అమరావతి (ప్రజా అమరావతి);
*ప్రతి ఒక్కరూ ‘నా రాజధాని’ అని గర్వించేలా అమరావతిని నిర్మిస్తాం
*
*రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా రాజధాని*
*రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ది మా సిద్దాంతం*
*రాజధాని పనుల పున: ప్రారంభమే కాదు... రాజధాని ప్రారంభోత్సవం కూడా మోదీ చేతుల మీదుగానే చేస్తాం*
*మోదీ నాయకత్వంలో బలమైన భారత్ ఆవిష్కృతం... ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది*
*పహల్గాం దాడి ఘటనతో మోదీలో ఆవేదన చూశాను*
*దేశం కోసం ప్రధాని తీసుకునే అన్ని నిర్ణయాలకు మద్దతుగా ఉంటాం: అమరావతి పున: ప్రారంభ సభలో సిఎం చంద్రబాబు నాయుడు*
*హమ్ ఆప్ కే సాత్ హై అంటూ... జాతీయ జెండాల ప్రదర్శన మధ్య వందేమాతరం నినాదాలతో మోదీకి మద్దతు పలికిన సిఎం చంద్రబాబు*
*భారత్ మాతాకీ జై అంటూ చంద్రబాబుతో గొంతు కలిపిన ప్రధాని మోదీ*
• అమరావతి పనుల పున:ప్రారంభానికి ఇక్కడికి వచ్చిన మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారికి రాష్ట్ర ప్రజల తరుపున స్వాగతం తెలుపుతున్నాను.
• ముందుగా మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. గతంలో ఎప్పుడు మోదీ గారిని కలిసినా చాలా ఆహ్లాదకరంగా భేటీ జరిగేది. కానీ మొన్నటి మా ఢిల్లీ భేటీ చాలా గంభీరంగా సాగింది.
• దీనికి కారణం పహల్గాం దాడి ఘటన. తొలిసారి ఆయనలో అంత బాధ చూశాను.
ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అనే ఆవేదన మోదీ గారిలో చూశాను.
• అందుకే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల తరుపున చెపుతున్నాను...ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాని మోదీ గారు, కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేం మద్దతుగా ఉంటాం.
• మోదీ జీ హమ్ ఆప్ కే సాత్ హై! ఆంధ్రప్రదేశ్ కే పాంచ్ కరోర్ లోగ్ ఆప్ కే సాత్ హై..!
• పూరా దేశ్ ఆప్ కే సాత్ హై!
• ఈ సభలో ఉన్న అందరూ ఒక సారి గట్టిగా వందేమాతరం అని చెప్పండి.
• వందేమాతరం. వందేమాతరం...వందేమాతరం
*దృఢమైన నాయకత్వంలో బలమైన భారత్ :*
• Under the strong leadership of Modi ji, the world is witnessing the rise of new India
• When Modi ji became Prime Minister in 2014, India was ranked 10th in the world economy.
• Modi ji has brought the country from 10th place to 5th place in his 11 year rule.
• According to an IMF report, our country is expected to surpass Japan and reach 4th place this year itself.
• It will also surpass Germany and reach 3rd place by 2027.
• Today in our country, we have the right person...at the right time...in the right place. He is our PM Modi ji.
• With Modiji’s model of welfare, development and empowerment, a New India is emerging.
• In these 10 years, people have been empowered and 15 crore people have been brought out of poverty.
• Whatever decision Modi takes...it will have the idea of Nation First.
• We are welcoming the Union Cabinet's decision to conduct a caste census.
• Your decision to collect caste and socio-economic data in census will help in inclusive empowerment of every one of all aspects. This will the game changer for the future of India.
*రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి :*
• 2014లో రాజధాని లేని పరిస్థితుల్లో మనం పాలన ప్రారంభించాం.
• అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమిగా, శాతవాహనుల రాజధానిగా, భౌద్దుల ఆధ్యాత్మిక కేంద్రం గా, కృష్ణమ్మ తీరాన విలసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేశాం.
• అమరావతి కేవలం ఒక నగరం కాదు... 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్.
• ప్రజల ఆత్మగౌరవానికి, ఆత్మవిశ్వానికి, ఆశలకు, ఆకాంక్షలకు ప్రతి రూపం.
• ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా 29 వేల మంది అన్నదాతలు, 34 వేల ఎకరాలు రాజధానికిచ్చారు.
• అద్భుత రాజధాని నిర్మాణం తలపెడితే....తరువాత వచ్చిన ప్రభుత్వం విధ్వంసం చేసింది.
