దేశచరిత్రలో అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక సిఎం జగన్.



*దేశచరిత్రలో అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక సిఎం జగన్*



*ట్రాన్స్ పోర్టు కాంట్రాక్ట్ కోసం టిసిఎల్ ప్రతినిధిని బెదిరించారు*


*ఫ్యాక్షనిస్టు కి, విజనరీకి తేడా రాష్ట్రప్రజలంతా గమనించాలి*


*మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నిప్పులు చెరిగిన నారా లోకేష్*


మంగళగిరి (ప్రజా అమరావతి): దేశచరిత్రలో గత ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొలనుకొండ ఆర్ఆర్ రచన అపార్ట్ మెంట్ వాసులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... రాళ్లు రప్పలతో నిండిన మాదాపూర్ కళ్లముందు అభివృద్ధి చెందింది, సైబరాబాద్, ఫైనాన్సియల్ డిస్టిక్ట్ తోపాటు పలు పరిశ్రమలు ఆ ప్రాంతానికి వచ్చాయి, ఈరోజు అక్కడ ఎకరా వందకోట్లు పలుకుతోంది. చంద్రబాబు నాటిన మొక్కను తర్వాత ప్రభుత్వాలు కొనసాగించడం వల్లే ఈరోజు విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జగన్ గత ప్రభుత్వం ప్రారంభించిన రాజధాని,  పోలవరం పనులను నిలిపేశారు, అనాలోచితంగా పిపిఎలను రద్దుచేశారు. ఫ్యాక్స్ కాన్, అమర్ రాజా, జాకీ వంటి పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారు. కులముద్రవేసి వేధించడంతో దేశంలోనే పేరెన్నికగన్న వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ఒరిస్సా వెళ్లి 1200 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేసుకుంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ట్రాన్స్ పోర్టు, క్యాంటీన్ కాంట్రాక్ట్ కోసం టిసిఎల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ను నిర్బంధించారు, చివరకు ఈ విషయం పిఎంఓకి చేరి తీవ్రంగా మందలించడంతో వెనక్కితగ్గారు. ఇలాంటి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఉన్నచోట పరిశ్రమలు ఎలా వస్తాయి? జగన్ చేతగానితనం, అహంకారం వల్లే పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయి. స్వతహాగా జగన్ ఒక ఫ్యాక్షనిస్టు. బాబాయిని ఎలాచంపారో వివేకం సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఎటువంటి అభివృద్ధి చెంధకుండా ప్రజలు తాము విసిరే చిల్లరకోసం ఎదురుచూస్తూ ఉండాలన్నది ఫ్యాక్షనిస్టు నైజం. 


*చంద్రబాబు విజన్ వల్లే లక్షలాది యువతకు ఉద్యోగాలు*


జగన్ విధ్వంసక పాలనలో యువతకు ఉద్యోగాలు లేవు, చదువుకునే పిల్లలకు ఫీజు రీఎంబర్స్ మెంట్ ఎత్తేశారు, విదేశీవిద్య పథకాన్ని నాశనం చేశారు. చంద్రబాబు విజన్ తో నిర్మించిన సైబరాబాద్ వల్ల నేడు పదిలక్షలమంది యువతకు ఉపాధి లభిస్తోంది. ఫ్యాక్షనిస్టుకు, విజనరీకి ఉన్న తేడాను రాష్ట్రప్రజలంతా గమనించాలి. గత ప్రభుత్వంలో 72శాతం పూర్తిచేసిన పోలవరాన్ని రివర్స్ పాలనతో సర్వనాశనం చేశారు. జగన్ ప్రభుత్వ అనాలోచిత చర్యలతో కాఫర్ డ్యామ్, డయాఫ్రం వాల్ దెబ్బతిన్నాయి. చంద్రబాబు ముందు చూపుతో కట్టిన పట్టిసీమే ఈనాడు దిక్కయింది. అతి చౌకగా లభించే రెన్యువబుల్ ఎనర్జీ పిపిఎలను జగన్ రద్దుచేసి, యూనిట్ 10రూపాయలకు ఓపెన్ మార్కెట్ లో కొనుగోలు చేయడంవల్లే విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడుతోంది.  ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెంచబోం. రెన్యువల్ ఎనర్జీని ప్రోత్సహించి పద్ధతి ప్రకారం ఛార్జీలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటాం. ఏడాదిలోగా రాజధానికి అనుసంధానంగా ఉన్న రోడ్లనిర్మాణాలను పూర్తిచేస్తాం. గత అయిదేళ్లుగా రాష్ట్రంలో అన్నింటా డబ్బు, లాలూచీ, రాజకీయాలే, స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎపిపిఎస్సీని కూడా భ్రష్టుపట్టించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీతో టీచర్ పోస్టులను భర్తీచేస్తాం. అయిదేళ్లలో పెండింగ్ పోస్టులన్నీ భర్తీచేస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు.


Comments