ఒక్క రోజులో అత్యధిక ఎస్ హెచ్ జి ఉత్పత్తులు ఆన్లైన్ లో అమ్మకం ద్వారా గిన్నిస్ బుక్ రికార్డు.

 

విజయవాడ (ప్రజా అమరావతి);


 ఆ ఆర్థిక సంవత్సరంలో 30వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను అభివృద్ధి చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

ఒక్క రోజులో అత్యధిక ఎస్ హెచ్ జి ఉత్పత్తులు ఆన్లైన్ లో అమ్మకం ద్వారా గిన్నిస్ బుక్ రికార్డు



ఎస్ హెచ్ జి సంఘాల సమగ్ర సమాచారం ఆన్ లైన్ చేయడం అభినందనీయం

ఈ ఏడాది 80వేల సంఘాలకు రూ. 8వేల కోట్ల రుణాలను పట్టణ పేద కుటుంబాలకు అందించాలన్నదే ధ్యేయం

సీఎం ఆదేశాలతో మెప్మా సిబ్బందికి హెచ్ఆర్ఎంఎస్ రూపొందిస్తున్నాం

మెప్మాలో ఖాళీలు త్వరలో భర్తీ చేస్తాం.

మెప్మా సంస్థలో ఈ-కామర్స్ పాలసీని రూపొందించి ప్రపంచవ్యాప్తంగా విస్తృత మార్కెట్ కల్పిస్తాము.

- శ్రీ. పొంగూరు నారాయణ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు. 

                 ఈ ఆర్థిక సంవత్సరంలో 30వేల మందికి పైగా మహిళా పారిశ్రామికవేత్తలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, రానున్న మూడేళ్లలో లక్ష మందికి పైగా మహిళా పారిశ్రామికవేత్తలను అభివృద్ధి చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు శ్రీ. పొంగూరు నారాయణ అన్నారు.  విజయవాడ లోని ఓ ప్రైవేటు కన్వేన్షన్ లో మహిళా వ్యాపారాభివృద్ధి కార్యాచరణ ప్రణాళికపై ఒక రోజు వర్క్ షాపును మంత్రి నారాయణ శనివారం ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ. బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురష్కరించుకుని బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ ముందుగా వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసుకున్న అన్ని కార్యక్రమాల్లో వంద శాతం ప్రగతి సాధించినందుకు సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒక్క రోజులో అత్యధిక ఎస్ హెచ్ జీ ఉత్పత్తులు ఆన్లైన్ ద్వారా అమ్మి గిన్నిస్ రికార్డు, మూడు వరల్డ్ రికార్డు యూనియన్ ద్వారా ప్రపంచ రికార్డులు సాధించినందుకు ప్రతి ఒక్కరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కేవలం మూడు నెలల్లోనే ఎస్ హెచ్ జీ ప్రొపైలింగ్ ను పూర్తిచేసి పట్టణాల్లోని సంఘాల సమగ్ర సమాచారం ఆన్లైన్ చేయడం అభినందనీయమన్నారు. 

                   ఈ ఏడాది కనీసం 80వేల సంఘాలకు రూ. 8వేల కోట్ల రుణాలను బ్యాంకు లింకేజీ ద్వారా పట్టణ పేద కుటుంబాలకు అందించాలని మెప్మా సిబ్బందికి మంత్రి శ్రీ. పొంగూరు నారాయణ ఆదేశించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా లక్ష మందికి లబ్ధినందించాలన్నారు. స్వయం సహాయక సంఘ మహిళల 20వేల ఉత్పత్తులను ఈ-కామర్స్ లో అన్బోర్డ్ చేసి ఈ ఏడాది రూ. 10వేల కోట్ల విలువైన విక్రయాలు జరపాలని లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నట్లు పేర్కొన్నారు. మెప్మా లో ఖాళీలను త్వరలో పూర్తి చేస్తామన్నారు. మెప్మా సిబ్బందికి గౌరవ ముఖ్యమంత్రి హెచ్ఆర్ పాలసీని ఇచ్చారన్నారు. ఇప్పుడు మెప్మా సిబ్బందికి హెచ్ఆర్ఎంఎస్ ను రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలలో సుయోగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి సింగల్ విండో సిస్టం ద్వారా కేంద్ర, రాష్ట్ర పథకాలు పట్టణ పేదలకు అందించాలన్నారు. మెప్మాలో అన్ని విభాగాలలో డిజిటల్ ఇనిషియేటివ్ ల ద్వారా పారదర్శకత పెంచుటకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. మెప్మా లో ఈ-కామర్స్ పాలసీని రూపొందించి తద్వారా మన ఉత్పత్తులను దేశ, ప్రపంచ వ్యాప్తంగా విస్తృత మార్కెట్ కల్పించాలన్నారు. 

 పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ. ఎస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి చెప్పిన విధంగా విజన్-2047 లో పేదరిక నిర్మూలన ఒక అంశమని, అలాగే ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండేలన్నదే లక్ష్యమని మెప్మా సిబ్బంది తమ వంతు పాత్ర పోషించాలన్నారు. ఒక ఏడాదిలో 30వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలు అభివృద్ధి చేయడం మన లక్ష్యమని, అయితే అదనంగా మరో 20వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్న లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. మహిళా పారిశ్రామికవేత్తల వార్షిక టర్నోవర్ రూ. కోటి కి పైగా ఉండాలా వారిని ప్రోత్సహించాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అసంఘటిత కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ డిజిటల్ లిట్రసీ, ఫైనాన్షియల్ లిట్రసీ పై అవగాహన పెంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. 

                   అనంతరం స్వయం సహాయక సంఘ మహిళల కోసం మెప్మా అధికారిక వెబ్ సైట్, మహిళాకాశం యాప్, పట్టణ నిరాశ్రయుల వసతి గృహం కోసం నివాసం యాప్, సంఘాలలోని సదుపాయం కోసం మెప్మా లోన్ ఛార్జ్ క్రియేషన్ మెకానిజం, మెప్మా సిబ్బంది కొరకు హెచ్ఆర్ఎంఎస్ డాష్ బోర్డ్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు. అలాగే అసంఘటిత కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఈ-శ్రమ్ పథకంతో అనుసంధానం చేస్తూ వారికి ఆర్థిక భద్రత కల్పించేందుకు గాను మెప్మా, కార్మిక శాఖ మధ్య అవగాహన ఓప్పందం(ఎంఓయూ) చేసుకున్నారు. ఎస్సీ లబ్ధిదారులకు మార్చి 2025, బ్యాంకు లింకేజీ రుణం రూ. 143.55 కోట్లు, పీఎం స్వానిధి రుణం రూ. 2.21 కోట్లు చెక్ లను మంత్రి నారాయణ చేతుల మీదుగా అందచేశారు. అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఎస్సీ మహిళా వ్యాపారవేత్తలకు ప్రశంసాపత్రాలు, ఎక్స్ లెన్స్ సర్టిఫికెట్లను అందచేశారు. 

              కార్యక్రమంలో కార్మిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి శ్రీ. ఎం.వి. శేషగిరి బాబు, మెప్మా మిషన్ డైరక్టర్ శ్రీ. ఎన్. తేజ్ భరత్, ఏడీ శ్రీమతి ఐ. మాధవి, ఉన్నతాధికారులు, ప్రాజెక్ట్ డైరక్టర్లు, స్వయం సహాయక మహిళలు, స్టేట్ మిషన్ మేనేజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.                 

Comments