కూటమి ప్రభుత్వం రావడంతో రాష్ట్రానికి పరిశరమలు క్యూ.


మంగళగిరి (ప్రజా అమరావతి);


*టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ విలేకరుల సమావేశం వివరాలు*


*కూటమి ప్రభుత్వం రావడంతో రాష్ట్రానికి పరిశరమలు క్యూ*



*వైసీపీ అప్పులు చేస్తే.. మేం పెట్టుబడులు తెస్తున్నాం*


*4 నెలల్లో రూ.60 వేల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చాం*


- *టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్*


పెట్టుబడులు, అభివృద్ధి గురించి జగన్ రెడ్డి ఏనాడు ఆలోచించలేదని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రానికి విదేశీ స్వదేశీ కంపెనీలు క్యూ కడుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు.మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...“జగన్ రెడ్డి ప్రభుత్వం అనేక అప్పులు చేసి వెళ్తే.. కూటమి ప్రభుత్వం కష్టించి పెట్టుబడులు తీసుకువచ్చి ఆ అప్పులు తీరుస్తోంది. విన్ఫాస్ట్, మోగ్లిక్స్, వెర్మీరెన్ వంటి విదేశీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. మంత్రి నారా లోకేష్ కృషితో విశాఖలో టీసీఎస్ కంపెనీ తమ యూనిట్‌ను నెలకొల్పనుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాము ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నామంటూ ఫాక్స్‌కాన్ సంస్థ మంత్రి లోకేష్‌ని కలిసింది. ఫాక్స్ కాన్, ఆపిల్ ఫోన్ లాంటి కంపెనీల గురించి జగన్‌కు అసలు అవగాహనే  లేదు. ఫాక్స్ కాన్ సంస్థ ఐఫోన్‌లు తయారీ చేస్తుందని కూడా జగన్ రెడ్డికి తెలియదు. జగన్ ఫోన్లే వాడనంటాడు. ఫోన్లు వాడనివారికి ఐఫోన్ కంపెనీ గురించి, అవి తయారు చేసే కంపెనీ పెట్టాలని ఆలోచన ఎక్కడి నుండి వస్తాయి?” అని సందేహం వ్యక్తం చేశారు.


*రాష్ట్రం నుండి పరిశ్రమలను జగన్ రెడ్డి తరిమేశారు...*

“2014-19 మధ్యలో సెల్కాన్, ఫాక్స్ కాన్ లాంటి కంపెనీలను బ్రహ్మాండంగా టీడీపీ ప్రభుత్వం పెట్టింది. ఎలక్ట్రాన్ సిటీకి 1501 ఎకరాలను నాడు టీడీపీ ప్రభుత్వం కేటాయిస్తే జగన్ రెడ్డి భూ కేటాయింపును రద్దు చేశాడు. దుబాయికి చెందిన లూలూ సంస్థలకు నాడు టీడీపీ ప్రభుత్వం భూములను కేటాయిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక వారిని తరిమేశారు. మళ్లీ అదే సంస్థ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెల్లూరు, తిరుపతిలో పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చింది” అని అన్నారు.


*పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న ప్రముఖ సంస్థలు...*

“గండికోట, అలిపిరి, వైజాగ్, హార్స్ లీ హిల్స్ లలో ఐదు నక్షత్రాల హోటళ్లు పెట్టడానికి ఒబెరాయ్ సంస్థ ముందుకొచ్చింది. ప్రఖ్యాతి చెందిన బ్రూక్ ఫీల్డ్ కార్పొరేషన్ సంస్థ పునరుత్పాదక శక్తి ఐటీని రూ.3 వేల కోట్ల పెట్టుబడులతో విజయవాడలో యూనిట్ ను విస్తరింపచేయడానికి ముందుకొచ్చింది. 4,500 మంది పనిచేసే హెచ్సీఎల్ సంస్థ కూడా తమ సంస్థ విస్తీరణకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐటీ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉంది.  అనంతపురంలో సుజ్లాన్ అనే విన్ టర్బైన్ల తయారీ కంపెనీ ఏర్పాటుకు ఆ సంస్థతో ఒప్పందం కుదిరింది. రూ.250 కోట్లతో XLRI మేనేజ్ మెంట్ ఇన్సిటిట్యూట్ ను అమరావతిలో నిర్మించనుంది. ముంబయికి చెందిన  టాటా సన్స్, యూనిట్ మాల్ సంస్థ వైజాగ్ లో పెట్టుబడులు పెట్టనున్నాయి. ఢిల్లీకి చెందిన జైరాజ్ ఇస్పాత్ సజ్జన్ గోయాంకా అనే సంస్థ రెండో యూనిట్ ను కర్నూలులో విస్తరించనున్నారు. చెన్నైకి చెందిన అపోలో యూనివర్శిటీని రాష్ట్రంలో నెలకొల్పనున్నారు. SRM యూనివర్శిటీ వెయ్యి పడకల ఆసుపత్రి, ఏ1 యూనివర్శిటీని అమరావతిలో పెట్టనున్నారు. అమెరికాకు చెందిన గూగుల్ సంస్థ వైజాగ్ లో యూట్యూబ్ అకాడమీని నెలకొల్పనుంది. సబ్ స్ట్రేట్ తయారీ కంపెనీ వైజాగ్ లో ఏ1 మెటీరియల్ తాయారీ సంస్థ నెలకొల్పనుంది. గోద్రెజ్, ఆంధ్రా పేపర్, రీసోల్యుట్ ఎలక్ట్రానిక్స్ ఆరియా గ్లోబల్, ఇండియన్ డైజన్ గార్మెంట్స్, మ్యాగ్లిక్స్, వర్మీరన్, ఏపీ మెడ్ టెక్ జోన్, విన్ ఫాస్ట్ తదితర సంస్థలు రాష్ట్రానికి రావడానికి ఒప్పందం కుదిరింది” అని తెలియజేశారు.


*పోలవరం డ్యామ్, రాజధాని నిర్మాణాలు పనులు చేయాల్సివుంది...*

“పోలవరం డ్యామ్ నిర్మాణం వేగవంతం కానుంది.  అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కూడా చేయాల్సివుంది.  కొప్పర్తి, ఓర్వకల్‌లో పారిశ్రామిక వాడలు, రైల్వే జోన్, రాష్ట్ర రోడ్లు, అమరావతి ఈస్టర్న్ మరియు వెస్ట్రాన్ బైపాస్ రోడ్ల నిర్మాణానికి కూడా ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపారు. 2014-19లో మా ప్రభుత్వం హయాంలో మేము ఎస్ఆర్ఎమ్, విఐటి, అమృత్ యూనివర్సిటీలను తీసుకువస్తే జగన్ రెడ్డి వాటికి రోడ్లు వెసిన పాపాన పోలేదు. అమరావతిని జగన్ రెడ్డి పాడు పెట్టాడు. అమరావతికి కేంద్ర ప్రభుత్వం హామీ ప్రకారం 90 శాతం గ్రాంట్లుగా వరల్డ్ బ్యాంకు రూ.15,000 కోట్లు ఇవ్వనుంది. పోలవరానికి రూ.2,500 కోట్లు కేంద్రం అందించింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కులకు రూ.25 వేల కోట్లు పెట్టుబడులు, 75వేల మంది యువతకు ఉపాధికి కేంద్రం ఆమోదించింది. మొత్తంగా నాలుగు నెలల్లో రూ.60 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఈ మంచి ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇదే నిజమైన విజయదశమి పండుగ. సంపదసృష్టి అంటే ఇదేనని జగన్ రెడ్డి తెలుసుకోవాలి” అని సూచించారు.

Comments