నారా లోకేష్ సమక్షంలో 100 మంది టీడీపీలో చేరిక.



*నారా లోకేష్ సమక్షంలో 100 మంది టీడీపీలో చేరిక


*


అమరావతి (ప్రజా అమరావతి );మంగళగిరి సమగ్రాభివృద్ధికి కలిసిరావాలన్న యువనేత నారా లోకేష్ పిలుపునకు పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో యువనేత సమక్షంలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన 100 మంది టీడీపీలో చేరారు. ఉండవల్లి గ్రామానికి చెందిన శ్రీరామ వాసుదేవ లక్ష్మీ తాయారు ఆధ్వర్యంలో 15 మంది, తాడేపల్లి పట్టణం 12 వ వార్డుకు చెందిన వైసీపీ నేతలు యేమని శివనాగేశ్వరరావు, కొలకలూరు వెంకటరత్నం, మహ్మద్ పఠాన్ ఆధ్వర్యంలో 50 మంది, తాడేపల్లి పట్టణం 20వ వార్డుకు చెందిన షేక్ రాఖీబ్ ఆధ్వర్యంలో 10 మంది, మంగళగిరి రూరల్, కాజా గ్రామానికి చెందిన చిలకలపూడి కిషోర్, మేడా మంగమ్మ ఆధ్వర్యంలో 10 కుటుంబాలు, దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన పల్లె నవీన్, నెమలకంటి అనంత్ ఆధ్వర్యంలో 15 మంది టీడీపీలో చేరారు. వీరందరికీ నారా లోకేష్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ.. మంగళగిరి ప్రజలకు సేవ చేసేందుకు ఇక్కడకు వచ్చానని, పేదరికం లేని మంగళగిరిగా తయారుచేయడమే తన లక్ష్యమన్నారు. దేశంలోనే అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని, అందరూ కలసికట్టుగా పనిచేసే తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


Comments