పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి గోదావరి జిల్లాలకు న్యాయం చేస్తాం.

 


*గజదొంగ ముఖ్యమంత్రిని రాష్ట్రం నుంచి తరిమితరిమి కొట్టండి!*


*నెలరోజుల్లో రాష్ట్రానికి శనివదిలి ప్రజాప్రభుత్వం రాబోతోంది!*


*ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో... ఈ లోకేష్ తగ్గేదే లేదు*


*కూటమి విజయదుందుభి వార్తలతోనే అరాచకశక్తులు పరార్*


*చంద్రబాబు సిఎం అయిన వందరోజుల్లో రాష్ట్రానికి పెట్టుబడుల వరద*


*పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి గోదావరి జిల్లాలకు న్యాయం చేస్తాం*



*ఏలూరు యువగళం సభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్*


ఏలూరు (ప్రజా అమరావతి): మన ఇంట్లో దొంగలుపడితే ప్రజలంతా తిరుగుబాటు చేసి తరిమికొడతాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 420 ఉన్నారు, ఆయన ఆస్తులకన్నా కేసులు లిస్టు పెద్దది, రాబోయే ఎన్నికల్లో అందరం కలసికట్టుగా తిరుగుబాటు చేసి గజదొంగను తరిమితరిమి కొట్టాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఏలూరు క్రాంతి కళ్యాణ మండపం వద్ద జరిగిన యువగళం సభలో యువనేత లోకేష్ యువతనుద్దేశించి మాట్లాడారు. కార్యక్రమానికి జర్నలిస్టు గోపి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... నెలరోజుల్లో రాష్ట్రం నుంచి శనిపోతోంది, ప్రజా ప్రభుత్వం రాబోతోంది, ఇప్పుడు ఏనోటా విన్నా జరుగు జగన్ జరుగు, ఖాళీ చేయి కుర్చీ అనే నినాదమే విన్పిస్తోంది. ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయ దుందుభి మోగిస్తోందన్న వార్తలతోనే రౌడీలు, గూండాలు, స్మగ్లర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లు రాష్ట్రం వదిలి పారిపోతారు. అయితే ఎక్కడికి వెళ్లినా వారిని వదిలిపెట్టను. భూమండలంలో ఎక్కుడున్నా పట్టుకొచ్చి వడ్డీతో సహా చెల్లిస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మాట్లాడినందుకు నాపై తాజాగా సిఐడి కేసుపెట్టారు, మై డియర్ జగన్, ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఈ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, ఇప్పుడు నాపై 24వకేసు పెట్టారు. 2014కి ముందు ఏనాడు నాపై కేసులేదు. ఏనాడు తప్పు చేయలేదు. నిప్పులాగా బతికాను. జగన్ లా పరదాలు కట్టుకుని తిరగలేదు. చెట్లు నరకలేదు, దమ్ముధైర్యంతో ఉన్నాం. తప్పుచేయలేదు కనుకే ప్రజల ముందుకు ధైర్యంగా వచ్చాం. బాంబులకే భయపడని కుటుంబం మాది, నీ చిల్లర కేసులకు భయపడతారా? చంద్రబాబును అక్రమంగా తప్పుడు కేసుల్లో ఇరికించి 53రోజులు జైలులో పెట్టారు. అదే సింహం జగన్ ను ఇప్పుడు వేటాడుతోంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారి కోసమేఎర్రబుక్ పెట్టా. ఈ బుక్ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. చట్టాన్ని అతిక్రమించి ప్రజలను వేధించినవారి పేర్లు ఎర్రబుక్ లో రాశా. అటువంటి వారిపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేసి కఠిన చర్యలు తీసుకుంటాం. 

*అది ముమ్మాటికీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టే!*

జగన్ ప్రభుత్వం తాజాగా తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ముమ్మాటికీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టే. వైసిపి నాయకులు భూములు కొట్టేసేందుకే ఈ నల్లచట్టం. రూపాయిరూపాయి కూడబెట్టి తాత,తండ్రులు వారసులకు భూమిలిస్తే జగన్ ఫోటోలు వేసుకోవడమేమిటి? సర్వేరాళ్లపై కూడా ఫోటోలే. ఈ యాక్ట్ ప్రకారం ఒరిజినల్స్ తమ వద్ద ఉంచుకొని ప్రజలకు జిరాక్స్ ఇస్తారట. భూమి ఎవరిదో అధికారులే నిర్ణయిస్తారట. భూకబ్జాలతో గత అయిదేళ్లుగా జనాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూశాం. అటువంటి వాటిని చట్టబద్ధం చేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.  జగన్ కు ఇంకొక అవకాశం ఇస్తే మీ బిడ్డను అని భూమి లాక్కుంటాడు. మీ భూమి నాది అంటాడు. చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం ఏర్పడ్డాక రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు దస్త్రంపైనే. మళ్లీ పాత చట్టం తెస్తాం, పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఉండదు. 

