జగన్ ప్రభుత్వంలోనే జ‌రిగిన భారీ లిక్క‌ర్ స్కామ్.

 


*ఎమ్మెల్యే జ‌గ‌న్ కి స‌వాల్ విసిరిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)*

 

*రూ.3,600 కోట్ల లిక్కర్ స్కామ్ పై 24 గంట‌ల్లో జ‌గ‌న్ సిబిఐ ఎంక్వైయిరీ కోరాలని డిమాండ్*


*లిక్క‌ర్ స్కామ్ పై సిబిఐ ఎంక్వైయిరీ కోరుతూ లేఖ రాసిన ఎంపి కేశినేని శివ‌నాథ్* 


*లిక్క‌ర్  స్కామ్ ని డైవర్ట్ చేయటానికి జ‌గ‌న్ అండ్ బ్యాచ్ హైద‌రాబాద్ లో ప్రణాళికలు*


*జగన్ ప్రభుత్వంలోనే జ‌రిగిన భారీ లిక్క‌ర్ స్కామ్


*


*గత ఆరేళ్లుగా విజ‌య‌వాడ ఎంపిగా చేసిన ఓ వ్య‌క్తి  జగన్ దగ్గర పాలేరుగా చేరాడు*


*జగన్ ఆలోచనలను అమ‌లు చేస్తున్న పాలేరు*


* దుబాయ్, అమెరికాలో రెండు కంపెనీల ద్వారా డ‌బ్బు త‌ర‌లించిన‌ట్లువచ్చిన వార్తల్ని నిగ్గు తేల్చాలి




విజ‌య‌వాడ (ప్రజా అమరావతి): జ‌గ‌న్ పాల‌న‌లో జ‌రిగిన  రూ.3,600 కోట్ల లిక్క‌ర్ స్కామ్ నుంచి దృష్టి మ‌ర‌ల్చేందుకు జ‌గ‌న్ తో పాటు అక్క‌డ చేరిన విజ‌య‌వాడ పాలేరు క‌లిసి అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అంతే కాదు  ప‌ది రోజుల క్రితం  హైద‌రాబాద్ లో జ‌గ‌న్ పాలేరు తో పాటు మ‌రో నలుగురు కలిసి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేసేందుకు, త‌న‌పై బుర‌ద చ‌ల్లేందుకు వ్యూహార‌చ‌న చేశారు.  జ‌గ‌న్ రెడ్డి సాక్షి పేప‌ర్ లో కేశినేని ఇంట‌ర్నేష‌న‌ల్ లిమిటెడ్ (అమెరికా), కేశినేని గ్లోబ‌ల్ ఎంట‌ర్ ప్రైజ‌స్ (దుబాయ్) ఈ రెండు కంపెనీలు ద్వారా డ‌బ్బులు త‌ర‌లించిన‌ట్లు జ‌గ‌న్ తోపాటు ఆయ‌న‌  పాలేరు ఆరోపించారు. అందుకే ఈ రెండు కంపెనీలు ఎవ‌రి పేరు మీద వున్నాయో...ఎక్క‌డ వున్నాయో తెల్చ‌టంతో పాటు లిక్క‌ర్ స్కామ్ సూత్ర దారులెవ్వ‌రో క‌నిపెట్టేందుకు సిబిఐ విచార‌ణ కోరుతూ విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్  సిబిఐ లేఖ రాశారు. అంతే కాదు ఎమ్మెల్యే జ‌గ‌న్ రెడ్డి దమ్ము, దైర్యం వుంటే 24 గంట‌ల్లో సిబిఐ విచార‌ణ కోరుతూ లేఖ రాయాల‌ని స‌వాల్ విసిరారు.


ఇటీవల సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌కి లిక్క‌ర్ స్కామ్ కి సంబంధం వుంద‌ని వ‌చ్చిన ఆరోప‌ణ‌లు ఖండిస్తూ ఎంపి కేశినేని శివనాథ్ గుర‌వారం త‌న కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.త‌న పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు చేసిన మాజీ ఎంపి కేశినేని ఎంపి  నాని ని జ‌గ‌న్ పాలేరు గా అభివ‌ర్ణించారు. అంతే కాదు జ‌గ‌న్ తోపాటు కేశినేని నాని పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.


