కోనసీమ పులివెందుల కంటే దారుణంగా తయారైంది.




*అవ్వా, తాతల ఫించన్ సొమ్ము కాంట్రాక్టర్లకు దోచిపెట్టి పింఛన్లు ఇవ్వటం చేతకాక జగన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తున్నాడు*


*కోనసీమ పులివెందుల కంటే దారుణంగా తయారైంది*



*జగన్ ది సంక్షేమం కాదు సంక్షోభం*


*వైసీపీ ఎన్నికల గుర్తుగా ఫ్యాన్ కు బదులు గొడ్డలి గుర్తు పెట్టుకోవాలి*


*టీడీపీ,జనసేన,బీజేపీ జెండాలు వేరయినా అజెండా ఒక్కటే*


- ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 


రామచంద్రాపురం (ప్రజా అమరావతి): అవ్వా తాతల ఫించన్ సొమ్ము కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు దోచిపెట్టి ఫించన్లు ఇవ్వటం చేతకాక జగన్ రెడ్డి  శవరాజకీయాలు చేస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. బుధవారం నాడు ఉమ్మడి తూ.గో జిల్లా  రామచంద్రాపురంలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ....ఒక్క చాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడు. నాడు ముద్దులు పెట్టి నేడు పిడి గుద్దులు గుద్దుతున్నాడు. వైసీపీ 5 ఏళ్ల అరాచక పాలనతో ప్రజలు విసుగు పోయారు. మే 13 ఎప్పుడు వస్తుందా.. వైసీపీని బంగాళాఖాతంలో పడేద్దామని ప్రజలు ఎదురు చూస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు వేరయినా అజెండా ఒక్కటే. మా కలయిక రాష్ట్ర ప్రయోజనాల కోసమే. 

జగన్ నన్ను పశుపతి అంటున్నాడు. చరిత్ర తెలియని బచ్చా జగన్. పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడే శివుడు, దాని కంటే గొప్ప అవతారం మరొకటి ఉందా? రాష్ట్రం కోసం ఎన్నో అవమానాలు పడ్డా, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి, వారి ఆస్తులు లాక్కున్నపుడు బాధపడ్డా కానీ రాజీపడలేదు. 24 క్గైమోర్ బాంబులకే భయపడలేదు, వీళ్లకు భయపడతానా? నా బ్రాండ్ ముందు జగన్ ఎంత? జగన్ నాన్న ముఖ్యమంత్రి కాకముందే నేను 9 ఏళ్లు సీఎంగా చేశా. 

*పింఛన్లు ఇవ్వలేని దద్దమ్మ శవరాజకీయాలు చేస్తున్నాడు* 

జగన్ గత ఎన్నికల్లో బాబాయిని చంపి, కోడికత్తి డ్రామాతో లబ్ది పొందాడు.  ఈ ఎన్నికల్లో పింఛన్లపై శవ రాజకీయాలు చేసి లబ్ది పొందాలనుకుంటున్నాడు. పింఛన్లు ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ. నాడు ఎన్టీఆర్ రూ. 35 పించన్  ఇచ్చారు. నేను రూ. 200 ఉన్న పింఛన్ ని రూ. 2 వేలకు పెంచా. జగన్ రెడ్ది విడతల వారీగా రూ. 1000 పెంచి గొప్పలు చెప్పుకుంటున్నాడు. వాలంటీర్లు లేకపోతే సచివాలయ సిబ్బందితో పింఛన్లు ఇవ్వలేరా? 1.25 లక్షల సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఒక్కొక్కరు 40 మందికి పంపిణీ చేస్తే రెండు రోజుల్లో ఫించన్లు పంపిణీ పూర్తవుతుంది. కానీ కేవలం రాజకీయ లబ్దికోసం సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఒకటో తేదీనే ఫించన్ ఇవ్వాలి. కానీ నేడు 3 వ తేదీ అయినా ఫింఛన్లు ఇవ్వలేదు. రూ. 13 వేల కోట్లు కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు దోచిపెట్టి పేదలకు పింఛన్లు ఇవ్వటం చేతకాని దద్దమ్మ జగన్  శవ రాజకీయం చేస్తున్నాడు. సచివాలయం సిబ్బంది లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి రెండు రోజుల్లో ఇవ్వొచ్చు. నీకు చేతకాకపోతే దిగిపో నేను ఒక్క రోజులో పంపిణి చేసి చూపిస్తా. ఫించన్లు ఇస్తామని ఉదయం రమ్మన్నారు, సాయంత్రం వరకు పింఛన్ ఇవ్వలేదు. కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదు. ఎండదెబ్బకు చనిపోయిన వృద్దులతో శవ రాజకీయం మెదలు పెట్టారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. సొంత బాబాయిని చంపి నాపై, సొంత చెల్లిలిపై నింద వేశారు. 2014 లో తండ్రి లేని బిడ్డను అంటూ తిరిగాడు, 2019 లో బాబాయిని చంపి మా మీద నెట్టారు. ఇప్పుడు వృద్దులను చంపి శవ రాజకీయం చేస్తున్నారు. ఈ పాపం వైసీపీనే వెంటాడుతుంది, వైసీపీ భూస్దాపితం అవ్వక తప్పదు. చనిపోయిన డెడ్ బాడీ తో ఒక మంత్రి నా ఇంటికి వస్తాడంట.  ఇలాంటి డ్రామాలు నాదగ్గర కాదు. అలాంటి వారికి తగిన గుణాపాఠం చెబుతా? 