*ముఖ్యమంత్రిగా జగన్ ఘోరంగా ఫెయిల్!*

జగన్ స్కూలులోనే ఫెయిల్, కాలేజిలో ఫెయిల్, ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్, ముఖ్యమంత్రిగా ఘోరంగా ఫెయిల్. అడుగడుగునా ప్రజల ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు, నిత్యావసర వస్తువుల ధరలు, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. బడుగు, బలహీనవర్గాలపై యథేచ్చగా దాడులు చేస్తున్నారు. జగన్ సర్కారు నూటికి నూరుశాతం ఫెయిల్యూర్ ప్రభుత్వం. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకపోవడానికి గంజాయి ప్రధాన కారణం. గంజాయి మాఫియాలతో పచ్చని కుటుంబాలు నాశనమవుతున్నాయి. దిశచట్టం లేకుండా పోలీస్ స్టేషన్లు పెట్టారు. లేని చట్టం కారణంగా మహిళలను వేధించే సైకోలకు వెంటనే బెయిల్ వస్తోంది. రౌడీలు, బ్లేడ్ బ్యాచ్ లు బహిరంగంగా తిరుగుతున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి వందరోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెడతాం. స్మగ్లర్లను వెంటాడతాం. వందరోజుల్లో రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తాం. 

*ఒక్క అవకాశం పేరుతో రాష్ట్రానికి తీరనినష్టం*

గత ఎన్నికల్లో ఒక్క అవకాశం పేరుతో ఎంత నష్టపోయాం, రాజధాని లేదు, పోలవరం నాశనంమైంది, పెట్టుబడులు, ఉద్యోగాలు పోయాయి. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమైంది. గతంలో 10ఓట్ల తేడాతో రాష్ట్రంలడో ఓ ఎంపి అభ్యర్థి ఓడారు. మంగళగిరిలో 2014లో 12ఓట్లతో టిడిపి అభ్యర్థి ఓడారు. యువత ఎక్కడ ఉన్నా ఎన్నికల సమయానికి వచ్చి ఓటు వినియోగించుకోండి. గత అయిదేళ్లుగా రాష్ట్ర యువత చాలా నష్టపోయారు, అమర్ రాజా రాష్ట్రానికి అత్యధిక పన్నులు కట్టే అమర్ రాజా విస్తరణ యూనిట్ వైసిపి వేధింపులతో తెలంగాణాకు వెళ్లిపోయింది. పొల్యూషన్, లేబర్ శాఖలతో వారిని వేధించారు. పెట్టుబడిదారులకు భరోసా కలగాలంటే కూటమి అభ్యర్థులు 160స్థానాలు గెలవాలి, జీవితంలో జగన్ సిఎం కాడని భరోసా వస్తేనే పెట్టుబడులు వస్తాయి.  చంద్రబాబు సిఎం అయిన వందరోజుల్లో రాష్ట్రానికి పరిశ్రమలు వరదలా వస్తాయి. అధికారంలోకి వచ్చాక గోదావరి జిల్లాల్లో  పెండింగ్ లో ఉన్న పోలవరం, చింతలపూడి లిఫ్ట్ వంటి సాగునీటి ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాం, గత ప్రభుత్వం 72శాతం పూర్తిచేసిన పోలవరం ప్రాజెక్టుకు జగన్ రివర్స్ టెండరింగ్ బ్రేక్ వేశారు. ప్రజాప్రభుత్వం వచ్చాక ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను తిరిగిగి ప్రారంభిస్తాం. జగన్ బటన్ నొక్కుతున్నాడు. కానీ ఆ బటన్ కు కరెంటులేదు, డబ్బులు పడటం లేదు. కాలేజి వాళ్లు హాల్ టిక్కెట్లు, మార్కులు లిస్టులు ఇవ్వాలంటే డబ్బు కట్టాలని అంటున్నారు. ఉమ్మడి మ్యానిఫెస్టోలో పొందుపర్చిన విధంగా పాత స్కూలు ఫీ రీఎంబర్స్ మెంట్ విధానం అమలుచేస్తాం. కళాశాలల్లో ఆగిపోయిన మార్కుల లిస్టులను వన్ టైమ్ సెటిల్ మెంట్ చేసి విద్యార్థులకు అప్పగిస్తాం.

