*ఇది మంచి ప్రభుత్వం. ప్రజా సమస్యలు పరిష్కరించటంలో అభివృద్ధి చేయటంలో ముందుంటాము: ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)*
*విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ది, రాష్ట్రాభివృద్ది పనుల పై మీడియా సమావేశం*
*ఎపి పారిశ్రామిక అభివృద్దికి నలుగురు సలహాదారులు నియామకం*
*ముఖ్యమంత్రి చంద్రబాబు కి ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ధన్యవాదాలు*
*ఎపికి ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా సిఎం, డిప్యూటీ సిఎం, లోకేష్ లు కృషి*
*అతి త్వరలో విజయవాడ, విశాఖ రెండు నగరాల్లో మెట్రో లైన్*
*ఎపికి 750 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరు*
*కేశినేని ఫౌండేషన్ ద్వారా ఎన్.ఐ.ఆర్.డి లో విలేజ్ చాంపియన్స్ కి శిక్షణ*
*295 గ్రామాల్లో విలేజ్ ఛాంపియన్స్ ఏర్పాటు*
*రాబోయే ఆరునెలల్లో వంద గ్రామాల్లో ఎమ్.ఎస్.ఎమ్.ఈ ప్రోగ్రామ్ పై అవగాహన సదస్సులు*
*ఇంట్లో మహిళలు కూడా ఆదాయాన్ని పెంచుకునేలా విప్లవాత్మక మార్పులు*
*కేంద్రం నుంచి నిధులు వెనక్కి తీసుకువచ్చేందుకు కృషి*
*గుణదల, రాయనపాడుతో పాటు మరో శాటిలైట్ స్టేషన్ కి ప్రయత్నం*
*ఆటోనగర్ పూర్వవైభవం కోసం కృషి*
*ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం సాయం*
*విజయవాడలో స్టేడియాలు అభివృద్ది చేసేందుకు సీ.ఎస్.ఆర్. ద్వారా నిధులు*
*క్రీడల ద్వారా గాడిన తప్పిన యువతను గాడిలో పెడతాము*
*రాబోయే నాలుగైదు నెలల్లో 700 క్రికెట్ కిట్స్ పంపిణీ*
*విజయవాడ నగర సుందరీకరణ పై ప్రత్యేక దృష్టి*
*నాలుగు రూరల్ నియోజకవర్గాల్లో వంద శానిటరీ వెండింగ్ మిషన్స్ ఏర్పాటు*
* నాలుగు రూరల్ నియోజకవర్గాల్లో నాలుగు శానిటరీ మ్యానఫ్యాక్చరింగ్ యూనిట్స్*
*రూ..12 కోట్ల40 లక్షలతో జిల్లాలోని యు.పి సి, పి.హెచ్.సి ఆధునీకరణ
విజయవాడ (ప్రజా అమరావతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఈ ఏడున్నర నెలల పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. అలాగే పరిశ్రమలు తీసుకువచ్చేందుకు, యువతకు ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించటంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం తో పాటు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గట్టిగా కృషి చేస్తున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు.
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ది, రాష్ట్రాభివృద్ది పనుల పై విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) శుక్రవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుల నియమాకం అంటే పొలిటికల్ ఉద్యోగాలు ఇచ్చేందుకు అన్నట్లుగా వుండేదన్నారు. ఎపి కి ఎఏరోస్పెస్, డిఫెన్స్ తో పాటు ఇతర పరిశ్రమలు తెచ్చేలా, హస్త కళలు ప్రోత్సహించేలా, డెయిరీ అభివృద్ధి కోసం ఇలా వివిధ రంగాలకు చెందిన బయోటెక్ సంస్థ కో ఫౌండర్ సుచిత్ర ఎల్ల, డి.ఆర్.డి.ఓ మాజీ చైర్మన్ ,రక్షణ రంగ శాస్త్రవేత్త డాక్టర్ జి.సతీష్ రెడ్డి, ఫోరెన్సిక్ సైన్స్ శాస్త్రవేత్త డాక్టర్ కెపిసి గాంధీ, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ వంటి నిపుణులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎపి అభివృద్ది ఈ నలుగురు సలహాలు సూచనలు ఎంతో అవసరమన్నారు.
ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ ను కలిసి రాష్ట్రంలో విద్య, వైద్యం పారిశ్రామిక వంటి రంగాల్లో వారి కోరగా...బిల్ గేట్స్ రాష్ట్రానికి సహాయం అందించటానికి ముందువచ్చారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ది కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి పలుమార్లు రావటమే వల్ల విజయవాడకి ఫ్లై ఓవర్, అమరావతి రైల్వే లైన్ రావటం జరిగిందన్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కి నిధులు మంజూరుకి కూడా సీఎం చంద్రబాబు కృషి కారణమని తెలిపారు..పలుమార్లు కేంద్ర మంత్రుల దగ్గర కి వచ్చి ఎన్నో పథకాలకు సంబంధించిన నిధులు రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్చలు జరిపారన్నారు.
అలాగే మార్చి 31లోపల నిధులు వినియోగించని కారణంగా కేంద్రం తీసుకునే నిధులను తిరిగి తీసుకువచ్చేవిధంగా కృషి చేయబోతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపిలను, సెక్రటరీలను కో ఆర్డినేషన్ చేసి అన్ని మంత్రిత్వ శాఖలో ఎక్కడైతే నిధులు బ్యాక్ కి వచ్చాయో...ఆ నిధులు రాష్ట్రానికి తిరిగి వచ్చే విధంగా బాధ్యతలు అప్పగించారు. తనకి అదనంగా అర్బన్ అండ్ జలశక్తి ఈ రెండు శాఖలను పరిశీలించాల్సిన బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు.
*సమగ్రాభివృద్ధి కోసం 295 విలేజ్ ఛాంపియన్స్*
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని 295 గ్రామాల్లో సమగ్ర గ్రామాభివృద్ది జరిగే విధంగా కేశినేని ఫౌండేషన్ ద్వారా తన సొంత నిధులతో హైదరాబాద్ లోని ఎన్.ఐ.ఆర్.డి లో శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. మొదటి విడతగా 50 మంది, రెండో విడతగా 50 మందిని పంపించి పది రోజులు శిక్షణ ఇప్పించి గ్రామీణ వికాసం విలేజ్ ఛాంపియన్స్ గా వారికి శిక్షణ ఇప్పించటం జరిగిందన్నారు. కలెక్టర్ లక్ష్మీశ ఆద్వర్యంలో కేశినేని ఫౌండేషన్ ద్వారా 24 గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాల్లో శిక్షణ ఇప్పించిన విలేజ్ ఛాంపియన్స్ ను నియమించినట్లు తెలిపారు. త్వరలోనే 295 గ్రామాల్లో 295 మంది విలేజ్ ఛాంపియన్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ విలేజ్ ఛాంపియన్స్ కి ఆరు నెలల పాటు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఉపకారవేతనంగా ఇస్తున్నట్లు తెలిపారు.
గ్రామసభలు ఏ విధంగా నిర్వహించుకోవాలి, స్వయం ఉపాధి రంగాల్లో కొత్త టెక్నాలజీ లను ఏ విధంగా ఉపయోగించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకాలు అమలు చేస్తున్నాయి...ప్రజలకు ఎడ్యుకేట్ చేసే విధంగా విలేజ్ ఛాంపియన్స్ కి శిక్షణ ఇప్పించటం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం నాలుగు రూరల్ నియోజకవర్గాల్లో సుమారు 32 మంది యువకులు విలేజ్ చాంపియన్స్ గా పనిచేస్తూ గ్రామీణావికాసం కోసం కృషి చేస్తున్నారు. అలాగే ఎన్.ఐ.ఆర్.డిలో నాటు కోళ్ల పెంపకం, తేనే తయారీ వంటి 39 కుటీర పరిశ్రమలపై శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. వీటి ద్వారా వ్యవసాయ పనులు , కూలీ పనులు చేసుకుంటూనే ఎంటర్ ప్రెన్యూర్ గా మారి నెలకి 30 నంచి 40 వేల రూపాయలు ఏ విధంగా సంపాదించుకునే అవకాశం గురించి విలేజ్ ఛాంపియన్స్ గ్రామ ప్రజలకు వివరిస్తారని తెలిపారు.
