పల్నాడు జిల్లాలో విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని కూటమి ప్రభుత్వం వెంటనే చెల్లించాల
ని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో "యువత పోరు" కార్యక్రమం
మాచర్ల (ప్రజా అమరావతి);
పల్నాడు జిల్లా వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ...
యువత పోరుకు విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి భారీ స్పందన
- ఫీజ్ రియంబర్స్మెంట్ ను దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొస్తే.. దానికి వైయస్ జగన్ ప్రాణం పోశారు
- నిరుపేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదివేందుకు జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు
- ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్లే కాలేజీలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు
- నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు
- 17 మెడికల్ కాలేజీ లు జగన్ స్థాపిస్తే వాటిని కూడా నిర్వీర్యం చేస్తున్నాడు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి
- కల్లుండి చూడలేని కాబోధి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించి.. విద్యార్థులకు అండగా ఉంటాం
- ఒక్క పిలుపుతో వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులకు, వారీ తల్లిదండ్రులకు కృతఙ్ఞతలు తెలిపిన పల్నాడు జిల్లా వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి .
addComments
Post a Comment