మీడియా స‌మావేశంలో ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ  గ‌త ఆరు సంవ‌త్స‌రాల నుంచి ఎమ్మెల్యే జ‌గ‌న్ ద‌గ్గ‌ర విజ‌య‌వాడ మాజీ ఎంపి కేశినేని నాని  పాలేరుగా పని చేస్తున్నాడు. ఆ పాలేరు చేసే ప‌నులు ఏంటంటే జ‌గ‌న్ ఆలోచ‌న‌ల‌ను అమ‌లు చేయ‌టమన్నారు.అందులో భాగంగానే త‌న పై అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు.


హైద‌రాబాద్ లో త‌న స్థ‌లం, రాజ్ క‌సిరెడ్డి స్థ‌లం ప‌క్క‌ ప‌క్క‌నే వుండేవ‌ని, త‌న‌కి స్థ‌లంలోకి రాక‌పోక‌లు సాగించాలంటే త‌న స్థ‌లం నుంచే రావాల్సి వుండ‌టంతో ఇద్దరం క‌లిసి డెవ‌ల‌ప్ చేయ‌టానికి ఒక కంపెనీ ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. 2020-21 లో నాలుగైదు సార్లు రాజ్ క‌సిరెడ్డి క‌లిశాను.. రాజ్ క‌సిరెడ్డి జ‌గ‌న్ తో స‌త్స‌సంబంధాలు క‌లిగి వుండ‌టంతో కంపెనీ ప్రారంభించిన ఆరునెల‌ల్లో త‌న‌కి కోట్ల రూపాయ‌లు న‌ష్టం క‌లుగుతున్నా తృణ‌ప్రాయం వ‌దిలేసి వ‌చ్చిన‌ట్లు తెలిపారు. ఆ రోజు నుంచి ఈ నాటి వ‌ర‌కు రాజ్ క‌సి రెడ్డి తో త‌న‌కి ఎలాంటి సంబంధాలు లేవ‌ని స్ప‌ష్టం చేశారు. 


ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌టానికి ప్ర‌ధాన కార‌ణం...లిక్క‌ర్ స్కామ్ నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర్చ‌లటానికి జ‌గ‌న్ అండ్ బ్యాచ్ చేస్తున్న కుట్రగా తెల్చి చెప్పారు.  రాష్ట్రంలో గ‌త ప్ర‌భుత్వ హ‌యంలో జ‌రిగిన‌ రూ.3,600 కోట్ల లిక్క‌ర్ స్కామ్ లో  భాగ‌స్వామ్యులు ఎవ‌ర‌నేది అందరికీ అర్థ‌మ‌వుతున్న‌ప‌రిస్థితి వుంద‌న్నారు.  రిటైర్ట్ ఐ.ఎ.ఎస్ అధికారి సుప్రీం కోర్ట్ లో బెయిల్ నిరాక‌ర‌ణ‌కు గురైన ఆ అధికారి ఆధ్వ‌ర్యంలో ఈ లిక్క‌ర్ స్కామ్ జ‌రిగిందనేది  వాస్తవమ‌న్నారు.  అన్ని దారులు కూడా తాడేప‌ల్లి ప్యాలెస్ లోని నాలుగవ‌ నెంబ‌ర్ గ‌ది వైపుకే చూపిస్తున్నాయన్నారు. ఈ నాలుగవ‌ నెంబ‌ర్ గ‌దిలోకి న‌లుగురికే అనుమ‌తి వుంద‌న్నారు,  ఈ లిక్క‌ర్ స్కామ్ లో వున్నజ‌గ‌న్ దంప‌తులు ఇద్ద‌రు. సుప్రీం కోర్ట్ లో బెయిల్ రిజెక్ట్ మాజీ అధికారి ,  లిక్క‌ర్ స్కామ్ నిందితుడు పోలీస్ క‌స్ట‌డీలో వున్న రాజ్ క‌సి రెడ్డికే ఎంట్రీ వుంద‌న్నారు.


ఈ లిక్క‌ర్ స్కామ్ నుంచి ప్ర‌జ‌ల దృష్టి మార్చేందుకు ప‌దిరోజ‌ల క్రితం హైద‌రాబాద్ లో ఐదుగురుతో ఒక స‌మావేశం జ‌రిగింద‌ని, అందులో  ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, గోవిందప్పతో సహా విజయవాడ పాలేరు కూడా ఉన్నట్టు చెప్పారు. అలాగే విజ‌య‌వాడ ప్రాంతానికే చెందిన మరో వ్య‌క్తి  కూడా వున్నాడ‌ని వివ‌రాలు తెలియాల్సివుంద‌న్నారు. వీరంతా క‌లిసి ప‌బ్లిక్ డొమైన్ లో వున్న నా వివ‌రాలు సేక‌రించి అస‌త్య ఆరోప‌ణ‌లు చేశార‌ని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 


జ‌గ‌న్ పాలెరు ఎన్నిక‌ల ముందే ఈ వివ‌రాలు మీడియా కి చెప్ప‌టం జ‌రిగిందన్నారు.  రాజ్ క‌సిరెడ్డి తో వున్న ఆ లింక్ ను ప‌ట్టుకుని క‌ట్టు క‌థ‌లు అల్లుతున్నార‌న్నారు. మాజీ ఎంపి కేశినేని నాని జ‌గ‌న్ కి ఐదారు సంవ‌త్స‌రాల క్రిత‌మే అమ్ముడుపోయి పాలేరుగా మార‌డ‌న్నారు.  చంద్ర‌బాబు అరెస్ట్ స‌మ‌యంలో కూడా ప్ర‌తి నిత్యం జ‌గ‌న్ రెడ్డి మేసేజ్ లు పంపించి కోవ‌ర్ట్ గా ప‌ని చేశాడ‌న్నారు. జ‌గ‌న్ హ‌యంలోనే లిక్క‌ర్ స్కామ్, శాండ్ స్కామ్ జ‌రిగింద‌ని, టిడిపి ఎంపి గా వున్న ఈజ‌గ‌న్ పాలేరు అప్పుడు ఎందుకు జ‌గ‌న్ ను నిల‌దీయ లేదంటూ నిగ్గ‌దీశారు.  ఆ రోజు లిక్క‌ర్ స్కామ్ లో డ‌బ్బులు, ఇసుక లో డ‌బ్బులు తీసుకున్నాడు అందుకే జ‌గ‌న్ అన్యాయాల‌ను నిల‌దీయలేద‌న్నారు. 


జ‌గ‌న్ రెడ్డి సాక్షి పేప‌ర్ లో కేశినేని ఇంట‌ర్నేష‌న‌ల్ లిమిటెడ్ (అమెరికా), కేశినేని గ్లోబ‌ల్ ఎంట‌ర్ ప్రైజ‌స్ (దుబాయ్) రెండు కంపెనీలు ద్వారా త‌ను డ‌బ్బులు త‌ర‌లించిన‌ట్లు జ‌గ‌న్ తో పాటు ఆయ‌న పాలేరు ఆరోపించారు. ఈ రెండు కంపెనీలు ఎవ‌రి పేరు మీద వున్నాయి...ఎక్క‌డ వున్నాయో తేల్చాలి..అందుకే  త‌న సిబిఐ ఎంక్వైయిరీ కోరుతూ సిబిఐ కి లేఖ రాసిన‌ట్లు తెలిపారు.  ఈ రెండు కంపెనీలు పాలేరు కంపెనీలా? జ‌గ‌న్ రెడ్డి కంపెనీలా నిగ్గు తేల్చాల‌న్నారు. 



జ‌గ‌న్ రెడ్డి లా సూట్ కేసు కంపెనీలు పెట్టే అల‌వాటు లేదన్నారు. .  కష్టర్జీతంతో పైకి ఎదిగాన‌ని త‌న కుటుంబానికి ఐదారు కంపెనీలు వున్నాయన్నారు.అవన్నీ పబ్లిక్ డోమైన్ లో ఉన్నాయ‌ని తెలిపారు. ఎమ్మెల్యే  జ‌గ‌న్ రెడ్డి లిక్క‌ర్ స్కామ్ కి , రూ.3,600 కోట్ల‌కి సంబంధం లేద‌నుకుంటే  24 గంట‌ల్లోపు సిఈ సిబిఐ ఎంక్వైయిరీ కోరాల‌ని స‌వాల్ విసిరారు.   ఈ లిక్క‌ర్ స్కామ్ సొమ్ము జ‌గ‌న్ రెడ్డి ద‌గ్గ‌రికి వెళ్లింద‌నే అంద‌రికీ తెలిసిన విష‌యమే.  ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేయ‌టంతో నువ్వు నీ అనుచ‌రుల‌తో క‌లిసి ఆడే డ్రామాలు క‌ట్టిపెట్టాలన్నారు. నీ అనుచ‌రులు పాలేర్లు  ఎంత అరిచి గోల చేసిన లాభం లేదని, తాడేప‌ల్లి ప్యాలెస్ లో నాలుగ‌వ నెంబ‌ర్ గ‌దికి డ‌బ్బులు వెళ్లాయన్నారు. త‌న‌ నిజాయితీ నిరూపించుకునేందుకు సిబిఐ ఎంక్వైయిరీ కోరిన‌ట్లు తెలప‌గ్గా జ‌గ‌న్ రెడ్డి కి  ద‌మ్ము దైర్యం వుంటే నా స‌వాల్ స్వీక‌రించాల‌న్నారు.


జ‌గ‌న్ పాలేరు చిరంజీవి పార్టీ పెడితే ఆ పార్టీలోకి వెళ్లాడు.  పాలేరు వెధ‌వ వేషాలు చూసి పార్టీ నుంచి త‌ప్పించారు.ఈ పాలేరు చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ డ‌బ్బులు తీసుక‌న్నార‌ని ఆరోపించాడు. ఆ త‌ర్వాత  2019 నుంచి జ‌గ‌న్ రెడ్డి కి అమ్ముడై పోయాడన్నారు. జ‌గ‌న్ పాలేరు కి లిక్క‌ర్ స్కామ్ గురించి ముందే తెలుసు అన్నారు. 


తాను క‌రుడుగ‌ట్టిన తెలుగుదేశం పార్టీ అభిమానిన‌ని చెప్ప‌టంతో పాటు, నేను పార్టీలు మార‌లేదు..మారేది లేదు... నా జీవింతాం తెలుగుదేశంలోనే ఉంటా... తెలుగు దేశం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డ‌తా...అభివృద్ది కోసం, ప‌రిశ్ర‌మ‌ల కోసం, ఉద్యోగాల కోసం, యువ‌కుల్లో  ఆత్మ‌విశ్వాసం  నింపేందుకు , పాఠ‌శాల‌ల్లో విద్యార్ధుల‌కు నాణ్య‌మైన విద్య అందించే విధంగా, కృషి చేస్తానన్నారు.  సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్ట‌డం కాదు ...ఆధారాలు చూపించాల‌ని డిమాండ్ చేశారు. 

తాను దాక్కునే  ర‌కంగా కాదన్నారు.


*శృత దేశం గ‌ర్వం అణిచిన ఇండియ‌న్ ఆర్మీ*


ప‌హ‌ల్గాంలో  ఉగ్ర‌వాది దాడికి పాల్ప‌డిన ఉగ్ర‌వాద శిబిరాల‌ను  దేశ ప్ర‌జ‌లు గ‌ర్వ‌పడేలా భార‌త సైన్యం నేల మ‌ట్టం చేసింద‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ ఇండియ‌న్ ఆర్మీకి  ప్ర‌జలంద‌రి త‌రుఫున ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప‌హ‌ల్గాం లో  టూరిస్టుల‌ను అతి దారుణంగా కాల్చి చంపిన ఉగ్ర‌వాదుల‌ను వాటి సంస్థ శిబిరాల‌ను  నిర్మూలించే విధంగా పాకిస్తాన్ స‌రిహ‌ద్దులోని  9 ఉగ్ర‌వాద శిబిరాల‌పై చేసిన దాడి దేశ ప్ర‌జ‌లంద‌రూ స్వాగ‌తిస్తున్నారని తెలిపారు.దేశాన్ని ముక్క‌లు చేయాల‌నుకున్న శతృ దేశం గ‌ర్వం దేశ సైనికులు అణిచి చూపించార‌న్నారు. ఉగ్ర‌వాద శిబిరాల పై దాడి వాటి నాశ‌నం ప‌హ‌ల్గాం ఉగ్ర‌వాద దాడిలో మృతి చెందిన వారి కుటుంబాల‌కు ఉప‌శ‌మ‌నం గా వుంద‌న్నారు. కుల‌మతాల‌కు అతీతంగా దేశ ప్ర‌జ‌లంద‌రి ఆకాంక్ష మేర‌కు ఈ దాడులు జ‌రిగియన్నారు. . దేశానికి ఇలాంటి గొప్ప విజ‌యానికి అందించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. .ఇలాంటి సైనిక వీరుల వ‌ల్లే దేశం సుర‌క్షితంగా వుందన్నారు.

Comments