కిడ్నాప్ చేసి బాధితులనే బెదిరిచిన వాళ్ళను పరామర్శించడానికి జగన్ సిగ్గుపడాలి.




అమరావతి (ప్రజా అమరావతి);


*కిడ్నాప్ చేసి బాధితులనే బెదిరిచిన వాళ్ళను పరామర్శించడానికి జగన్ సిగ్గుపడాలి



*


- పార్టీ కార్యాలయాలపై దాడి చేసిటువంటి చరిత్ర భారతదేశంలో ఎక్కడా లేదు

- దళితలపై దాడి చేసినటువంటి నిందితులకు వత్తాసు పలకడం సిగ్గుచేటు


కొల్లు రవీంద్ర

రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి



గన్నవరం కార్యాలయంలో దళితులపైనా, యువకులపైగా, మహిళలపైన దాడి చేసి, పార్టీ కార్యాలయాన్ని, అక్కడ ఉన్న కార్లు తగలబెట్టి, వ్యక్తుల్ని గాయపరిచినటువంటి వ్యక్తికి వత్తాసు పలకడానికి జగన్ రెడ్డికి సిగ్గుగా లేదా అని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. భారతదేశ చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీ కార్యాలయాలపైనా దాడి చేసిటువంటి ఘటనలు లేవు. అలాంటి నీచ చరిత్రకు తెరలేపడమే కాకుండా, దాడి గురించి ఫిర్యాదు చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేసిన వ్యక్తిని వెనకేసుకు రావడం దుర్మార్గం అన్నారు. కార్యాలయాలపై దాడి చేసిన సంస్కృతికి తెరలేపింది జగన్ రెడ్డేనన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... పార్టీ కార్యాలయంపై దాడిపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసిన కేసులో అరెస్టయి జైలులో ఉన్న వంశీని సిగ్గులేకుండా పరామర్శకు వెళ్లారు. పరామర్శ తర్వాత తప్పడు మాటలు మాట్లాడుతున్నారు. పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం వంటి ఘటనలు ఇదివరకు ఎప్పుడూ జరగలేదు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రశాంతంగా ఉన్నటువంటి కృష్టా జిల్లాలో పులివెందుల ఫ్యాక్షనిజాన్ని తీసుకురావడానికి జగన్ రెడ్డి వారి గూండాలు ప్రయత్నించారు. ఎంతో మంది మేధావులు పుట్టినటువంటి గడ్డ ఈ కృష్ణా జిల్లా. స్వర్గీయ నందమూరి తారక రామారావు, త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య , కాశీనాధుని మల్లికార్జునరావు, చండ్రా రాజేశ్వరావు, పుచ్చలపల్లి సుందరయ్య వంటి మేధావులు పుట్టిన కృష్టా జిల్లాను రౌడీమూకలతో దాడి చేయించి దిగజార్చే విధంగా చేసిన నీచుడు జగన్ రెడ్డి. జగన్ లాంటి అరాచక వ్యక్తుల అండ చూసుకునే వల్లభనేని వంశీ లాంటివారు అరాచకాలకు పాల్పడ్డారు. 

పోలవరం గట్ల మీద మట్టి కొట్టేశారు. బ్రహ్మలింగం చెరువు మట్టి కొట్టేశారు.  అక్రమంగా దాడులు చేసి, భయబ్రాంతులకు గురిచేశారు. ఇనుపరాడ్లు పట్టుకుని రోడ్లపైన తిరుగుతూ మహిళలపై దాడులు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పని చేస్తున్నటువంటి ఒక దళిత వ్యక్తి సత్యవర్థన్ ఫిర్యాదు చేస్తే కిడ్నాప్ చేసి దాడి చేసి అతనిని బెదిరించి తప్పడు వాంగ్మూలం ఇప్పించి అతను కేసును వాపస్ తీసుకునేలా చేసింది వల్లభనేని వంశీ కాదా? ఈరోజు సాక్ష్యాలతో సహా బట్టబయలైతే పోలీసుల్ని బెదిరిస్తున్నారు. నిస్పక్షపాతంగా విచారణ చేస్తున్న అధికారుల్ని అసభ్యపదజాలంతో దూషిస్తున్నారు. ఇదేనా జగన్ రెడ్డి నీ సంస్కారం. ఒక నిందుతుడ్ని కలవడానికి జైలుకు వచ్చి  విచారాణాధికారుల్ని దూషించడం సిగ్గుచేటు.

ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని నాశనం చేశారు. రాజకీయ చైతన్యం, మేధావులు పుట్టిన గడ్డపైకి దుర్మార్గులు చేరి నాశనం చేశారు. ఇలాంటి నేరస్తులకు జగన్ రెడ్డి వత్తాసు పలుకుతున్నారు. ఇలాంటి అరాచకాలు మరోసారి పునరావృత్తం కాకుండా చూస్తాం. క్యాసినోలు, కబ్జాలు, భూములు కొట్టేయడం, దాడులు లాంటి మరెన్నో బయటకు వస్తున్నాయి. అధికారం ఉంది కదా అని కృష్టా జిల్లాలో వల్లభనేని వంశీ, కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని చేసునటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. పవిత్రమైనటువంటి పార్టీ కార్యాలయాలపైన దాడులు చేయించారు. తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలేది లేదు. 

గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి చేసి, కార్లు తగలబెట్టి, ఫర్నిచర్ ధ్వంసం చేసి, మహిళలపై దాడి చేసిన ఎవరినీ వదిలిపెట్టం. దాడి చేయడమే కాకుండా టీడీపీ నాయకులపైనే కేసులు పెట్టి జైలులో పెట్టించారు. ఇలాంటి అరాచకాలకు పాల్పడిన వైసీపీ నాయకులను వదిలేది లేదు. కేసు పెట్టినటువంటి దళిత యువకుడ్ని దుర్మార్గంగా కిడ్నాప్ చేసి బెదిరించి భయపెట్తిన కేసులో ఉన్న ప్రతి వొక్కరిపై ప్రజాస్వామ్యబద్దంగా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు మరోసారి రాష్ట్రంలో జరగకుండా చర్యలుంటాయని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

Comments