*సింగిల్ సింహం మట్టికరవడం ఖాయం*

ముఖ్యమంత్రి జగన్ సింహం సింగిల్ అంటున్నాడు. సింహం ఎక్కడైనా పరదాలు కట్టుకుని వస్తుందా, వేటాడేందుకు రెండు సింహాలు వచ్చాయి, ఒకటి చంద్రబాబు, రెండు పవనన్న. జగన్ నీ టైమ్ అయిపోయింది. మే 13న రెండు సింహాల మధ్య నువ్వు మట్టి కరవడం ఖాయం. జగన్ నేను అనాధను అంటున్నాడు. తండ్రిని చంపి జడ్జి ముందు నేను అనాధను, కాపాడమని అడిగినట్లుగా ఆయన వ్యవహారశైలి ఉంది. ఎన్నిలపుడు జగన్ రెండు డ్రామాలు రక్తికట్టిస్తారు. మొదటిది శవరాజకీయాలు, రెండోది సానుభూతి. 2014లో తండ్రి శవాన్ని వాడారు. 2019లో బాబాయి శవాన్ని వాడారు. ఇటీవల పెన్షన్లు ఇవ్వకుండా 32మంది వృద్ధులు చంపి ఆ శవాలతో రాజకీయం చేయాలని చూశారు. ఇటీవల జగన్ పై స్పెషల్ గులకరాయి పడింది. ఆ రాయి సిఎంకు తగిలి, తర్వత వెల్లంపల్లి రెండుకళ్లకు తగిలిందట. గులకరాయి కూడా కోడికత్తిలాంటిదే. సిఎం బస్సు యాత్ర చేసేటప్పుడు తొలిరోజు చిన్నగా ఉన్న బ్యాండేజి శ్రీకాకుళం వెళ్లాక పెద్దదైంది. కనీసం అక్కడ మరక కూడా లేదు. జగన్ సినిమాల్లోకి వెళ్లి ఉంటే బ్రహ్మానందంకు పోటీపడేవారు. గతంలో కోడికత్తి తర్వాత బాబాయ్ శవం లేచింది. ఇప్ప్డుడు ఎవరి శవం లేస్తుందోనన్నదే నా భయం.


*వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి రప్పిస్తాం*

గత టిడిపి హయాంలో రెండు డిఎస్సీలు ఏర్పాటుచేశాం, 32వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా 2.2 లక్షలమంది శిక్షణ ఇవ్వగా, 1.20లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. గతంలో పశ్చిమగోదావరిని గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేశాం. గతంలో ఆక్వారంగాన్ని ప్రోత్సహిస్తాం, విద్యుత్ సబ్సిడీ ఇచ్చాం. పట్టిసీమ పూర్తిచేశాం, చింతలపూడి ప్రాజెక్టు 80శాతం  పూర్తిచేశాం, డిఫెన్స్ కు భూములు, ఫార్మాకు భూములు కేటాయించాం. ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల అవన్నీ తెలంగాణాకు వెళ్లాయి. 2019లో ఒక్క అవకాశం మాయలో మోసపోయాం, వైసిపి అధికారంలోకి మొదటి సంవత్సరంలోనే 2.3లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తానన్నారు, జాబ్ లెస్ క్యాలెండర్ ఇచ్చారు, ప్రతిఏటా కానిస్టేబుల్ పోస్టులు అన్నారు, ఒక్కటిలేదు. ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. 25కి 25కి డిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. 31మంది ఎంపిలు అయ్యారు. ఏనాడైనా ప్రత్యేక హోదా, నిధుల గురించి అడిగిరా?  పోలవరం ప్రాజెక్టు గురించి అడిగారా? ప్రభుత్వ అనాలోచిత చర్యలతో అమర్ రాజా, లులూ, రిలయన్స్, జాకీ పక్క రాష్ట్రానికి పారిపోయాయి.  ఒక్క ఓటువల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో యువత అంతా ఆలోచించాలి.  ఒక నెలలో టిడిపి-జనసేన ప్రభుత్వం వస్తుంది, తొలి సంతకం మెగా డిఎస్సీపైనే, 5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం,  నిరుద్యోగులకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. గతంలో వెళ్లిపోయిన పరిశ్రమలు రప్పించి, యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. ఎపి ప్రజలకు పిలుపునిస్తున్నా. మేలుకోండి ఆంధ్రులారా...ఎన్నాళ్లు ఉద్యోగాల కోసం వలస వెళ్తాం, మనకు ఆత్మగౌరవం, పౌరుషంలేదా, రాజధాని కట్టుకోలేమా, రాష్ట్రానికి రాజధాని ఏర్పాటుచేసుకోవాలి. పక్కరాష్ట్రాలవారు ఉద్యోగాలకోసం మనవద్దకు వచ్చేలా అభివృద్ధి చేసుకోవాలి. ఇందుకోసం అత్యధిక మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి.

