ఫేక్ ప్రచారంతో పేద ప్రజలకు మరోసారి కుచ్చు టోపి పెట్టేందుకు కుట్ర.



*కళకళలాడే అమరావతిని వెలవెలబోయేలా చేసిన జగన్ రెడ్డి*

*పేదలకు ఇళ్ల పేరుతో జగన్ మోసం... ప్యాలెస్ కోసం జనం సొమ్ముతో జగన్ ‘ధర’ దాహం* 

*ఫేక్ ప్రచారంతో పేద ప్రజలకు మరోసారి కుచ్చు టోపి పెట్టేందుకు కుట్ర


*

*ఓటమి భయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు*

అమరావతి (ప్రజా అమరావతి);

జగన్ రెడ్డి తుగ్లక్ చర్యలతో కళకళలాడే రాజధాని వెలవెలబోయిందని, అమరావతి ఎడారిలా మారిందని, రాజధాని ప్రాంతం స్మశానంలా తయారైందని.. టీడీపీ నేత భీమనాదం భరత్ రెడ్డి మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పేరుతో జగన్ రెడ్డి పేద ప్రజలను వంచించారన్నారు. విశాఖలో  రాజధాని వర్సెస్ రాజ్ మహల్ లా.. రుషి కొండకు గుండు చేసి జనం సొమ్ములు  కోట్లు  ఖర్చు చేసి రాజమహల్ కట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడుతూ..


*ఆంధ్రా పరువు తీసిన జగన్*

సైకో జగన్ ఏపికి రాజధిని లేకుండా చేసి ఆంధ్రా పరువు తీశాడని భరత్ రెడ్డి మండి పడ్డారు. జగన్ చర్యలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని.. రానున్న రోజుల్లో ఓటు రూపంలో జగన్ కు జనం బుద్ధి చెబుతారన్నారు. పెత్తం దారి వ్యవస్థ అని చెబుతూ.. ఫేక్ ప్రచారంతో పేదలను నయవంచన చేయడమే జగన్ కు తెలుసన్నారు. ఆంధ్రా దాటి వెళితే రాజధాని ఏది అంటే ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఏపి ప్రజలను జగన్ ఉంచాడన్నారు. ఇటువంటి పరిస్థితిని కల్పించిన జగన్ ను ఓడించాలని జనం డిసైడ్ అయ్యారన్నారు. 


*ఓటమి భయంలో రాజధాని వైసీపీ అభ్యర్థులు*

రాజధాని చూట్టూ ఉన్న 32 నియోజకవర్గాల్లో వైసీసీకి ఓటమి ఖాయం అన్నారు. ఈ నియోజకవర్గాల్లో 27 సీట్లు టీడీపీ పక్కాగా గెలుస్తుందన్నారు.  గెలుస్తామన్న నమ్మకం వైసీపీ నేతలకు పోయిందన్నారు. జనాల్లోకి వెళ్లి ఏమి ప్రచారం చేయాలో తెలియని అయోమయ స్థితిలో వైసీపీ నేతలు ఉన్నారన్నారు. అమరావతి ముంచిన జగన్ కు ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారన్నారు. వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడం పక్కా అన్నారు. టీడీపీ గెలిపించడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారని తెలిపారు. 


*రాజధాని వర్సెస్ రాజ్ మహల్*

2014 నుండి 2019 వరకు రాజధానిలో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. గొప్ప గొప్ప భవనాలు  సచివాలయం, హైకోర్టుల వంటి భవనాలను నిర్మించిన ఘనత చంద్రబాబుది అన్నారు. పేదలకు 15 లక్షల ఇళ్లంటూ జగన్ మోసం చేసి.. తాను మాత్రం విశాఖలో విశాలమైన ప్యాలెస్ కట్టుకుని పేదలను ముంచారన్నారు. భారత దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని బంగ్లా కట్టుకున్నారన్నారు.  పేదవాడి ఇంటికి జగన్ ప్రభుత్వం ఇచ్చింది లక్షా 80 వేలని.. జగన్ ప్యాలెస్ లో ఫ్యాన్ ఖరీదు మాత్రం 2 లక్షలన్నారు.  కరెంట్ పోతే లైట్లకోసం 10 కోట్లతో జనరేటర్ ఏర్పాటు చేశారన్నారు. మాట్లాడితే పెత్తందారి వర్సెస్ పేదలంటున్న జగన్... ప్రధానికి కూడా లేని వసతులకు జనం సొమ్మును జగన్ తగలేశాడన్నారు



*ఫేక్ ప్రచారంతో మోసం*

హైకోర్టు ఆర్డర్ లను తుంగలో తొక్కి రాజధాని రైతులను ఏడిపించిన జగన్ కు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. రాజధాని అవసరంలేదంటూ ఫేక్ ప్రచారం చేస్తున్న జగన్ ను ప్రజలు తరమికొట్టాలన్నారు. రాజధాని లేకపోవడంతో ఆంధ్రా ప్రజలను బయట జాలిగా చూసే పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు , బీజేపీ నేతలపై చేస్తున్న ఫేక్ ప్రసారాలను ప్రజలు గుర్తించాలన్నారు. ఇటువంటి తప్పుడు పేక్ న్యూస్ లపై జాగ్రత్తగా ఉండాలన్నారు. 


*కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర*

ఫేక్ న్యూస్ ప్రచారం, ప్రసారాలు చేస్తూ... కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి  ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వైసీపీ కుట్ర చేస్తుందన్నారు. వందల కోట్లను కుమ్మరిస్తూ... తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారన్నారు. 

తప్పుడు వార్తలతో జనాలను మోసంగించి వైసీపీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. దాదాపుగా 150 య్యూటూబ్ ఛానల్స్ ను కొని తప్పుడు ప్రసారాలు చేస్తున్నారన్నారు. 


*30 రోజుల్లో  ఓటు రూపంలో జగన్ కు బుద్ధి*

తప్పుడు  ప్రచారాలు, ఫేక్ ప్రసారాలు చేస్తూ... రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్డికి మరో 30 రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారని భరత్ రెడ్డి అన్నారు. రాజధాని రైతులను మోసం చేసిన జగన్  జనం నమ్మే పరిస్థితిలో లేరన్నారు.  ఓటు రూపంలో జగన్ కు సమధానం చెబుతారన్నారు.  రుషి కొండను గుండు చేసి జనం సోమ్ములతో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకొని... పేదలకు ఇళ్లపేరుతో  ఇళ్లు లేకుండా మోసం చేసిన జగన్ కు ఓటమి తప్పదన్నారు. మరోసారి చంద్రబాబును అఖండ మెజార్టీతో గెలిపించడం ఖాయమన్నారు. జగన్ మోసాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. మరోసారి జగన్ రెడ్డి చెబుతున్న మాయ మాటలను నమ్మబోరన్నారు. టీడీపీకి భారీ మెజార్టీ ఇచ్చి వైసీపీకి డిపాజిట్లు లేకుండా చేస్తారని స్పష్టం చేశారు.

Comments