*నాలుగైదు నెలల్లో 700 క్రికెట్ కిట్స్ పంపిణీ*
గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా యువత మత్తుకి బానిస కావటంతో పాటు, సోషల్ మీడియాకి బాగా అలవాటు పడి సమయాన్ని వృద్దా చేస్తున్నారు. అందుకే ప్రతి ఊరిలో క్రీడలు ప్రోత్సహించి యువతలో ప్రతిభను వెలికి తీసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గాడి తప్పిన యువతను గాడిలో పెట్టాలంటే క్రీడలు ఒక్కటే మార్గం అన్నారు.
కేశినేని ఫౌండేషన్ ద్వారా గ్రామాల్లో , పట్టణాల్లోని వార్డుల్లో యువకులకు రాబోయే నాలుగైదు నెలల్లో 700 క్రికెట్ కిట్స్ పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. యువకులు క్రీడ పట్ల ఆసక్తి పెంచుకునే విధంగా తీర్చిదిద్దటంతో పాటు, సొంతంగా వాళ్ల కాళ్ల మీద నిలబడి స్వయం ఉపాధి రంగంలో పనులు చేసుకుంటూ క్రీడలు ఆడుకునే విధంగా ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలిపారు.
*ఆరునెలల్లో వంద గ్రామాలు టార్గెట్*
ఇంట్లో ఉండే మహిళలు కూడా ఆదాయాన్ని పెంచుకునేలా చూడాలని సిఎం ఆదేశాలకు అనుగుణంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు తెలిపారు. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP) కింద ఎమ్.ఎస్.ఎమ్.ఈ (MSME) ద్వారా లోన్స్ తీసుకుని మధ్య తరగతి ప్రజలు పారిశ్రామికవేత్తలు గా ఏ విధంగా తయారు కావచ్చు అనే అంశం పై ఇప్పటి కే విజయవాడ లో పశ్చిమ నియోజకవర్గం , తిరుపూరు పట్టణంలోని అన్ని వార్డులో అవగాహన సదస్సులు నిర్వహించటం జరిగింది. రాబోయే ఆరునెలల కాలంలో వంద గ్రామాల్లో ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలిపారు. సర్వీస్ ఇండస్ట్రీకి కూడా లోన్స్ సదుపాయం వుందని, వివిధ వృత్తలకు వారికి ఉపయోగపడే లోన్స్ వున్నాయని తెలిపారు. ఈ అవగాహన సదస్సలులు విజయవాడ మొత్తం నిర్వహించటానికి సూమారు ఐదారు నెలల సమయం పడుతుందన్నారు. యూనిట్స్ పెట్టుకునేవారికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ కలెక్టర్ , ప్రభుత్వాధికారుల సహకారంతో కేశినేని ఫౌండేషన్ ద్వారా ఇప్పిస్తామన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ప్రతి బ్యాబ్ లోను 200 మంది వుండేలా నెల రోజుల ప్రోగ్రామ్ రూపొందించటం జరిగిందన్నారు. అవగాహన సదస్సులు తర్వాత ఆసక్తి గల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నెల రోజులపాటు శిక్షణ ఇచ్చి..ఆ తర్వాత లోన్స్ ఇప్పించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
*ఆటోనగర్ కి పూర్వవైభవం*
విజయవాడ ఆటోనగర్ లోని ఆటోమొబైల్ ఇండస్ట్రీ కి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఎపి ఎమ్.ఎస్.ఎమ్.ఈ అసోసియేషన్ సభ్యులతో పలుసార్లు సమావేశం కావటం జరిగింది. విజయవాడలోని మెకానికల్ పరిశ్రమలు ఢిపెన్స్ పరిశ్రమ రంగానికి దగ్గర వుంటాయి. కాబట్టి ఏరోస్పెస్, డిఫెన్స్ఇండస్ట్రీపై డి.ఆర్.డి.ఓ మాజీ చైర్మన్ ,రక్షణ రంగ శాస్త్రవేత్త డాక్టర్ జి.సతీష్ రెడ్డితో వీరికి సలహాలు సూచనలు ఇప్పించటం జరిగిందన్నారు.
ఆటోమొబైల్ ఇండస్ట్రలోకానీ, ఎపి ఎమ్.ఎస్.ఎమ్.ఈ పారిశ్రామికవేత్తలు, కార్మికులు పడుతున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లటం జరిగిందని, సీఆర్డిఏ కమిషనర్ కి ఆటోనగర్ లో డెవలప్ చేయాల్సిన రోడ్లు, కల్పించాల్సిన మౌళిక సదుపాయాలపై సూచనలు ఇవ్వాల్సిందిగా ఆదేశించారని తెలిపారు.
