయింది అంతే..

Comments