నిరంతర నిఘాతో రాష్ట్రాన్ని జల్లిడిపడుతున్న త్రిబుల్ “సి”.


 *నిరంతర నిఘాతో రాష్ట్రాన్ని జల్లిడిపడుతున్న త్రిబుల్ “సి”*

*•ఎంసిసి ఉల్లంఘనలు, మద్యం అక్రమ రవాణా, సీజర్లపై త్రిబుల్ “సి” నిఘా నేత్రం*

*•వెబ్ కాస్టింగ్ ద్వారా అంతర్-రాష్ట్ర్ర చెక్ పోస్టుల్లో వాహనాల కదలికపై పర్యవేక్షణ*

*•వెబ్ కాస్టింగ్, జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా మద్యం సరఫరాపై నియంత్రణ*

*•ఎంసిసి ఉల్లంఘనలను పర్యవేక్షించేందుకు వినియోగిస్తున్న దాదాపు 1,680 వాహనాలను జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షణ*

*•ఎలక్ట్రానిక్ చానళ్లలో నిరంతరాయంగా ప్రాసారం అయ్యే వార్తాంశాలపై  ప్రత్యేక దృష్టి* 

*•అత్యాధునిక సాంకేతికత అనుసందానంతో రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుండి పర్యవేక్షణ*

*•సిఈఓ శ్రీ ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో నిరంతరాయంగాపనిచేస్తున్న త్రిబుల్ “సి”*

అమరావతి, ఏప్రిల్ 23 (ప్రజా అమరావతి):  రాష్ట్రంలో మే 13 న జరుగనున్నసార్వత్రిక ఎన్నికల సందర్బంగా ఓటర్లను ప్రభావితం చేసే ఎటు వంటి చట్టవ్యతిరేఖ కార్యాక్రమాలకు తావులేకుండా ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంట్రిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (త్రిబుల్ “సి”) ద్వారా రాష్ట్రాన్ని జల్లిడిపడుతున్నది. రాష్ట్ర  ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో అత్యాధునిక సాంకేతికత అనుసంధానంతో ఏర్పాటు చేయబడిన ఈ త్రిబుల్ “సి” ద్వారా ఎం.సి.సి. ఉల్లంఘనలు, మద్యం అక్రమ రవాణా , సీజర్లపై పటిష్టమైన పర్యవేక్షణ, నియంత్ర్రణ చేయడం జరుగుచున్నది. అంతర్-రాష్ట్ర్ర సరిహద్దులు మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నమొత్తం 424 చెక్ పోస్టుల్లో దాదాపు 358 చెక్  పోస్టుల (84.4%) నుండి వెళ్లే వాహనాల కదలికలను వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ కేంద్రం నుండే పర్యవేక్షించడం జరుగుచున్నది. ఫలితంగా ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక మొత్తంలో రూ. 141 కోట్ల విలువకు  పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను జప్తు చేయడం జరిగింది. 2019 ఎన్నికల నిర్వహణ సందర్బంగా జప్తు చేయబడిన అక్రమ ఆస్తుల విలువ కంటే ఇది దాదాపు రెండు రెట్లు అదికం. ఎన్నికల నిర్వహణకు  ముందే ఇంత  పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులను స్వాదీనం చేసుకోవడం అనేది రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఒక రికార్డు. 

ఎన్నికల సందర్బంగా ఓటర్లపై మద్యం ప్రభా ఏమాత్రము ఉండకూడదు అనే లక్ష్యంతో మద్యం అక్రమ రవాణాను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలోని మద్యం తయారీ సంస్థల గోడౌన్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లలో ఏర్పాటుచేసిన వెబ్ కెమేరాల ద్వారా మరియు మద్యం తయారీ సంస్థల నుండి గోదాములకు, షాపులకు, బార్లకు లేదా ఇతర సంస్థలకు మద్యం సరఫరా చేస్తున్న వాహనాలను జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా  ఈ కేంద్రం నుండి పర్యవేక్షించడం జరుగుచున్నది. క్షేత్ర స్థాయిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పర్చాలనే లక్ష్యంతో నిరంతరం పర్యటిస్తున్న ఫ్లైయింట్ స్క్వాడ్ బృంధాలు, సెక్టోరల్ అధికారులు వినియోగించే దాదాపు 1,680 వాహనాలు మరియు ఇ.వి.ఎం.ల రవాణాకు వినియోగించే డిజిటి వాహనాల కదలికలను జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా ఈ కేంద్రం నుండి పర్యవేక్షించడం జరుగుచున్నది. ప్రముఖ ఎలక్ట్రానిక్ తెలుగు చానళ్లలో నిరంతరాయంగా ప్రాసారం అయ్యే వార్తాంశాలపై  ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా ఎన్నికల ప్రతికూల వార్తలపై తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుచున్నది. ఇందుకై ఇద్దరు ఏ.ఎస్.ఓ.లతో పాటు దాదాపు 25 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు షిప్టుల వారీగా పనిచేస్తున్నారు.   అదే విదంగా ప్రముఖ ఆంగ్ల, తెలుగు దిన పత్రికల్లో ప్రచురితమయ్యే ఎన్నికల ప్రతికూల వార్తాంశాలపై కూడా తగుచర్యలు తీసుకోవడం జరుగుచున్నది.  


ఈ కార్యక్రమాలన్నింటినీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా స్వయం పర్యవేక్షణలో జరగడమే కాకుండా అధికారులు, సిబ్బంది పనితీరును మరింత మెరుగుపర్చే విదంగా వారికి ఎప్పటి కప్పుడు ఆయన దిశానిర్థేశాన్ని చేస్తున్నారు. అందుబాటులో ఉన్న అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా ఆద్వర్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళికా బద్దంగా అమలు చేస్తున్న ఇటు వంటి నిరంతర పర్యవేక్షణా కార్యక్రమాలు రాష్ట్రంలో మే 13  జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ఎంతగానో దోహదపడతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అదే సమయంలో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించే విధంగా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు మరియు ప్రజలు రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టిన చర్యలకు మరియు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు పూర్తి స్థాయిలో సహకరిస్తే రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావరణంలో ఎంతో స్వేచ్ఛగా, న్యాయంగా, నిష్పక్షపాతంగా  జరుగుతుంది అనే ఆశాభావాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా వ్యక్తం చేశారు. 



Comments