*నరసింహుని హంస వాహన సేవ...*
మంగళగిరి (ప్రజా అమరావతి);
మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో చైత్ర పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం రాత్రి శ్రీ స్వామివారి హంస వాహన సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమెతుడైన నరసింహుడు హంస వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకుని టెంకాయలు కొట్టి, కర్పూరం వీరాజనాలు సమర్పించారు. దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ అండ్ కార్యనిర్వాహణాధికారి అన్నపురెడ్డి రామకోటిరెడ్డి పర్యవేక్షించారు.
addComments
Post a Comment