మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యరథోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్.

 *మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యరథోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్


*


మంగళగిరి (ప్రజా అమరావతి);

 వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు నిర్వహించిన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య రథోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. జై నారసింహ, గోవింద నామస్మరణల మధ్య రథాన్ని లాగారు. స్వామివారి దివ్యరథోత్సవాన్ని వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. పురవీధులు భక్త జనప్రవాహంతో కిక్కిరిసి పోయాయి. రథాన్ని లాగేందుకు అందరూ పోటీపడ్డారు. అర్చకులు స్వామివారికి హారతి ఇచ్చి దివ్య రథోత్సవాన్ని ప్రారంభించారు. అంతకుముందు స్వామివారి రథోత్సవంలో పాల్గొనేందుకు దేవాలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.


Comments