పనికిమాలిన మంత్రులతో పరిశ్రమలు ఎలా వస్తాయి?*



*పనికిమాలిన మంత్రులతో పరిశ్రమలు ఎలా వస్తాయి?*



*9సార్లు కరెంటు ఛార్జీలు పెంచినా ఎడాపెడా కోతలెందుకు?*


*ఉద్యోగుల బకాయిలు తీర్చి అభివృద్ధిలో భాగస్వాములను చేస్తాం* 


*మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్*


మంగళగిరి (ప్రజా అమరావతి): రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులకు అడ్డగోలు సంపాదనపై తప్ప అభివృద్ధిపై శ్రద్ధలేదు, పరిశ్రమలు ఎప్పుడు తెస్తారని మంత్రిని అడిగితే కోడిగుడ్డు కథలు చెబుతాడు, ఇటువంటి పనికిమాలిన మంత్రులుంటే పరిశ్రమలు ఎలా వస్తాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి పూజిత అపార్ట్ మెంట్ వాసులతో యువనేత లోకేష్ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... ఆనాడు 5వేల ఎకరాల్లో శంషాబాద్  ఎయిర్ పోర్టు కడతానంటే అంత భూమి ఎందుకన్నారు, విజన్ – 2020 అని అంటే ఎగతాళి చేశారు, ఈరోజు ప్రపంచంలోనే మేటినగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది, నాయకుడు అంటే చంద్రబాబులా విజన్ ఉండాలని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక గత 5ఏళ్లలో 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, అయినా కరెంటు కోతలు తప్పడంలేదు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా ఛార్జీలు పెంచకుండా నిరంతర విద్యుత్ అందజేశాం. కనీసం కరెంటు కూడా ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వాన్ని చూసి పరిశ్రమలు రాష్ట్రానికి ఎలా వస్తాయి? *(లోకేష్ ప్రసంగిస్తున్న సమయంలోనే ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోని పూజిత అపార్ట్ మెంటులో కరెంటు పోయింది)*. చంద్రబాబు సిఎం అయ్యాక టెస్లా లాంటి ప్రఖ్యాత కంపెనీలను రాష్ట్రానికి రప్పించి ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నాం. ఒక్క ఛాన్స్ పేరుతో అయిదేళ్ల క్రితం అధికారం చేపట్టిన జగన్... ప్రజావేదిక విధ్వంసంతో పాలన ప్రారంభించారు. నేటికీ ఆ శిథిలాలు అలాగే ఉన్నాయి. జగన్ అనాలోచితంగా ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుని మూడుముక్కలాట ఆడారు. రుషికొండను ధ్వంసంచేసి విశాఖలో 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు. అక్కడ నిబంధనలను అతిక్రమించినట్లు గుర్తించిన ఎన్ జిటి రూ.200 కోట్ల ఫైన్ చెల్లించాలంటూ నోటీసులు జారీచేసింది. ఎన్ జిటి నిబంధనల మేరకు ఇప్పుడు ఆ కట్టడంలో సగభాగాన్ని తొలగించాల్సి ఉంది. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది రాష్ట్రప్రజలు. ప్రస్తుతం రాష్ట్రాన్ని 12లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్ ప్రభుత్వం ... కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు. సిఎఫ్ ఎంఎస్ వ్యవస్థను నాశనం చేశారు. ఉద్యోగులకు రూ.25వేల కోట్ల బకాయిలు పెట్టారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు 1వతేదీనే జీతాలు చెల్లిస్తాం. ఏడాది వ్యవధిలో వారి బకాయిలన్నింటినీ చెల్లించే ఏర్పాటుచేస్తాం. ఉద్యోగులను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేస్తామని యువనేత లోకేష్ పేర్కొన్నారు.


Comments