*రైతు రిజిస్ట్రీ - విశిష్ఠ సంఖ్య జారీ పురోగతి పై రాష్ట్ర వ్యవసాయ శాఖ ను ప్రశంసించిన కేంద్ర ప్రభుత్వం
*
అమరావతి (ప్రజా అమరావతి);
రాష్ట్రములోని రైతులకు రైతు రిజిస్ట్రీలో భాగముగా అతి తక్కువ సమయంలో 38.50 లక్షల మంది రైతులకు విశిష్ట సంఖ్యను నమోదు చేయటం లో ప్రదర్శించిన పురోగతిపై డిల్లీ పార్లమెంట్ లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేక ప్రశంసలు తెలియచేసారు .ఫిబ్రవరి రెండవ వారపు చివరలో ప్రారంభించినప్పుడు చివరి స్థానాలలో వున్న మన రాష్ట్ర ము ఇప్పటికి 64 % శాతం నమోదుతో 38.50 లక్షల మంది రైతులకు విశిష్ట సంఖ్యను నమోదు చేసి దేశములో *మూడవ స్థానములో* నిలిచిందని తెలిపారు. అక్టోబర్ 24 నెలలో ప్రారంభించిన *మధ్య ప్రదేశ్* రాష్ట్రం 73.17 శాతం నమోదుతో *మొదటి స్థానం* లో నిలిచిందని ;
మహారాష్ట్ర 68.02 శాతం నమోదుతో *రెండవ స్థానం* పొందాయని వ్యవసాయ శాఖ పేర్కొంది .మన రాష్ట్రములో వెబ్ లాండ్ డేటా ప్రకారం *60 లక్షల మంది రైతులకు* విశిష్ట సంఖ్యను ఇవ్వవలసి ఉంటుంది. ఫిబ్రవరి చివరిలో 50% నమోదు చేసి
187 కోట్ల రూపాయల ప్రత్యేక కేంద్ర సహాయం కొరకు ప్రతిపాదనలు పంపా మని తెలుపుతూ , మరో 6.50 లక్షల మంది రైతులకు విశిష్ట సంఖ్యను నమోదు చేయటం ద్వారా 45 లక్షల సంఖ్యకు చేరుకుని తద్వారా 75 శాతం పూర్తిచేసుకున్న నమోదు ప్రక్రియ కు గాను మన రాష్ట్రమునకు మరో 187 కోట్లు ప్రత్యేక కేంద్ర సహాయం కేటాయింపు జరిగే అవకాశం ఉంది అని డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు తెలిపారు .
కాబట్టి రాష్ట్రములోని క్షేత్ర స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని,సరియైన ప్రచారం చేసి మిగిలిన 11% తో వున్న 6.50 లక్షల రైతులకు విశిష్ట సంఖ్యను నమోదు చేయవలసినదిగా ఆదేశించారు .
ఈ నమోదు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ప్రశంసకు సహకరించిన అన్ని తరగతుల ఉద్యోగులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
రైతు రిజిస్ట్రీ కార్యక్రమ ప్రాముఖ్యాన్ని మిగిలిన రైతులకు తెలియచేస్తూ ,వ్యవసాయ రంగాన్ని పూర్తిగా *డిజిటలైజేషన్* చేయాలన్న సంకల్పముతో రైతు రిజిస్ట్రీ కార్యక్రమమును కేంద్రం చేపట్టిందని తెలిపారు . ఆధార్ తో దేశములోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లు గానే ప్రతి రైతుకు 11 నెంబర్లతో యూనిక్ కోడ్ విశిష్ట సంఖ్యను కేటాయిస్తారని ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ ఈ విశిష్ఠ సంఖ్య ఆధారంగానే రైతులకు వర్తింప చేస్తారని తెలియచేసారు .కాబట్టి నమోదు చేయని మిగిలిన సాగుదారులు అందరూ విధిగా రైతు రిజిస్ట్రీ లో నమోదు చేసుకోవాలని కోరారు .
addComments
Post a Comment