గుంటూరు (ప్రజా అమరావతి);
*"ఆధునిక భారతం లో యువత పాత్ర కీలకం
"*
*ఘనంగా ముగిసిన అంతరాష్ట్రీయ యువ సమ్మేళనం*
ఆధునిక భారతం లో యువత పాత్ర కీలకం అని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే గంగాధరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం నందు భారత ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర, గుంటూరు ఆధ్వర్యంలో మంగళవారం నుంచి 5 రోజుల పాటు జరిగిన అంతరాష్ట్రీయ యువ సమ్మేళనం కార్యక్రమం లో ఎన్ఎస్ఎస్ భవన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమం లో ఒడిశా లోని 5 జిల్లాలైన మయూర్భంజ్, ఫుల్బాని, కందమాల్, గంజాం మరియు నబరంగపూర్ జిల్లాల నుంచి మొత్తం 26 మంది యువతి యువకులుయువతి యువకులు హాజరైయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరై న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే గంగాధరావు మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు మరియు అభ్యాసాల పరిజ్ఞానం మరియు రాష్ట్రాల మధ్య మెరుగైన అవగాహన పెరగటానికి సహాయపడుతుంది అని అన్నారు. ఈ సమ్మేళనం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలియజేసారు. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు అంశుమాన్ ప్రసాద్ దాస్ మాట్లాడుతూ ఈ సమ్మేళనం లో భాగమైన వివిధ అంశాలపై కార్యశాలలు, క్షేత్ర స్థాయి సందర్శనల ద్వారా ఒడిశా యువతకు జాతీయ ఐక్యత, సమగ్రత, శాంతి ప్రతిపాదకులుగా యువతి యువకులు వ్యవహరించేలా చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఒడిశా యువతకు ఇక్కడ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు తో సహా, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గురించి యువ సమ్మేళనంలో తెలియజేసే అవకాశం దొరికింది అని అన్నారు. గుంటూరు నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి కిరణ్మయి దేవిరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి సహకరించిన ప్రతి డిపార్ట్మెంట్ కు మరియు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎన్ ఎస్ ఎస్ విభాగ వాలంటీర్లకు ధన్యవాదములు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ దివ్యతేజో మూర్తి, కోఆర్డినేటర్, ఎన్ ఎస్ ఎస్, అతిధులుగా హాజరై ప్రసంసింగించగా సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదంగా జరిగింది. ఒడిశా నుంచి హాజరైన ప్రతి ఒక్కరికి పార్టిసిపంట్ సర్టిఫికెట్స్ అందజేశారు.
addComments
Post a Comment