విజయవాడ (ప్రజా అమరావతి);
రూ.23 కోట్లు దాటిన ఆర్టీసీ సంక్రాంతి ఆదాయము
ఏ.పి.ఎస్.ఆర్.టి.సి చరిత్ర లో మునుపెన్నడూ లేని విధంగా 20. 01. 2025న రికార్డు స్థాయి లో రూ.23.71 కోట్ల ఆదాయాన్ని సాదించింది. అంతే కాకుండా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ రోజులలో మూడు సార్లు గతములో ఎన్నడూ లేని విధముగా రోజువారీ ఆర్టీసీ ఆదాయము రికార్డు స్థాయిలో రూ. 20 కోట్లు దాటినది. సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులన్నీ నడుపుటవలన మరియు ప్రయాణికులు విశేషంగా ఆదరించడంవలన ఆర్టీసీ ఆదాయము రికార్డు స్థాయిలో సాధించినది.
ఈ సంవత్సరం సంక్రాంతి పండుగను పురష్కరించుకుని సంస్థ 7,200 బస్సులను నడుపుటకు కార్యాచరణ సిద్ధం చెయ్యగా ప్రయాణికుల అవసరాలకు అనుగుణముగా 9,097 బస్సులను నడిపినది. ఈ ప్రత్యేక బస్సుల ద్వారా సంస్థ రూ. 21.11 కోట్ల ఆదాయయము సముపార్జించినది.
సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులు నడిపితే ప్రయాణీకులు ఆదరిస్తారనడానికి ఇదొక నిదర్శనం. ఈ సంక్రాంతికి ప్రయాణికులు వారి యొక్క ప్రయాణ వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సులనే ఎంచుకున్నారు. ఇతర ప్రైవేటు వాహనాలు మరియు సొంత వాహనాల కంటే ఆర్టీసీకే మొగ్గు చూపారు.
ప్రయాణికులకు ముందస్తుగా బస్సులను అందుబాటులో ఉంచడం, నిర్వహణకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించడం, సమర్ధవంతంగా నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు బస్సులను పర్యవేక్షించడం, ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయడం వల్లనే ఆర్టీసీ రికార్డు స్థాయి ఆదాయం సాధించగలిగింది. సంస్థలోని సిబ్బంది ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్ల అంకితభావం, వారియొక్క కృషి ఫలితంగానే ఈ సంక్రాంతి ప్రత్యేక సమయంలో ఈ ఘనత ఆర్టీసీ సాధించింది.
ప్రత్యేక సర్వీసుల పట్ల ప్రయాణికులు చూపించిన ఆదరణ ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ఎప్పటికీ మరువలేనిది. మునుముందు కూడా ఇదే ఆదరణ ఆర్టీసీ పట్ల చూపిస్తారని పూర్తిగా విశ్వసిస్తూ, మరొక్కసారి ఆదరించిన ప్రయాణికులందరికీ ఆర్టీసీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నది.
addComments
Post a Comment