అధికారముందనే అహంకారంతో జగన్ దోపిడీ, విధ్వంసం.



*అధికారముందనే అహంకారంతో జగన్ దోపిడీ, విధ్వంసం*



*పాలించమని అధికారమిస్తే వ్యవస్థలన్నీ నాశనం*


*ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించకుండా పేదల ప్రాణాలతో ఆటలు*


*కూటమి ప్రభుత్వం రాగానే సర్పంచులకు విధులు...నిధులు*


*సీమలో జగన్ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు*


*జగన్ చెప్పే మాటలకు...చేసే పనులకు పొంతన ఉండదు.*


*మాదాసి కురబలను ఎస్సీల్లో చేర్చుతాం*


*సామాన్యులకు టికెట్లు ఇచ్చిన చరిత్ర టీడీపీది*


*ఆలూరు ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు*


ఆలూరు (ప్రజా అమరావతి ):- ‘‘ఏపీ చరిత్ర, ప్రజల భవిష్యత్ మార్చే ఎన్నికలివి. నా ప్రాణ సమానమైన కార్యకర్తలు కసిగా పనిచేయాలి.దుర్మార్గుడి పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. సైకో రెడ్డి రాష్ట్రం నుంచి మీ ఓటుతో తరిమికొట్టండి. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం.  సాధారణ కార్యకర్త వీరభ్రద గౌడ్ కు ఎమ్మెల్యే సీటు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఒక ఎంపీటీసీని ...ఎంపీ అభ్యర్థిగా నిలెబెట్టాం. కురబ కులస్థుడు ఎంపీగా గెలిచి ఢిల్లీకి వెళతాడని మీరు ఊహించారా? వీరిద్దరినీ గెలిపించడం ప్రజాస్వామ్యానికి మీరిచ్చే గౌరవం. వీరిద్దరినీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి. ఆలూరు ప్రజలు అదరగొడుతున్నారు. ఎన్నికలకు సై అంటూ కర్నూలు జిల్లా కదం తొక్కుతోంది. 

*ముస్లింలకు న్యాయం చేసేది టీడీపీనే*

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, యువతకు అండగా నిలబడాలని, వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలనే ఉద్దేశంతో పొత్తుకు ముందుకొచ్చాం. మేము సైతం పనిచేస్తామని జన సైనికులు , బీజేపీ కార్యకర్తలు ముందుకు రావాలి. కేంద్రంలో రాబోయేది ఎన్డీఏనే . మన రాష్ట్రాభివృద్ధికి ఎన్డీఏ సహకారం ఎంతో అవసరం. అందుకే జట్టు కట్టాం.  మైనారిటీ సోదరులందరూ ముందుకొచ్చి కూటమి గెలుపుకు కృషిచేయాలి. ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం. అధికారంలోకి వచ్చాక ముస్లింలకు అండగా నిలబడతాం.  ఆర్థికంగా ఆదుకుంటాం. 

*ఇక్కడ పులి అంటాడు...ఢిల్లీలో పిల్లిలా ఉంటాడు*

ముఖ్యమంత్రిగా గెలిపిస్తే జగన్ రెడ్డి ఏం చేశాడు? ఢిల్లీ వెళ్లి పైరవీలు చేసుకున్నాడు. రాష్ట్రాన్ని గాలికొదిలేశాడు. 13 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. కేంద్రం సహకారంతో భవిష్యత్ లో అందరి జీవితాల్లో వెలుగులు తెస్తాం. ఆలూరు ఎప్పుడొచ్చిన వైకుంఠం శ్రీరాములు నాకు గుర్తు వస్తాడు. కొందరు స్వార్ధంతో పక్కకు పోయినా వైకుంఠం టీడీపీతోనే ఉండిపోయాడు. శివప్రసాద్, జ్యోతిని పార్టీ ఆదరించి ఆదుకుంటుంది. కపట్రాల కుటుంబానికి అండగా నిలబడతాం. దుర్మార్గుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు త్యాగాలు చేయాల్సి వచ్చింది. అందుకు కోట్ల కుటుంబం ముందుకొచ్చింది. కోట్ల సుజాతమ్మ గారికి అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం ఇస్తాం. వెనుకబడిన కర్నూలు జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా. అధికార మదంతో విర్రవీగుతున్న జగన్ రెడ్డి ప్రజలు బుద్ధి చెప్పాలి. జగన్ రెడ్డికి జే గన్ రెడ్డిగా నామకరణం చేస్తున్నాను. రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వ్యక్తిని ఇలా కాక మరేలా పిలుస్తాం. అన్నిరంగాలకు నాశనం చేశాడు. నిన్నటి వరకూ పరదాలు కట్టుకుని తిరిగాడు. నేడు నెత్తిన చేయిపెడుతున్నాడు. 

*సీమలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశావా జగన్*

నేను సాగునీటి ప్రాజెక్టులకు రూ. 12 వేల కోట్లు ఖర్చు చేశా. ఈ ఐదేళ్లలో రాయలసీమకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు ఇచ్చాడా. సాగు, తాగునీరు ఇచ్చాడా అని అడుగున్నా. దమ్ముంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. సీమకు ఒక్క పరిశ్రమ తెచ్చాడా. ఉద్యోగం ఇచ్చాడా, డీఎస్సీ తెచ్చాడా. వాలంటీర్ ఉద్యోగం ఇస్తే ఉపాధి కల్పించినట్టేనా. జగన్ రెడ్డి మాత్రమే పెత్తనం చేస్తూ మనమంతా బానిసలుగా ఉండాలి. మీ జీవితాలు బాగుపడ్డాయా, మీ ఆదాయాలు పెరిగాయా, మీ కష్టాలు తీరాయా,? వరి టమాటా , మిరప, పత్తి, రైతులు బాగున్నారా? రైతు భరోసా కేంద్రాలు కాదు..రైతు దగా కేంద్రాలు. నీరిస్తే పొలాలు బంగారం పండుతాయి. కానీ దుర్మార్గుడు నీరివ్వకుండా ప్రగల్భాలు పలుకుతున్నాడు.  స్కూలుకు రంగులు కొడితే నాణ్యత పెరుగుతుందని ఆలోచించే దుర్మార్గుడు జగన్ రెడ్డి. 

*ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించకుండా పేదల ఆరోగ్యంతో ఆటలు*

విద్యపై పెట్టిన ఖర్చు ఎంత, వచ్చిన ఫలితాలు ఎంత, దోచుకుని, దాచుకున్నది ఎంతో సమాధానం చెప్పాలి. ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి మరింత ఘోరం. కనీసం దూదికి కూడా దిక్కులేదు. పేదలకు కనీసం మందులు ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందడం లేదు. కరువు సీమ రాయలసీమను ఆదుకున్నాను. వ్యవసార రంగానికి ప్రోత్సాహకాలు అందించాను. సీమలో 90 శాతం రాయితీతో బిందు సేద్యం పరికరాలు ఇచ్చాం . అనంతపురంలో కియా మోటార్స్ తీసుకువచ్చాం . కడప విమానాశ్రయాన్ని మేమే అభివృద్ధి చేశాం. మద్యపాన నిషేధం పేరుతో ప్రజలను జగన్ రెడ్డి నిండా ముంచాడు.  కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నాడు. ఏమైంది? వారంలో సీపీఎస్ రద్దు చేస్తామన్న హామీ ఏమైంది ? మాట తప్పిన జగన్కుర ఓటు అడిగే హక్కు ఉందా -?

*బలహీన వర్గాలకు అండగా టీడీపీ*

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. అందులో భాగంగానే మాదాసి కురబలను ఎస్సీ జాబితాలో చేరుస్తాం. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాల్సి ఉంది . కూటమి వచ్చాక సర్పంచులకు నిధులు, విధులు ఇస్తాం . జగన్ శవరాజకీయాలు చేస్తున్నారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కురుక్షేత్ర యుద్దంలో ధర్మానిదే విజయం. సంపద సృష్టించి ఆదాయం పెంచి ప్రజలకు పంచుతామని ఆలూరు సాక్షిగా హామీ ఇస్తున్నాను’’ అని చంద్రబాబు నాయుడు అన్నారు. 


Comments