తెలుగుదేశం ఆవిర్భాంతోనే మహిళా సాధికారిత.



*తెలుగుదేశం ఆవిర్భాంతోనే మహిళా సాధికారిత*



*మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకే స్త్రీ శక్తి*


*మంగళగిరిని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే లోకేష్ లక్ష్యం*


*స్త్రీ శక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో నారా బ్రాహ్మణి*


మంగళగిరి (ప్రజా అమరావతి): ఇంటికి దీపం ఇల్లాలు, ఇంటికి చక్కదిద్దడం, సమర్థవంతంగా నడిపించడంతో పాటు ఏ రంగంలోనైనా రాణించగల సత్తా మహిళలకు ఉందని శ్రీమతి నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి రూరల్ నులకపేట చైతన్య తపోవన కల్యాణ మండపంలో స్త్రీ శక్తి లబ్ధిదారులు, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో బ్రాహ్మణి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.... తెలుగుదేశం ఆవిర్భావంతోనే అన్న ఎన్టీఆర్ మహిళా సాధికారితకు బాటలు వేశారు. అన్న ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే రాజకీయాల్లో మహిళలకు 9 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి వేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఉద్యోగాలు, కళాశాలల్లో యువతులకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. మహిళల పేరిట ఇళ్ల స్థలాలు, పట్టాలు, రుణాలిచ్చారు. మహిళలు ఆర్ధిక స్వాతంత్ర్యం సాధించేలా డ్వాక్రా సంఘాలను నెలకొల్పి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. దీపం పథకంతో 65 లక్షల గ్యాస్ కలెక్షన్లు ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మంగళగిరి నియోజకవర్గానికి అనేక సంక్షేమ, సేవా కార్యక్రమాలు చేస్తున్న లోకేష్ ఎమ్మెల్యే అయితే ఇంకెన్ని చేస్తారో ప్రజలు ఆలోచించాలి. లోకేష్ గారి మనసుకు దగ్గరైన పథకం స్త్రీ శక్తి. ఈ పథకాన్ని ఒక్క మంగళగిరిలోనే కాకుండా ఇతర నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలని లోకేష్ భావిస్తున్నారు. మంగళగిరిలో స్త్రీ శక్తి, పెళ్లికానుకలు, ఎన్టీఆర్ సంజీవని వంటి 29 పథకాలను అమలు చేస్తున్నారు... మా పెళ్లయిన తర్వాత ఉన్నతవిద్య అభ్యసించేందుకు  లోకేష్ అందించిన ప్రోత్సాహం మరువలేనిది. నేను చదువు నిమిత్తం రెండుసార్లు అమెరికా వెళ్లానంటే అందుకు లోకేష్ ప్రోత్సాహమే కారణం. నన్ను ప్రోత్సహించినట్టే మంగళగిరి నియోజకవర్గంలోని ప్రతి మహిళ వారి సొంత కాళ్లపై నిలబడాలని ఆయన కోరుకుంటున్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా 2600మంది టైలరింగ్ నేర్చుకుని ఉపాధి పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. టీడీపీ,బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక మహిళల ఆర్థిక స్వావలంబనకు మరిన్ని పథకాలు రూపొందించి అమలు చేస్తాం. 

*రాక్షసపాలనలో నరకం అనుభవించాం*

ఈ సమావేశంలో పలువురు లబ్ధిదారులు నారా బ్రాహ్మణితో తమ జీవన స్థితిగతులను చెప్పుకున్నారు. జ్యోత్స్న అనే మహిళ మాట్లాడుతూ...గడిచిన ఐదేళ్లుగా రాక్షస పాలనలో నరకం అనుభవించాం. డ్వాక్రా రుణాలు సరిగా అందడం లేదు. నిత్యావసర ధరలు పెంచి మాలాంటి పేద కుటుంబాలను రోడ్డున పడేశారు. పిల్లలకు ఉద్యోగాల్లేవు. మా ఆయనకు ఉపాధి లేక ఇల్లు కడవడం కష్టంగా ఉండేది. ఆ సమయంలోస్త్రీ శక్తి ద్వారా కుట్టు శిక్షణ తీసుకుని నేను ఉపాధి పొందాను. ఎంతో కొంత సంపాదిస్తు నా కుటుంబానికి అండగా నిలిచారు. మన ప్రభుత్వం వచ్చాక మంగళగిరి చిన్నతరహా కుటీర పరిశ్రమలు తీసుకొచ్చ మరింత మందికి ఉపాధి కల్పించమని కోరుకుంటున్నట్లు చెప్పారు.  రజనీ మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం కింద ఉపాధి దొరకిందని , వేడి నీళ్లకు చన్నీళ్లులా తన సంపాదన కుటుంబానికి ఉపయోగపడుతోందని సంతోషం వ్యక్తం చేసింది. నారా బ్రాహ్మణి స్పందిస్తూ అధికారంలోకి వచ్చాక మంగళగిరి నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా మార్చేందుకు లోకేష్  ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని చెప్పారు. మహిళలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.


Comments