*- ఎన్నికల సమయంలో మేమిచ్చిన హామీని నెరవేర్చాం*
*- వెంటిలేటర్ మీద ఉన్న ప్లాంట్కు రూ.11,440 కోట్లతో జీవం పోశాం.*
*- గత ఐదేళ్లలో ప్లాంట్ను ఎలా అమ్మాలి? వాటాలు ఎలా పంచుకోవాలి? అనే ఆలోచనలు గత పాలకులు నిమగ్నమయ్యారు*
*- నేడు వైసీపీ నేతలు ప్లాంట్ గురించి ప్రవచనాలు చెప్పడం హాస్యాస్పదం*
*- పూర్తి స్థాయి కెపాసిటీతో రెండేళ్ల పాటు ప్లాంట్ను నడిపితే సెయిల్లో విలీనం*
*- ప్లాంట్ యాజమాన్యం, కార్మికులు సమన్వయంతో లాభాల భాటలో ప్లాంట్ను నడపాలి*
*- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్*
విశాఖ (ప్రజా అమరావతి):
వైసీపీ ప్రభుత్వ దోపిడీ విధానాలకు బలై వెంటిలేటర్ దశకు చేరుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ.11,440 కోట్లతో జీవం పోసిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర బీజేపీ నేతలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలతో కలిసి ఆయన మాట్లాడుతూ.....
“కేంద్రం 11,440కోట్ల ఆర్థికసాయాన్ని అందించిన నేపథ్యంలో కీలకపాత్ర పోషించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబునాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు... విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రజలకు సెంటిమెంట్ వంటిది...దీన్ని గౌరవించి సహకారం అందించిన కేంద్ర ఉక్కు పరిశ్రమలశాఖ మంత్రి కుమార్ స్వామి, సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, నిర్మలా సీతారామన్, పురందేశ్వరీలు తమ సహాయ సహకారాలు అందించారు.ఉత్తరాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారు అందరినీ సమన్వయం చేస్తూ, విశాఖ ఉక్కును కాపాడేందుకు శ్రమించారు. కూటమి ప్రభుత్వం సమిష్టి కృషితో విశాఖ ఉక్కు పరిరక్షణ సాధ్యమైంది. కొనఊపిరితో ఉన్న విశాఖ ఉక్కును కాపాడుకున్నాం. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు, నిర్వాసితుల మనోభావాలు, కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని అందరం సమిష్టి కృషితో విశాఖ ఉక్కును కాపాడుకోగలిగాం. కేంద్రానికి మరోసారి కృతజ్ఞతలు. 1998లో ప్లాంట్ ను బీఏఎఫ్ఆర్డీకి రిఫర్ చేసిన సమయంలో ప్లాంట్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ప్లాంటులోని అన్ని శాఖలను సమన్వయం చేయడం, ఆర్థిక పరిస్థితులను అధిగమించడం కోసం అప్పటి ప్రధాని వాజ్ పేయీ గారిని ఒప్పించి, ఈక్విటీ షేర్ క్రింద కన్వర్ట్ చేసి రూ.1,333కోట్లు తీసుకొచ్చారు. ఆ సమయంలో యాజమాన్యం, కార్మికుల సమిష్టి కృషితో ప్లాంటును లాభాల బాటలో నడిపించుకునేందుకు మార్గం ఏర్పడింది. రిజర్వ్ క్యాపిటల్ కూడా సుమారు రూ.10వేల కోట్లకు వెళ్లిపోయింది.. ఆ సమయంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని 3.3 మిలియన్ టన్నుల నుండి 7.3 మిలియన్ టన్నులకు పెంచేందుకు లోన్లు తీసుకొచ్చి పనులు చేశారు. ఆ సమయంలో వచ్చిన కొన్ని విపత్తులు, నిర్వహణ లోపాలు, కార్మికులు, యాజమాన్యానికి మధ్య సమన్వయ లోపంతో మరోసారి విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసమయానికి ప్లాంట్ రన్నింగ్ కెపాసిటీ 25శాతం మాత్రమే ఉంది. 