*కోనసీమ పులివెందుల కంటే దారుణంగా తయారైంది*

కోనసీమలో గతంలో ఎప్పుడైనా అల్లర్లు, దాడులు జరిగాయా? నేడు పులివెందులకంటే దారుణంగా తయారైంది. దీనికి కారణం సైకో జగనే. మద్య నిషేదం చేయకపోతే ఓటడగనన్నాడు ఇప్పుడు ఓటు ఎందుకు అడుతున్నాడు? మద్యం తయారీ, అమ్మకం అంతా జగన్ దే, రూ. 60 ఉన్న క్వాటర్ బాటిల్ రూ. 200 అమ్ముతున్నారు.  రూ. 140 ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి. మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు లేవు?  జగన్ బ్రతుకే ఫేక్ బ్రతుకు. నేడు పేదలకు ఇసుక దొరకటం లేదు. టీడీపీ హయాంలో రూ. 1000 ఉన్న ట్రాక్టర్ ఇసుక నేడు రూ. 5 వేలు. శాండ్, లిక్కర్ మాఫియాకు డాన్ జగన్ రెడ్డి ఆయన తిన్నదంతా కక్కిస్తా. 

*జగన్ ది సంక్షేమం కాదు సంక్షోభం*

ఎన్నికల ముందు కరెంట్ చార్జీలు పెంచనని చెప్పి అధికారంలోకి వచ్చాక 9 సార్లు పెంచారు. చెత్త పన్ను, వృత్తి పన్నులు వేశారు. నిత్యవసర ధరలు, ఆర్టీసీ, పెట్రోల్ రేట్లన్నీ పెంచారు.  రూ. 10 ఇచ్చి రూ. 100 దోచుకుంటున్నాడు.  జగన్ కి పరిపాలన చేతకాక కాదు, పేదలను నిరుపేదలుగా మార్చాడు. రాష్ట్ర విభజన నాటికి తెలంగాణకు ఏపీకి తలసరి ఆదాయంలో 35 శాతం వ్యత్యాసం ఉంది. 2014-19 లో  దాన్ని 27 శాతానికి తగ్గించాం. నేడు జగన్ అసమర్దత వల్ల   45 శాతానికి పెరిగింది.  ఇదేనా జగన్ చేసిన అభివృద్ది? జగన్ ది సంక్షేమం కాదు సంక్షోభం. నేను సీఎంగా ఉన్నపుడు 100 కిపైగా సంక్షేమ పధకాలు అమలు చేశాం. అన్న క్యాంటీన్, చంద్రన్న భీమా, పెళ్లికానుక, రంజాన్, క్రిస్మస్ కానుకలు,  విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్,  కార్పోరేషన్ రుణాలు, ఆదరణ పనిముట్లు, కార్పోరేషన్లు రుణాలు నేడు ఏమయ్యాయి?  జగన్ నవరత్నాల పేరుతో నవ మోసాలకు పాల్పడ్డాడు.  

*వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ కి బదులు గొడ్డలి గుర్తు పెట్టుకోవాలి*

దళితులకు శిరోముండనం చేసిన వ్యక్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ది, మరో ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరి చేశారు, ఇలాంటి వాళ్లను జగన్ పక్కన పెట్టుకుని ఊరేగిస్తున్నారు. ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ. బాలయోగిని లోక్ సభ స్పీకర్ చేసిన పార్టీ టీడీపీ. అది నా బ్రాండ్. జగన్ బ్రాండ్ బూమ్, బూమ్.  రాజకీయాలంటే నోరు పారేసుకోవడమో, శవరాజకీయాలు చేయటమో కాదు, అలాంటి రాజకీయాలు చేసే వారికి తగిన విధంగా గుణపాఠం చెబుతా?  బాబాయిని ఎవరు చంపారో నీ చెల్లికి సమాధానం చెప్పు? ఫ్యాన్ అరిగిపోయింది, తిరగడం మానేసింది,  వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ కి బదులు గొడ్డలి గుర్తు పెట్టుకోవాలి.   గొడ్డలి రాజకీయాలు ప్రజలు సహిస్తారా? 

