గుంటూరు 05 మే , 2025 (ప్రజా అమరావతి): మే 12 వ తేది నుండి 20 వ తేది వరకు జరిగే ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించాల
ని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో మే 12 వ తేది నుండి 20 వ తేది వరకు జరిగే ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణపై కో ఆర్డినేషన్ సమావేశం జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ , రీజనల్ ఇంటర్మీడియట్ అధికారి జుబేర్ , డిఇఓ రేణుక లతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వరాదని , పరీక్షలు వ్రాసే విద్యార్దులకు అన్ని సౌకర్యాలు ఉండేటట్లు చూడాలన్నారు. పరీక్షలల్లో ఎలాంటి మాస్ కాంపీయింగ్ జరగకుండా అన్ని పకడ్బంధీ చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటర్మీడియట్ మొదటి ఏడాది సప్లమెంటరీ పరీక్షలకు జనరల్ మరియు ఒకేషనల్ కోర్సులకు 23,279 మంది విద్యార్దులు , అలాగే ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం సప్లమెంటరీ పరీక్షలకు జనరల్ మరియు ఒకేషనల్ కోర్సులకు 3,883 మంది విద్యార్దులు హాజరు అవుతున్నందున ఆ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టాలన్నారు. ప్రశ్నా పత్రాలను జాగ్రత్త పరచడంలో గాని , పరీక్ష తేదీలలో వాటిని పరీక్షా కేంద్రాలకు పంపిణీలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. విద్యార్దులు పరీక్షలకు హాజరయ్యే కేంద్రాలకు ఆర్టీసి అధికారులు బస్సులను అందుబాటులో వుంచాలన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఏఎన్ఎం లకు కూడా అందుబాటులో వుంచాలన్నారు. పరీక్షా కేంద్రాలల్లో నిరంతర విద్యుచ్ఛక్తి వుండేటట్లు ముందస్తు ఏర్పాట్లు చూడాలన్నారు. విద్యార్దులకు త్రాగేందుకు మంచి నీరు అందుబాటులో వుంచి పరిసరాలు శుభ్రంగా వుండేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ గంగరాజు , డిఆర్ఓ ఎన్.ఎస్.కే.ఖాజావలి , ఆర్డిఓ శ్రీనివాస రావు, డీఆర్డిఏ , డ్వామా , హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లు విజయలక్ష్మీ, శంకర్, ప్రసాద్ , డిపిఓ బి.వి.నాగ సాయి కుమార్ , డి ఎస్ ఓ కోమలి పద్మ , ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ విజయ్ ప్రకాశ్ , ఎల్ డి ఎం మహిపాల్ రెడ్డి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment