గుంటూరు, 07 మే 2025 (ప్రజా అమరావతి): బుధవారం స్థానిక ఏ. సి కళాశాల ఎదురుగా డా. బి. ఆర్. అంబేద్కర్ భవన ప్రాంగణం వద్ద శంకర్ విలాస్ రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి చేపట్టిన శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ , జిల్లా ఇంచార్జ్ మంత్రి వర్యులు మరియు పర్యాటక , సాంస్కృతిక మరియు సినియాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ , శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ , జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , రాష్ట్ర మాదిగ వెల్ఫేర్, కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్ పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి , ఏ.పి రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ , ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఛైర్మన్ డెగల ప్రభాకర్ , లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యాల రావు , గుంటూరు తూర్పు , పశ్చిమ , తాడికొండ, ప్రత్తిపాడు , వేమూరు , సత్తెనపల్లి నియోజకవర్గాల శాసన సభ్యులు మహమ్మద్ నసీర్ అహ్మద్ , గల్లా మాధవి , తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు , నక్కా ఆనంద బాబు , కన్నా లక్ష్మీ నారాయణ , జియంసీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, జియంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు , బీజేపీ రాష్ట్ర నాయకులు జై ప్రకాష్ పాల్గొన్నారు. వేదమంత్రాల పఠనంతో శాస్త్రోత్తంగా భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ నసీర్ అహ్మద్ అధ్యక్షత వహించారు. అనంతరం జరిగిన సభలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ ఫ్లై ఓవర్ మంజూరు ఫలితం అంతా పెమ్మసాని వల్లే జరిగిందని అందరూ అంటున్నారు. ఏదైనా ఒకే వ్యక్తి వల్ల ఏ అభివృద్ధి జరగదు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మాకు ఓట్లు వేసి విజయాన్ని అందించిన ఓటర్లకు, ప్రజలకు, నన్ను నమ్మి నాకు టికెట్ అందించిన నారా చంద్రబాబునాయుడు కి, నన్ను ప్రోత్సహించిన శ్రీ పవన్ కళ్యాణ్ కి, ఈ ప్రాజెక్టులను ప్రతిపాదించినప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ అనుమతులు మంజూరు చేసిన శ్రీ నితిన్ గడ్కరీ కి, ప్రతి అంశంలోను సహకరించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కి ఇలా ప్రతి ఒక్కరికి ఈ ప్రాజెక్టుల అమలులో, అనుమతుల మంజూరులో భాగముంది అని చెప్పడానికి గర్వపడుతున్నాను. బ్రిడ్జ్ డిజైన్లు, కన్స్ట్రక్షన్లు వంటి అనేక పనుల్లో మా ఎమ్మెల్యేలు, కలెక్టర్ , మేయర్ అందరూ కో- ఆర్డినేట్ చేసినప్పుడు మాత్రమే ఇలాంటి మంచి ప్రాజెక్టులు అందుబాటులోకి తేవడంలో సహకరించారు. అందుకే చెప్తున్నాను ఈ విజయం నా ఒక్కడిది కాదు, మన అందరిద న్నారు. ఈ ప్రాజెక్టును తీసుకొచ్చినప్పుడు ఎన్నో అపోహలు ఉన్నాయి. కానీ వాస్తవాలు ప్రజలకు తెలియాలి. బ్రిడ్జి పొడవు ఇంతకుముందు 430 మీటర్లు ఉంటే ఇప్పుడు అందుకు రెండింతలు పెంచామన్నారు. హిందూ కాలేజ్ దగ్గర బ్రిడ్జ్ ల్యాండ్ అయితే ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వెళ్లే వాళ్లకి ఇబ్బందులు ఏర్పడతాయి. ఫోర్ లైన్ బ్రిడ్జితో పాటు జిజిహెచ్ దగ్గర 3 అండర్ పాసులు ఇచ్చాము. ఇప్పుడు ఆర్ యూ బి నిర్మిస్తే ఏదైనా జరగరానిది జరిగితే క్షమించలేని పొరపాటు చేసిన వాళ్ళం అవుతామన్నారు. పైగా వచ్చిన అనుమతులు కాదని, కొత్త ప్రతిపాదనలు చేస్తే, అసలు అనుమతులకే బ్రేక్ పడుతుంది. తిరిగి మళ్లీ మంజూరు చేయించడమనేది ఇప్పుడప్పుడే అయ్యే పని కాదన్నారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో ఆర్ యు బి నిర్మాణానికి ప్రయత్నిస్తాం. సర్వీస్ రోడ్ల నిర్మాణానికి, బ్రిడ్జి నిర్మాణానికి అసలు సంబంధమే లేదు. భవిష్యత్తులో అవసరమైతే సర్వీస్ రోడ్లను మళ్లీ నిర్మించుకోవచ్చన్నారు. నాలుగు లైన్లకు బదులు