25శాతం కెపాసిటీకి తగ్గిపోవడం వల్ల ప్లాంటు నిర్వహణ విషయంలో ఆర్థికభారం అధికమైంది. నష్టాల బాటలోకి వెళ్లిపోయింది. ఇలాంటి పరిస్థితిలో సుమారు రూ.1650కోట్లతో దానిని 75శాతం కెపాసిటీకి పెంచి, వెంటిలేటర్ పరిస్థితిలో నుండి లాభాల బాటలో పెట్టడానికి కూటమి ప్రభుత్వం కృషి చేసింది. ప్లాంటు కెపాసిటీ మొత్తాన్ని వినియోగించుకుంటేనే ప్లాంటు లాభాల బాటలో వెళుతుందని కేంద్రం గుర్తించి సహకరిస్తోంది. విశాఖ స్టీల్ పై కేంద్రానికి నమ్మకం వచ్చింది, విశాఖ ప్రజల సెంటిమెంట్ ను గౌరవించారు, గుర్తించారు, నాయకులు, కార్మికుల పోరాటాలు, నిర్వాసితుల ఆలోచనలకు అనుగుణంగా కేంద్రం రూ.11,440కోట్లను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇచ్చింది. ఈ ప్యాకేజీని కేంద్రం ప్రకటించే ముందు ముఖ్యమంత్రి, నాయకులు ప్లాంటు పూర్తి సామర్థ్యంతో రెండు సంవత్సరాలు పనిచేస్తే దీన్ని సెయిల్ లో విలీనం చేయడానికి అవకాశం ఉందని అన్నారు. మా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాం... ఇకపై యాజమాన్యం, కార్మికులు ప్లాంటును పూర్తి సామర్థ్యంతో నిర్వహించే బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి. విశాఖ ఉక్కుకు వచ్చిన డబ్బులు ప్రజా ధనం...భవిష్యత్తు తరాలకు ఉద్యోగావకాశాలు పెంచాలనే ఉద్దేశంతో విశాఖ స్టీల్ ప్లాంటుకు కేంద్రం సహకరిస్తోంది. ప్లాంటును పరిరక్షించే బాధ్యతను మేము తీసుకుంటాం.... బాబు ఉంటేనే ప్లాంటు ఉంటుంది.....ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. కార్మికులు, యాజమాన్యం సమిష్టి కృషితో ముందుకు వెళ్లాలని కోరుతున్నాను. 0.5 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉన్న ప్లాంటుకే రూ.15వేల కోట్లు ఇచ్చారని కొందరు విమర్శిస్తున్నారు. ప్లాంటు రేటెడ్ కెపాసిటీకి అనుగుణంగా ప్లాంటును నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయి. విశాఖ స్టీల్ ప్లాంటును కొనఊపిరితో ఉన్న పరిస్థితి నుండి రూ.11,440కోట్లతో బ్రతికించడం జరిగింది. గాజువాకలో ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నిర్వహించిన మీటింగులో నేను, భరత్ విమానాశ్రయం నుండి చంద్రబాబును తీసుకొచ్చే సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంటు కార్మికులకు ఏం సమాధానం చెప్పాలని అడిగిన సందర్భంలో మేము విశాఖ ఉక్కును కాపాడాల్సిన అవసరం ఉందని చంద్రబాబుకు బలంగా చెప్పాము. విశాఖ ఉక్కు పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. మేం కూడా ఎన్నికల ప్రచారాల్లో ప్రకటించాం. ఎన్నికల ముందు విశాఖ ఉక్కు కార్మికులకు మేం హామీ ఇచ్చాం....అదేవిధంగా నేడు మేం ఇచ్చిన హామీలకు అనుగుణంగా విశాఖ ఉక్కును కాపాడుకున్నాం. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో విశాఖ ఉక్కుకు అన్ని విధాలా అండగా నిలబడ్డాను. హుద్ హుద్ సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు కరెంటు సరఫరా ఆగిపోతే ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి త్వరితగతిన కరెంటును త్వరగా పునరుద్ధరించి అండగా నిలబడి, ప్లాంటుకు నష్టాలు రాకుండా కాపాడాం. కొంత మంది ఉద్యమాలు చేస్తున్నారు....కానీ వాళ్లు ఉద్యమాల మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. ఉద్యమాలు ప్రజలను చైతన్యవంతం చేసేలా ఉండాలి...