దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం అధిపతిగా షఫి మహమ్మద్.


దూరదర్శన్ ప్రాంతీయ వార్తా  విభాగం అధిపతిగా షఫి మహమ్మద్

విజయవాడ, 7 ఏప్రిల్, 2025 (ప్రజా అమరావతి );విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా  విభాగం అధిపతిగా షఫి మహమ్మద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. షఫి మహమ్మద్ 2009 బ్యాచ్ కు చెందిన ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి. ఆయన 2024 నవంబర్  నుంచి  ప్రాంతీయ వార్తా విభాగంలో సహాయ సంచాలకుడిగా పధవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో షఫి మహమ్మద్  ఒడిషా, తెలంగాణ, ఆంధ్ర, అండమాన్ నికోబర్ పోర్టుబ్లయిర్లో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన  పలు విభాగాల్లో పనిచేశారు.    ఆయన     క్షేత్ర ప్రచార విభాగం,  సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఆకాశవాణిలతో పలు పధవుల్లో పని చేశారు. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వంచే వెలువడుతున్న యోజన అభివృద్ధి మాసపత్రికకు సంపదకుడిగా, డిఒపిటి ప్రాంతీయ సంక్షేమ అధికారిగా పలు విధులు నిర్వహించారు. దూరదర్శన్ వార్తా విభాగాన్ని మరింతగా మొరుగ్గా తీర్చిదిద్దుతామని, ప్రభుత్వ పథకాలను దూరదర్శన్ ద్వారా ప్రజల్లో తీసుకొని వెళ్లడానికి కృషి చేస్తానని షఫి మహమ్మద్ తెలిపారు.

 
Comments