నూతన ఆవిష్కరణలకు ఏపీని వేదిక చేస్తాం.



*నూతన ఆవిష్కరణలకు ఏపీని వేదిక చేస్తాం


*


*వచ్చే 5 ఏళ్లలో 20 వేల స్టార్టప్‌ల స్థాపనే లక్ష్యం*


*రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో భాగస్వాములుకండి - ‘ఇంటికో ఎంట్రప్రెన్యూర్’ సంకల్పాన్ని నిజం చేయండి*


*పారిశ్రామికవేత్తలు, మేధావులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు*


అమరావతి, ఏప్రిల్ 2 (ప్రజా అమరావతి): రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌’ని తీర్చిదిద్దేందుకు... ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్’ సంకల్పాన్ని నిజం చేసేందుకు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు, ప్రొఫెసర్లు, మేధావులు ముందుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా పారిశ్రామిక వేత్తలు రావాలని, నూతన ఆవిష్కరణలకు ఏపీ హబ్ కావాలని, అదే స్థాయిలో పెట్టుబడులు కూడా ఆశిస్తున్నామని అన్నారు. అందిరిలో స్ఫూర్తి నింపేందుకే ఇన్నోవేషన్‌కు హబ్‌కు రతన్ టాటా వంటి గొప్ప వ్యక్తి పేరు పెట్టామని చెప్పారు. బుధవారం సచివాలయంలో పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విద్యావంతులతో ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’ గురించి ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఆర్టీఐహెచ్ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న టాటా గ్రూపు,  టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సహా మరికొందరు ప్రముఖులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. 


*నాటి సంస్కరణలతో సత్ఫలితాలు :* 


భారతీయులు దేశవిదేశాల్లో ఎంట్రప్రెన్యూర్లుగా ఎదిగారని, అలాగే తలసరి ఆదాయంలోనూ విదేశీయులు కన్నా ఎక్కువ ఆర్జిస్తున్నారని, వారిలో 30 శాతం తెలుగు ప్రజలు ఉన్నందుకు తనకు గర్వంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. నిజానికి ఇప్పుడు తెలుగు ప్రజలు ఈ స్థాయికి చేరుకోవడానికి తాను మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు తీసుకువచ్చిన సంస్కరణల ఫలితమని చెప్పారు. సీఐఐ సమావేశాలు నిర్వహించడం, ఇంజినీరింగ్ కాలేజీలు నెలకొల్పడం, మైక్రోసాఫ్ట్ సహా ప్రముఖ కంపెనీలు ఏర్పాటయ్యేలా చూడటంతో హైదరాబాద్ దశ-దిశ మారిపోయిందన్నారు. నాడు హైదరాబాద్‌ను ఐటీ హబ్ చేసినట్టుగానే, ఇప్పుడు అమరావతిని క్వాంటమ్ వ్యాలీ చేయాలనేది తన సంకల్పంగా చెప్పారు. అలాగే ‘వన్ ఫ్యామిలీ - వన్ ఐటీ ప్రొఫెషనల్’ అని గతంలో తాను చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇచ్చాయని గుర్తు చేశారు. భారతీయులు ఎక్కడ ఉన్నా ఆయా ప్రాంతాలను, అక్కడ పరిస్థితులను ఆకళింపు చేసుకుని ప్రతిభతో రాణిస్తున్నారని అన్నారు. దూరం అనేది ప్రపంచంలో ఒక సమస్య కాదన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు అడుగులు వేశామన్నారు. 


*పీ4లో భాగస్వాములు అవ్వండి :* 


గతంలో తమ ప్రభుత్వం పీ3 కార్యక్రమాన్ని చేపట్టిందని దాంతో కొన్ని కుటుంబాలు ఆర్ధికంగా నిలదొక్కుకున్నాయని... ఈసారి జీరో పావర్టీ-పీ4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. సమాజంలో ఉన్నత వర్గాలు, అట్టడుగున ఉన్న పేదలకు అండగా నిలవడమేనని అన్నారు. అంబేద్కర్, అబ్దుల్ కలాం వంటి వారు ఇతరుల సహాయంతోనే పైకి వచ్చారని ముఖ్యమంత్రి వివరించారు. మీరందరూ కూడా సమాజంలో సమానతల కోసం, పేదరిక నిర్మూలనకు కదిలిరావాలని, అందరూ పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.


*‘ఇంటికో ఎంట్రప్రెన్యూర్’ మంచి ఆలోచన :* 


‘వన్ ఫ్యామిలి-వన్ ఎంట్రప్రెన్యూర్’, జీరో పావర్టీ-పీ4 కార్యక్రమాలు ఎంతో ఉన్నతమైనవని... ముఖ్యమంత్రి ఆశయంపై సమావేశానికి హాజరైన పలువురు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు వచ్చే ఏడాది కల్లా అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్ ఏర్పాటు చేసి ఫస్ట్ బ్యాచ్ అడ్మిషన్లు చేపడతామని బిట్స్ పిలానీ వైస్ చాన్సలర్ వి.రామగోపాలరావు, అలాగే అమరావతి క్వాంటమ్ వ్యాలీలో కూడా తాము భాగస్వామి కావాలనుకుంటున్నామని చెప్పారు. విశాఖపట్నంలో జీఎంఆర్ ఐటీ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని జీఎంఆర్ సంస్థల అధినేత జీఎంఆర్ అన్నారు. 

 

*వచ్చే 5 ఏళ్లలో 20,000 స్టార్టప్‌లు :* 


వచ్చే ఐదేళ్లలో 20,000 స్టార్టప్‌లు ఏర్పాటు అయ్యేలా చూడాలనేది ప్రభుత్వ లక్ష్యం. దీంతో లక్ష మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 10 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు వస్తాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌గా అమరావతి ఉంటుంది. దీనికి  

గ్రూపు లీడర్‌గా టాటా గ్రూపు ఉంటుంది. ఎల్ అండ్ టీ, ఎఎంఎన్ఎస్ పార్టనర్లుగా వ్యవహరిస్తాయి. అమరావతి హబ్‌కు రాష్ట్రంలో 5 స్పోక్స్ అనుబంధంగా ఉంటాయి. స్పోక్స్ లీడ్ పార్టనర్లుగా అనంతపురానికి-జెఎస్‌డబ్లు, తిరుపతికి-అదానీ గ్రూపు, విజయవాడకు-మేఘా గ్రూపు, రాజమహేంద్రవరానికి-గ్రీన్‌కో, విశాఖపట్నానికి-జీఎంఆర్ గ్రూపు వ్యవహరిస్తాయి.   

ఆర్టీఐహెచ్‌లో ఇంక్యుబేటర్, ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ సెంటర్, బ్యాంకింగ్ లింకేజ్, ట్రైనింగ్, వీసీ ఫండింగ్ హ్యాండ్ హోల్డింగ్, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, హైపెర్ఫార్మెర్స్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెట్ లింకేజ్, రా మెటీరియల్ సోర్సింగ్ సపోర్ట్, ప్రోటోటైపింగ్ సెంటర్, ఔట్ డేటింగ్ టెస్టింగ్ ట్రాక్స్, హైస్పీడ్ ఇంటర్నెట్ ఉంటాయి.

Comments