ఆరు లైన్లతో వంతెన నిర్మించాలని చాలామంది అంటున్నారు. సిటీ మధ్యలో ఆరు లైన్ల వంతెన కట్టాలంటే రెండు వైపులా భారీగా ఆస్తి నష్టం ఏర్పడవచ్చు. ఆస్తి నష్టం పై ఎవరైనా ప్రశ్నిస్తే అసలు ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డులో ఉన్న నిర్మాణాలు తొలగిస్తే ఇన్నర్ రింగ్ రోడ్డు మూడోదశ రహదారి నిర్మాణం కూడా మొదలు పెట్టవచ్చు. ఇప్పటికే మంజూరు చేయించుకున్న నాలుగైదు బ్రిడ్జిల నిర్మాణాలు కూడా రాబోయే 2- 3 ఏళ్లలో కచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి మూడేళ్లు సమయం పడుతుందని చాలామంది అపోహలు సృష్టిస్తున్నారు. ఒక గుంటూరులోనే కాదు ఏపీలోనే అత్యంత వేగవంతంగా నిర్మితమయ్యే వంతెనగా శంకర్ విలాస్ ప్రజలు పూర్తి చేసి చూపిస్తామన్నారు. నిర్మాణ విషయాల్లో ఏ ఒక్క పొరపాటు గాని తప్పు గాని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై పెడుతున్నాను. ప్రతి నిర్మాణం ప్రతి
అంశంలోనూ జాగ్రత్తగా దృష్టి పెట్టి ముందుకు వెళ్లాలి. నాకంటూ ఏ స్వార్ధం లేదు. దేవుడు దయవల్ల ఆ భగవంతుడు నాకు అన్ని ఇచ్చాడు. తల తెగినా నేను తప్పు చేయను. అలాగే గుంటూరు నగర రహదారులకు మధ్యన మసీదులు, చర్చలు దేవాలయాలు నిర్మాణమై ఉన్నాయి. అందరూ పెద్ద మనసు చేసుకొని వాటి తొలగింపుకు సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నానన్నారు. ఎవరికైనా నష్టపరిహారం కావాలా మరి ఏదైనా ఉంది అంటే మమ్మల్ని సంప్రదిస్తే అందరూ చర్చించుకుని సంప్రదిస్తే తగిన పరిష్కారం చూపిస్తామన్నారు.
జిల్లా ఇంచార్జ్ మంత్రి వర్యులు మరియు పర్యాటక , సాంస్కృతిక మరియు సినియాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ దేశ సమైక్యత కోసం, రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. ఎన్నో సవాళ్లను అధిగమించి గుంటూరు నగరంలో నూతన హంగులతో రూపుదిద్దుకుంటోన్న శంకర్ విలాస్ వంతెన (ఆర్వోబీ) నిర్మాణం జిల్లా అభివృద్ధికి బాటలు వేయనుందని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ గుంటూరు జిల్లా అభివృద్ధిలో కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక శాసనసభ్యుల భాగస్వామ్యాన్ని అభినందించారు. భవిష్యత్ అవసరాల మేరకు కొత్త ఆర్వోబీని నిర్మించాలన్న ప్రజల దశాబ్దాల అవసరాన్ని గుర్తించి అందుకు బాటలు వేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురుచూసిన బ్రిడ్జి నిర్మాణం చేయడం అసాధారణమైన విషయమన్నారు. చరిత్ర కలిగిన ఈ బ్రిడ్జి మరెన్నో కాలాల పాటు ప్రజలకు సేవలందిస్తుందన్నారు. గుంటూరు జిల్లా ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చొరవతో గుంటూరు ప్రజల చిరకాల వాంఛ నెరవేరడం, ప్రస్తుతం తాను గుంటూరు ఇంచార్జి మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు ఇక్కడి ప్రజాప్రతినిధులు చూపిస్తున్న కృషిని మంత్రి దుర్గేష్ కొనియాడారు. తద్వారా జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలో నిర్మించిన శంకర్ విలాస్ బ్రిడ్జికి సహకరించిన బాధితులకు ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. బాధితుల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా అవకాశం కల్పించాలని సూచించారు. విజన్ ఉన్న నాయకత్వానికి, విజన్ లేని నాయకత్వానికి తేడాను ప్రజలు గమనించాలన్నారు. ప్రస్తుతం ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి దుర్గేష్ అన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో కక్ష సాధింపుకే ప్రాధాన్యమిచ్చారు తప్ప అభివృద్ధికి స్థానం ఇవ్వలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అరాచకం రాజ్యమేలిందన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూటికి నూరు శాతం సరైన దార్శనికతతో, 20,30 ఏళ్ల తర్వాత రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలన్న సూక్ష్మ ప్రణాళికతో, అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలతో, ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలను సమ్మిళితం చేసి నడుస్తోందని వెల్లడించారు. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. సీఎం చంద్రబాబునాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందిస్తున్న సహకారం గురించి వివరించారు. ఈ సందర్భంగా దేశంలోనే నంబర్ 1 విజనరీగా పేరొందిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒకవైపు, పేదవారి కంట కన్నీరు తుడవడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి ముందడుగు వేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోవైపు, ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా పేరొందిన నరేంద్రమోదీ నాయకత్వం ఇంకోవైపు. వీళ్లందరి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ గా పయనిస్తోందని, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని మంత్రి దుర్గేష్ అన్నారు. దేశ సమైక్యత కోసం, రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుదామని పిలుపునిచ్చారు.
శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే అంశాలపై , ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి సమస్యల పరిష్కారంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ , జిల్లా ఇంచార్జ్ మంత్రి వర్యులు మరియు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక చొరవతో కృషి చేస్తున్నారన్నారు. శంకర విలాస్ బ్రిడ్జి అంటే నాకు ఎంతో ఇష్టమని , విద్యార్ధి నాయకునిగా, వామపక్ష భావాలు కలిగి ఎన్నో పోరాటాలు చేసిన సంఘటనలకు ప్రత్యక్ష సాక్ష్యం శంకర్ విలాస్ బ్రిడ్జి అన్నారు. గుంటూరు నగరాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నానన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ మాట్లాడుతూ ఈ రోజు శంకర్ విలాస్ ఆర్ ఓ బి కి శంఖుస్థాపన కార్యక్రమంలో అందరితో కలసి పాల్గొనడం ఎంతో సంతోషకరమన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి గడచిన రెండు నెలల్లో అన్ని శాఖలతో సమావేశాలు నిర్వహించి సమన్వయంతో ముందుకు వెళ్లడం జరిగిందన్నారు. బ్రిడ్జి నిర్మాణంలో ఆస్తులను కోల్పోతున్న వారిని కూడా కలుపుకుని ముందుకు వెళతామన్నారు. బ్రిడ్జి వేగవంతంగా పూర్తి చేయడానికి కృషి చేస్తానని జిల్లా యంత్రాంగం తరపున తెలియజేస్తున్నానన్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ 1958 లో నడింపల్లి నరసింహారావు నిర్మించిన ఆర్ఓబి గుంటూరు తూర్పు – పశ్చిమ నియోజకవర్గాలను కలిపే బ్రిడ్జి అని , ప్రస్తుతం నగర జనాభా , వాహనాల సంఖ్య పెరిగిందను ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర రైల్వే మంత్రికి వివరించి శంకర్ విలాస్ ఆర్ ఓ బి నిర్మాణానికి అనుమతులు తీసుకువచ్చారన్నారు. బ్రిడ్జి నిర్మాణం వలన నష్టపోయిన వారికి జిల్లా కలెక్టర్ తో చర్చించి నష్టపరిహారం ఇవ్వడం జరిగిందన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని తన భుజస్కందాలపై మోసిన కేంద్ర మంత్రి వర్యులు డా. పెమ్మసాని చంద్ర శేఖర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
వేమూరు నియోజకవర్గ శాసన సభ్యులు నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ గుంటూరు నగర ప్రజల చిరకాల వాంఛ శంకర్ విలాస్ ఆర్ ఓ బి నిర్మాణమని , ప్రజలు పడుతున్న ఇబ్బందులు కొంత వరకు తీరతాయని భావిస్తున్నానన్నారు. 1958 లో ఏర్పడిన శంకర్ విలాస్ బ్రిడ్జి పెరుగుతున్న నగర జనాభా , విస్తరిస్తున్న వాహనాలు , పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రి వర్యులు డా. పెమ్మసాని చంద్ర శేఖర్ ఈ ఆర్ ఓ బి నిర్మాణానికి కృషి చేశారన్నారు. యుద్ధప్రాతిపదికన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని, నగర చుట్టు ప్రక్కల రోడ్లు విస్తరించాలని , నగరాన్ని అభివృద్ది చేసే క్రమంలో అందరూ సహకరించి మద్దతుగా నిలవాలని కోరారు.