*బడేటి చంటి, మహేష్ యాదవ్ లను గెలిపించండి!*

గోదావరి గర్జన అదిరిపోయింది, గోదావరి యూత్ పవర్ సూపర్. ద్వారకాతిరుమల ఆలయం ఉన్న పుణ్యభూమి ఈనేల. గోదావరి వాసుల మమకారం, వెటకారం కూడా సూపర్. గోదావరి జిల్లా అమ్మాయిని పెళ్లాడాను. ఇక్కడి ప్రజల ప్రేమ, ఆప్యాయత ఎవరూ మరువలేరు. ప్రపంచానిక్ రొయ్యలు, చేపలు పంపేది గోదావరి జిల్లాల నుంచే. ఏ రంగంగలో చూసినా గోదావరి వాళ్లు నెం.1గా ఉంటారు. కష్టాన్ని నమ్ముకున్న వాళ్లు గోదావరి వాసులు. సాంప్రదాయంగా కోడిపందాలు వేస్తారు, వచ్చే సంక్రాంతికి వచ్చి ఇక్కడ కోడిపందాలు చూస్తా. గతంలో ఇదే గడ్డపై యువగళం పాదయాత్ర చేశా. ఇప్పుడు యువగళం సభకు ఇక్కడకు రావడం నా అదృష్టం. గత ప్రభుత్వ హయాంలో 1200 కోట్లతో బడేటిబుజ్జి ఏలూరును అభివృద్ధి చేశారు, ఇక్కడి ఎమ్మెల్యేగా ఉన్న నాని కరోనా సమయంలో మంత్రిగా ఉన్నా ఎంతోమంది చనిపోయారు, బాధేస్తోంది. వైద్యఆరోగ్య మంత్రిగా పనిచేసి, సొంత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడలేకపోయారు. తాగునీరు కలుషితమైనపుడు నేనువచ్చా, ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం లేదు. కార్పొరేటర్లు ప్రజలను వేధిస్తున్నారు. ఇదే రాజకీయం అనుకుంటున్నారు. ఎన్నికల తర్వాత అసాంఘిక శక్తులకు తగిన గుణపాఠం చెబుతాం. ఏలూరులో ఆగిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభించాలంటే ఎమ్మెల్యే, ఎంపిలను గెలిపించాలి. ఆనాడు బడేటి బుజ్జి ఏ ఆశయాలతో అభివృద్ధిచేశారో అదే ఆశయాలను చంటి ముందుకు తీసుకెళ్తారు. ప్రజల గురించి అహర్నిశలు ఆలోచించే వ్యక్తి చంటి,ఈసారి  ప్రతిఓటు కీలకమైనది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవనన్న చెప్పిని మాటను అందరూ గుర్తు తెచ్చుకోవాలి. ఏలూరులో భూకబ్జాదారులు, గంజాయి బ్యాచ్ ల భరతం పట్టాలంటే చంటిని అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి పంపాలి. కేంద్రం నుంచి నిధులు రాబట్టి అభివృద్ధి చేసేందుకు ఎంపి అభ్యర్థి మహేష్ యాదవ్ ను గెలిపించాలి. ఆయన ఎంపి అయితే నిధులు, పెట్టుబడులు తెస్తారని లోకేష్ చెప్పారు.


Comments