 *5 ఏళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేశావా జగన్*

నేను సీఎంగా 8 సార్లు డీఎస్సీ ఇచ్చాను. ఎన్టీఆర్ 3 డీఎస్సీలు పెట్టారు. ఇప్పుడున్న టీచర్లలో 75% నేను నియమించిన వాళ్లే. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ రెడ్డి ఒక్కటంటే ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదు. ఒక్క డీఎస్సీ పెట్టలేని, ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేని దద్దమ్మ నా గురించి మాట్లాడుతున్నాడు. నేను అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఇస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం. జాబు రావాలంటే బాబు రావాలి.  జగన్ పాలనలో గంజాయి, డ్రగ్స్, జే బ్రాండ్స్ తో యువత నిర్వీర్యమైతోంది. పరిశ్రమలు తీసుకువస్తే ఉద్యోగాలు వచ్చి సంపద పెరుగుతుంది. అంతే తప్ప కమీషన్ల కోసం పరిశ్రమల్ని తరిమేస్తే సంపద పెరుగుతుందా?  జగన్ రెడ్డి 5 ఏళ్లలో రూ. 13 లక్షల కోట్ల అప్పులు చేశాడు. ఆ అప్పంతా ఎవరు కట్టాలి? 

*ప్రజల జీవితాలు మార్చేలా సూపర్ సిక్స్ అమలు*

ఆడబిడ్డ నిధితో ప్రతి ఆడ బిడ్డకూ నెలకు రూ.1500 చొప్పున ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ ఇస్తాను. తల్లికి వందనంతో బడికి వెళ్లే ప్రతి బిడ్డకూ ఏటా రూ.15 వేలు ఇస్తాను.  ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటా. ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే బాధ్యత తీసుకుంటాను. ప్రతి మహిళకూ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తాను.  ఆటో డ్రైవర్లకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తాం. సమాజంలో ఏ వర్గానికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేసే బాద్యత కూటమిదే.  రాష్ర్రం అభివృద్ది చెందాలంటే కేంద్రం సహకారం అవసరం. డబుల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తాం. తెలుగు జాతి అభివృద్ది కోసమే మా పొత్తు. అన్నదాతకు ఏటా రూ.20 వేలు అందించి రైతే రాజు అనేలా తీర్చిదిద్దుతా.యువగళం పేరుతో ప్రతి నిరుద్యోగికీ రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తా. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిచ్చే బాధ్యత నాది.పేదరికం లేని సమాజ నిర్మాణానికి పని చేస్తా. పన్నుల బాదుడు ఉండదు. కరెంటు ఛార్జీలు పెంచం.నాణ్యమైన కరెంటు ఇస్తా. ఇక్కడ మంత్రి  చెల్లుబోయిన వేణు  చెల్లని కాసులా మారాడు.  దోపిడితో నియోజకవర్గాన్ని కొల్లకొట్టారు. వేణు వైవీ సుబ్బారెడ్డి దగ్గర మోకాళ్లు మీద కూర్చుని బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు.  అలాంటి వ్యక్తి కావాలా ఆత్మగౌవరంతో బ్రతికే ఎన్డీయే అభ్యర్ది సుభాష్ కావాలా?

*అధికారంలోకి రాగానే ఈ హామీలు నెరవేర్చుతాం* 

ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే కోటిపల్లి,కుమ్మర సావరం, కోళ్ల  గ్రామాల్లో గోదావరి కరకట్ట రిపేర్ చేస్తాం. రామచంద్రాపురం, గంగవరం మండలాల్లో డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తాం.  రోడ్లకు మహర్దశ తీసుకొస్తాం. కాలువల ఆధునీకరణ చేస్తాం. టిడ్కో ఇళ్లు లబ్దిదారులకే అప్పగిస్తాం. కోటిపల్లి, నర్సాపురం రైల్వే లైన్ బాలయోగి కల. దీన్ని పూర్తి చేసే భాద్యత మాదే.  ఇక్కడ ఓఎన్జీజీసీ  ప్రాజెక్టు పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి.  అది అయ్యే వరకు మత్స్యకారులకు నెలకు రూ. 11500 ఇవ్వాలి, కానీ టీడీపీ వస్తే అవి నిలిచిపోతాయని  వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది, దీన్ని నమ్మొద్దు. మీకు రావాల్సిన డబ్బులు ఇప్పిస్తాం. పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తామని ప్రజలు ఎన్డీయే కూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు నాయడు ప్రజలను  కోరారు.

Comments