*త్వరలో మెట్రో పనులు*
విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నుంచి నిడమానురు వరకు 6.3 కిలోమీటర్ల ప్లై ఓవర్ కి అనుమతి లభించిందని, ఈ మార్గంలో మెట్రో లైన్ రావటం వల్ల జాప్యం జరిగిందన్నారు. కింద రోడ్డు, పైన మెట్రో వెళ్లే విధంగా మెట్రో డిపిఆర్ కోసం వెయిట్ చేయటం జరుగుతుందని తెలిపారు.
*లోక్ సభలో పలు సమస్యలపై ప్రస్తావన*
లోక్ సభలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలే కాకుండా ఇతర సమస్యలపై కూడా ప్రస్తావిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం డ్రైన్లు రైల్వే లైన్స్ కింద వుండి నిండిపోయాయి.. అలాగే విజయవాడ ప్రజల నగర జీవన విధానం అంతా విజయవాడ రైల్వే గేట్స్ మీద ఆధారపడి వుందన్నారు. అందుకే పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గం లో రైల్వే గేట్స్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఆర్.వో.బి, ఆర్.యు.బిలు కావాలని అడుగుతున్నట్లు తెలిపారు. ఇక గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అమృతభారత్ స్కీమ్ కింద మొదటి స్టేషన్ కింద ఎంపికైన విజయవాడ రైల్వే స్టేషన్ కి ఇంతవరకు నిధులు మంజూరు కాలేదని, త్వరలో నిధులు మంజూరు చేయించి ఈ పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్ ను ఆధునీకరిస్తామన్నారు శాటిలైట్ స్టేషన్స్ గా గుణదల, రాయనపాడు వున్నాయి అదనంగా ఇంకో శాటిలైట్ స్టేషన్ అడగుతున్నట్లు తెలిపారు.
*సి.యస్.ఆర్. యాక్టివిటీ కింద అభివృద్ది*
అలాగే ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ది కి కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడగటం జరిగింది. విజయవాడలో అన్ని స్టేడియాలు అభివృద్ది చేసే విధంగా సీ.ఎస్.ఆర్. యాక్టివిటీ ద్వారా తీసుకురాబోతున్నట్లు తెలిపారు.
*శానిటరీ మ్యానఫ్యాక్చరింగ్ యూనిట్స్*
తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో కొన్ని సీఎస్.ఆర్. యాక్టివిటీ ద్వారా స్వయం సహాయక సంఘాల ద్వారా వంద శానిటరి వెండింగ్ మిషన్స్ , నాలుగు శానిటరీ మ్యానఫ్యాక్చరింగ్ మిషన్స్ యూనిట్స్ మే నెలలోపు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు.
అలాగే జిల్లాలోని అర్బన్ హెల్త్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ను ఆధునీకరించేందుకు సి.ఎస్.ఆర్ యాక్టివిటీ కింద దివాస్ సంస్థకి రూ.12 కోట్ల 40 లక్షలు డిపిఆర్ ఇవ్వటం జరిగిందని,,,త్వరలో వారి సహకారం తీసుకుని వాటిని ఆధునీకరిస్తామని తెలపారు.
అమరావతి రాజధానిలో ముఖ్యభాగం విజయవాడ, రాజధానికి ముఖ ద్వారం విజయవాడ, అందుకని ఈ విజయవాడ చాలా అందంగా వుండాలి, కాబట్టి డ్రైనేజీ కానీ, సీవేజ్ కానీ, రోడ్లు కానీ చాలా అందంగా వుండాలి వీటి పై దృష్టి పెట్టినట్లు తెలిపారు.
ఇటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎపి మొత్తంమీద ప్రభుత్వం ప్రజాప్రతినిధులందరం పరిష్కరించేందుకు పోరాడుతున్నామన్నారు. ఇది మంచి ప్రభుత్వం. ప్రజల సమస్యలను పరిష్కరించటంలో ముందు వుంటామన్నారు. సమస్యలు పరిష్కరించటంలో సూచనలు ప్రజల దగ్గర నుంచి తీసుకునేందుకు తన కార్యాలయంలో సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం, టిడిపి సీనియర్ నాయకులు నరసింహాచౌదరి పాల్గొన్నారు.
addComments
Post a Comment