రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేద్దాం.



*రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేద్దాం


*


*చంద్రబాబు నాయుడు సీఎం  అయితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది* 


*సినీ హీరో నారా రోహిత్* 

కావలి  (ప్రజా అమరావతి);

వైసీపీ 5 ఏళ్ల అరాచక పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని మొన్నేదిన్నేపాలెంలో ఎన్డీయే కూటమికి మద్దతుగా రోహిత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ...ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన వైసీపీ పాలన ప్రతిపక్షాలు, ప్రజలపై అక్రమ కేసులు, అరాచకాలు దౌర్జన్యాలతో సాగింది. ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసి 52 రోజులు జైల్లో ఉంచారు. రూ. 5  రూపాయలకే పేదవాడికి అన్నం పెడుతున్న  అన్న క్యాంటీన్ మూసివేసి పేదవారి నోటికాడ కూడుని తీసేసిన దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన 74 మంది బీసీ సోదరులను వైసీపీ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది. బీసీ నాయకులైన అచ్చెన్నాయుడు,అయ్యన్నపాత్రుడుపై అక్రమ కేసులు పెట్టి వేధించారు. తెలుగుదేశం ప్రభుత్వం స్థానిక సంస్ధల ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్ 24 శాతానికి తగ్గించి రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావాల్సిన 16,800 పదవులకు బీసీలను దూరం చేశారు. విదేశీ విద్యను రద్దు చేసి పేద బడుగు బలహీన వర్గాలను విదేశీ విద్యను దూరం చేశాడు. దళిత సోదరులపై జగన్ దమనకాండ ప్రకటించారు. విశాఖ జిల్లాలో మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ ను హత్య చేశారు. దళిత డ్రైవర్ సుబ్రమణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరి చేసినా చర్యలు లేవు. నిందితులకు కొమ్ముకాస్తూ జగన్ రెడ్డి బడుగు, బలహీన వర్గాలపై కపట ప్రేమ నటిస్తున్నాడు. టీడీపీ హయాంలో మైనార్టీల కోసం తెచ్చిన సంక్షేమ పధకాలన్నీ జగన్ రెడ్డి రద్దు చేసి వారికి అన్యాయం చేశారు. రంజాన్ తోఫా, దుల్హన్ పథకాలను రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. రైతులనూ ఇబ్బంది పెట్టారు. ఇంట్లో  ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి అమ్మఒడి అమలు చేస్తానని అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకరికే అంటూ మోసం చేశాడు. అధికారంలోకి వచ్చిన వారం రోజులలోనే సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులను నిలువున మోసం చేశాడు.

  ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకూ. 1500 ఇస్తాం, తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలున్నా..ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 15 వేలిస్తాం. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సౌకర్యం కల్పిస్తాం. డ్రాక్రా మహిళలకు రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణం అందిస్తాం. జగన్ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు...ఇచ్చాడా? మెగా డీఎస్సీ అన్నాడు..ఇచ్చాడా?కూటమి అధికారంలోకి రాగానే మొదటి సంతకం డీఎస్సీపైనే పెడతా. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తాం. బోగాపురం ఎయిర్ పోర్ట్ కడతాం. ఐటీకి ఫ్రాధాన్యత ఇస్తాం. వర్క్ ప్రమ్ హోం విధానం తెస్తాం. నెలకు నిరుద్యోగ భృతి రూ. 3 వేలిస్తాం. అన్నదాత కింద రైతుకు ఏడాదికి రూ. 20 వేలిస్తాం. వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది గోరంత దోచుకుంది కొండంత. ల్యాండ్ శాండ్, మైన్ మద్యం మాఫియాతో వేలకోట్లు దోచుకున్నారు. 

రాష్ట్రం అభివృద్ధి బాధించాలంటే తెలుగు దేశ ప్రభుత్వం అధికారంలోకి రావాలి.. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే పరిశ్రమలు వస్తాయని అన్నారు. అప్పుచేసి పప్పుకూడు తినటం గొప్పకాదు.. వైసీపీ ప్రభుత్వంలో లక్షల కోట్లు అప్పుగా తీసుకువచ్చారు. రాష్ట్ర పరిస్థితి ఇవ్వాళ శ్రీలంకల తయారవ్వటానికి కారణం జగన్మోహన్ రెడ్డి అసమర్ధ పాలననే నిదర్శనం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి. అందరూ తప్పకుండా మే 13వ తేదిన సైకిల్ గుర్తుకు  ఓటేయాలి.  మీ భవిష్యత్తుకు మీరే దారి వేసుకోవాలి. తప్పకుండా ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి కృష్ణారెడ్డిని, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ రోడ్డు షో లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కన్వీనర్ అట్లూరి నారాయణ రావు, తాడికొండ సాయి కృష్ణ పాల్గొన్నారు. రోడ్డు షో అనంతరం విద్యార్థులతో, నిరుద్యోగులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

Comments