కానీ వాళ్లు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్యమాలను వాడుకుంటున్నారు. విశాఖ ప్లాంటు మొత్తాన్ని సమూలంగా నాశనం చేసి రాజధాని కట్టాలని చూసిన వాళ్లు నేడు విశాఖ స్టీల్ ప్లాంటు గురించి నీతిసూక్తులు మాట్లాడుతున్నారు. గత సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం గత ప్రభుత్వం తాలూకు ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాజీనామా చేసేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంటు స్థానంలో రాజధాని కట్టాలని జగన్ రెడ్డి అన్న సందర్భంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంటుకు చెందిన 7వేల ఎకరాలు అమ్మేద్దామని, గంగవరం పోర్టు అమ్మేద్దామని ప్రయత్నాలు చేయలేదా? ప్రజల మనోభావాలతో వైసీపీ నేతలు ఆటలాడవద్దని హెచ్చరిస్తున్నాను....విశాఖ స్టీల్ ప్లాంటుకు భూములు ఇచ్చిన 8వేల మంది నిర్వాసితులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నేడు విశాఖ ఉక్కు ఉద్యమం నడుస్తుందంటే దానికి కారణం నిర్వాసితులే....నిర్వాసితుల మనోభావాలతో ఆటలాడవద్దని కోరుతున్నాను. ఉద్యమాలు చేసేవాళ్లు ప్లాంటు ఫుల్ కెపాసిటీతో నడిచేలా సహకరించాలని కూడా కోరుతున్నాను. విశాఖ స్టీల్ ప్లాంటు రవాణాకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో నెలకొల్పారు....దీన్ని పాడుచేయాలని చూడొద్దు. విశాఖ స్టీలు ప్లాంటుకు సొంత గనులు వచ్చేందుకు కృషి చేస్తాం, ఇంకా అవసరమైన ఆర్థికసాయం కోసం ప్రయత్నిస్తాం. విశాఖ స్టీల్ ప్లాంటుకు అవసరమైన ప్రతి అవసరాన్ని తీర్చడానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రం, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎన్డీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంటును పూర్తిస్థాయిలో వినియోగించి ఫుల్ కెపాసిటీతో నడిపించడంతో కార్మికులు, యాజమాన్యం సమిష్టిగా కృషి చేయాలి. మేం అన్ని విధాలా అండగా ఉంటాం. విశాఖ ప్లాంటుకు అవసరమైన, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మాంగనీస్ మైన్ ను వైసీపీ ప్రభుత్వం ఎందుకు రెన్యూవల్ చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. చీపురుపల్లి, సరిపల్లిలో ఉన్న శాండ్ మైన్ ను ఎందుకు అప్రూవల్ చేయలేదో వైసీపీ నేతలు చెప్పాలి. క్వార్ట్ మైన్ ను ఎందుకు రెన్యూవల్ చేయలేదు? 50సంవత్సరాలు ఒప్పందం చేసుకున్న మైన్స్ ను వైసీపీ ప్రభుత్వం ఎందుకు అప్రూవ్ చేయలేదు? విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మేద్దాం, వాటాలు కొట్టేద్దాం అని వైసీపీ నేతలు కుట్రపూరితంగా గత ఐదేళ్లు వ్యవహరించారు. వైసీపీ నేతలే బహిరంగా చెప్పారు....విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మా నాయకుడు మాట్లాడొద్దనే విషయాన్ని మాతో చెప్పారు. యువనేత నారా లోకేష్ పాదయాత్ర చేసిన సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో రాత్రిపూట బస చేసిన సందర్భంలో మా ఉత్తరాంధ్ర నేతలందరితో చర్చించి, స్టీల్ ప్లాంటు కార్మికులు, నాయకులతో చర్చించి విశాఖ ఉక్కు పరిరక్షణకు ఆ సమయంలో హామీ ఇచ్చారు. నేడు చేసి చూపించారు. విశాఖ ఉక్కు పరిరక్షణే నా ఆశయం....ఆ ఆశయం మేరకే ముందుకు వెళుతున్నాను. విశాఖ ఉక్కు కోసం టీడీపీలో రెండు తరాలు కృషి చేశాయి...చేస్తున్నాయి... విశాఖ ఉక్కు కోసం నేను, గంటా శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలంతా చిత్తశుద్ధితో గత ఐదేళ్లలో పోరాటాలు చేశాం. అధికారంలోకి వచ్చాక సమిష్టి కృషితో విశాఖ ఉక్కును పరిరక్షించాం. విశాఖ ఉక్కు విషయంలో వైసీపీ నేతలు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి....ప్రజలు నవ్వుతున్నారని గ్రహించాలి” అన్నారు.
addComments
Post a Comment