తాడికొండ శాసన సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నగరంలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. గుంటూరులో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే వారు లేరని అనుకుంటుంటే మన కళ్ల ఎదుటే పరిష్కారం దొరుకుటుందని ఎవరు ఊహించలేదని , నాలుగు లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి పెమ్మసాని 98 కోట్ల రూపాయలు మంజూరు చేయించారన్నారు. డిపిఆర్ తయారు చేయడంలో కృషి చేశారనన్నారు. ఈ ఆర్ఓబి కి ఒక పేరు పెడితే బాగుంటుందని సూచించారు. రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ లు నిర్మాణాలు కూడా చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది పైనే దృష్టిపెట్టిందని , టైమ్ లైన్ ను పాటించి 24 నెలల్లో పూర్తి చేయుటలో అధికార యంత్రాంగం , ఇంజనీర్లు , కాంట్రాక్టర్లు దృష్టి పెట్టాలన్నారు.
ప్రత్తిపాడు శాసన సభ్యులు బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ గుంటూరు నగరానికి శంకర్ విలాస్ బ్రిడ్జి తలమానికంగా నిలుస్తుందని , ప్రజలకు కావలసిన సంక్షేమ పధకాలు అమలు జరుగుతాయన్నారు. గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేసిందన్నారు. గుంటూరు నగరంలో నాలుగు బ్రిడ్జిల నిర్మాణాలకు మంత్రి డా. పెమ్మసాని అనుమతులు తెచ్చారన్నారు. రోడ్లు , డ్రైన్లు , మంచినీటి పధకాలు తీసుకుని రావడం సంతోషకరమన్నారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు గల్లా మాధవి మాట్లాడుతూ గుంటూరు ప్రజల ఆకాంక్ష శంకర్ విలాస్ బ్రిడ్జి అని , బ్రిడ్జి నిర్మాణానికి నేడు శంఖుస్థాపన చేయడం జరిగిందని , రానున్న రోజుల్లో బ్రిడ్జి నిర్మాణం జరిగే రోజుల్లో ప్రజలు కష్టాలు తీర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 24 నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామన్నారు.
బీజేపీ రాష్ట్ర నాయకులు జై ప్రకాష్ మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం , పోలవరం ప్రాజెక్టు , శంకర్ విలాస్ ఆర్ఓ బి నిర్మాణం కేంద్ర ప్రభుత్వం చొరవతోనే జరుగుతున్నాయన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యం దిశగా రాష్ట్రాలు అభివృద్ది చెందే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.
నగరపాలక సంస్థ మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గుంటూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమం అని , ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల నష్టపోయే ప్రతి ఒక్కరికీ నష్టపరిహారం అందిస్తామని కూటమి ప్రభుత్వం తరపున వాగ్దానం ఇస్తున్నామన్నారు.
జియంసి కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ శంకర్ విలాస్ ఆర్ ఓ బి నిర్మాణానికి శంఖుస్థాపన చేయడం చాలా సంతోషకరమన్నారు. 1958 లో నిర్మించిన ఈ బ్రిడ్జి పున:నిర్మాణానికి వంద కోట్లు , నష్టపరిహారం మొత్తం రూ. 130 కోట్లు అవుతుందన్నారు. అతి తక్కువ కాలంలో బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు తీసుకువచ్చి శంఖుస్థాపన చేయడానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ నగరపాలక సంస్థ నుండి త్వరితగతిన ఈ ప్రాజెక్టు ను ముందుకు తీసుకువెళతామన్నారు.
ఈ కార్యక్రమంలో జియంసి డిప్యూటీ మేయర్ సజీలా , పొన్నూరు మాజీ శాసన సభ్యులు రావి వెంకట రమణ , బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతయ్య , జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర రావు , తిరుపతి రావు , కార్పొరేషన్ చైర్మన్లు , డైరెక్టర్లు , కార్పొరేటర్లు , వివిధ విభాగాల అధికారులు , వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
addComments
Post a Comment