మంగళగిరి రోడ్ షో లో నారా బ్రాహ్మణికి బ్రహ్మరథం.



*మంగళగిరి రోడ్ షో లో నారా బ్రాహ్మణికి బ్రహ్మరథం*


*దారిపొడవునా పూలవర్షం, హారతులు పట్టిన మహిళలు*

*ప్రజా ప్రభుత్వం రాగానే మంగళగిరి రూపరేఖలు మార్చేస్తామంటూ ప్రజలకు నారా బ్రాహ్మణి భరోసా*

మంగళగిరి (ప్రజా అమరావతి):

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పట్టణంలో నిర్వహించిన రోడ్ షో లో శ్రీమతి నారా బ్రాహ్మణికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా పూల వర్షం కురిపించారు. విక్టరీ సింబల్ చూపిస్తూ జై లోకేషన్న అంటూ నినాదాలు చేశారు. వైష్ణవి ఫంక్షన్ హాల్ నుంచి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకూ సాగిన ఈ రోడ్ షో లో భారీగా ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ...మంగళగిరి వస్తే సొంతింటికి వచ్చినట్టు ఉంటుంది. మీరంతా మా కుటుంబసభ్యులతో సమానం. అధికారంలోకి రాగానే మంగళగిరిలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తాం. లోకేష్ గారు ఎప్పుడూ మంగళగిరి ప్రజల గురించి, వారికి సంక్షేమం అందించేందుకు కొత్తగా ఎటువంటి పథకాలు తీసుకురావాలనే ఆలోచిస్తూ ఉంటారు. ఓటు వేయడం మనందరి బాధ్యత. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయాలి. అభివృద్ధికి పట్టం కట్టాలి. 

*స్థానికులతో మాటామంతీ:*

రోడ్ షో అనంతరం స్థానికులతో బ్రాహ్మణి మాట్లాడారు. ఉపాధి ఎలా ఉంది అంటూ పలువురు చిరు వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. మంగళగిరి వాసుల కోసం లోకేష్ గారు 29 పథకాలు అందిస్తున్నారని అందరూ వాటిని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం చిన్న బండి దగ్గర టిఫెన్ చేశారు.

Comments