'శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం,ఇంద్రకీలాద్రి, విజయవాడ' 30మార్చి 2025 (ప్రజా అమరావతి);
" వైభవంగా వెండి రధోత్సవం
"
- శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది, వసంత నవరాత్రులు ప్రారంభం సందర్బంగా సాయంత్రం 6 గంటలకు కొండ పైనుండి ఘాట్ రోడ్ మీదుగా కామదేను అమ్మవారి ఆలయం మీదుగా - వెండి రధోత్సవం ప్రారంభం అయింది . కార్యనిర్వహణాధికారి కె. రామచంద్ర మోహన్ కొబ్బరికాయ కొట్టి, పూజలు నిర్వహించారు.
- శ్రీ దుర్గా మల్లేశ్వరులు కొలువైన రధం బ్రాహ్మణవీధి మీదుగా వన్ టౌన్ పురవీధులలో విహరించింది.
తప్పెట్లు, కోలాట నృత్యాలు, తాళం భజనలు మధ్య దుర్గా నామ స్మరణ తో రధోత్సవం కన్నుల పండువుగా సాగింది.
addComments
Post a Comment