ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ వక్ఫ్ చట్టాన్ని మార్చింది: ప్రధాని మోదీ
అమరావతి (ప్రజా అమరావతి);
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వక్ఫ్ సవరణ బిల్లును సమర్థించారు. వక్ఫ్ చట్టాన్ని సవరించడం ద్వారా సామాజిక న్యాయం అందించడానికి తాము కృషి చేస్తున్నామని మోదీ అన్నారు.
వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను తొలగించి ముస్లింలకు ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
సోమవారం హర్యానాలోని హిసార్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రభుత్వ కాంట్రాక్టులలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ గురించి మాట్లాడారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల ప్రజలు మోసపోతున్నారన్నారు. రాజ్యాంగాన్ని అవమానించారని, కాంగ్రెస్ అంబేద్కర్పై దాడి చేస్తోందని దుయ్యబట్టారు.
వక్ఫ్ చట్టాన్ని సవరించడం ద్వారా సామాజిక న్యాయం అందించడానికి తాము కృషి చేస్తున్నామని మోదీ అన్నారు. వక్ఫ్ చట్టాన్ని సవరించడం ద్వారా ముస్లిం మహిళల హక్కులు రక్షించినట్లు, వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.
ఓటు బ్యాంకుల కోసం వక్ఫ్ నిబంధనలను మార్చారని, వక్ఫ్ పేరుతో భూమిని లాక్కుంటున్నారని, వక్ఫ్ భూ మాఫియా పేదల భూమిని దోచుకుంటోందని మోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
2013లో ఎన్నికల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ వక్ఫ్ చట్టాన్ని మార్చిందని, రాజ్యాంగపరమైన చిక్కులను పరిగణనలోకి తీసుకోకుండా ఈ సవరణను తొందరపాటుతో చేశారని మోదీ ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ వక్ఫ్ చట్టాన్ని మార్చి బాబా సాహెబ్ సృష్టించిన రాజ్యాంగం కంటే దానిని ఉన్నతమైనదిగా అభివర్ణించిందని, ఇది బాబాసాహెబ్కు జరిగిన ఘోర అవమానమని మోదీ వ్యాఖ్యానించారు.
వక్ఫ్ బోర్డు అసలు ఉద్దేశ్యాన్ని వివరిస్తూ, పేదలు, అణగారిన ముస్లింలు, ముఖ్యంగా మహిళల అభ్యున్నతి దీని లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని ఎత్తిచూపి వేలాది మంది ముస్లిం మహిళలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని, దీని ఫలితంగా చట్టానికి సవరణలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
addComments
Post a Comment