• నాటి ప్రభుత్వ దమనకాండ పై రైతులు, రైతు కూలీలు, మహిళలు తిరుగులేని పోరాటం చేశారు.
• ఈ సమయంలో జరిగిన న్యాయ పోరాటంలో న్యాయస్థానాలు అమరావతిని బతికించాయి.
• 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజాతీర్పుతో అమరావతి మళ్లీ ఊపిరిపోసుకుంది.
• 10 నెలల్లో సవాళ్లను అధిగమించి, కేంద్ర సహకారంతో, మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాలను పట్టాలెక్కించాం.
• నేడు మోదీ గారి చేతుల మీదుగా అమరావతి పనులను రీ స్టార్ట్ చేస్తున్నాం.
• రాష్ట్రంలో ప్రతి పౌరుడు సగర్వంగా ‘నా రాజధాని అమరావతి’ అని చెప్పుకునేలా నిర్మిస్తాం.
• 2015లో ప్రధాని చేతుల మీదుగా శంకుస్ధాపన చేసిన రాజధానిని విధ్వంసం చేశారు...మళ్లీ నేడు మీ చేతుల మీదుగా పనులు ప్రారంభించాం...రేపు మీరే మళ్లీ ప్రారంభోత్సవం చేయాలని కోరుతున్నాం.
• ఒకే రోజు రూ.49,000 కోట్ల విలువైన 74 పనులకు శంకుస్థాపన చేసుకున్నాం.
• వీటికి అదనంగా రూ.5,028 కోట్లతో చేపట్టే 9 కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
• అలాగే, రూ.3,680 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 8 జాతీయ రహదారులను ప్రధాని ఈ రోజు ప్రారంభించారు.
• మరో రూ.254 కోట్లతో నిర్మించిన 3 రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.
• అమరావతి, కేంద్ర ప్రాజెక్టులు కలిపి మొత్తం రూ.57,962 కోట్ల విలువైన 94 ప్రాజెక్టులకు ఈరోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
*వరల్డ్ క్లాస్ క్యాపిటల్ :*
• బ్లూ అండ్ గ్రీన్ సిటీగా అమరావతి ఉంటుంది. 30 శాతం ప్రాంతం పచ్చదనం, జలవనరులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతాం. నవ నగరాలను రాజధానిలో భాగంగా ఉంటాయి.
• రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ గారు పలు సూచనలు చేశారు. వాటిని అమలుచేస్తాం.
• ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, well planned city గా, భవిష్యత్ నగరంగా అమరావతి ఉంటుంది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్ పోర్టుతో అన్ని ప్రపంచ దేశాలకు కనెక్టివిటీ పెంచుతాం.
• ప్రపంచ స్థాయి సంస్థల ఏర్పాటుతో అమరావతి హెల్త్, ఎడ్యుకేషన్ హబ్ గా ఉండబోతోంది.
• మోదీ గారు సూచించిన జపాన్ మియావాకీ తరహా పచ్చదనం పెంచే విధానాన్ని అమలు చేస్తాం.
• Utilities అన్నీ వయాడక్ట్ పద్దతిలో అందిస్తాం. గ్రీన్ ఎనర్జీతో పర్యావరణ అనుకూలంగా రాజధాని.
• ఇన్ లాండ్ వాటర్ వేస్, సైక్లింగ్ ట్రాక్స్, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టం, వాకింగ్ పాత్ తీసుకువస్తాం.
• XLRI బిజినెస్ స్కూల్, గ్లోబల్ లీడర్షిప్ సెంటర్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తాం.
• The GOI has launched the National Quantum Mission in 2023.
• Inspired by this idea of Modi ji... Like Silicon Valley for America... our intention is to make Amaravati a Quantum Valley.
• Along with the GOI, companies like TCS, IBM, L&T are participating in this
• With the support of Vajpayee ji, we built a high-tech city in Hyderabad
• Today, with the support of Modi ji, we are announcing that we will make Amaravati a Quantum Valley.
*అభివృద్ది వికేంద్రీకరణ మన సిద్దాంతం*
• రాజధాని మాత్రమే కాదు... 26 జిల్లాల్లో ప్రతీ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం. అభివృద్ది వికేంద్రీకరణ చేపడతాం. 2014-19 మధ్య కేంద్ర ప్రభుత్వ సంస్థలను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశాం.
• కేంద్ర సహకారంతో 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. రాష్ట్రంలో నదుల అనుంసధానం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం.
*నాలెడ్జ్, ఫైనాన్సియల్ క్యాపిటల్ విశాఖ*
• కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ భోగాపురం ఎయిర్పోర్టు పనులు మొదలు అయ్యాయి.
• విశాఖ స్టీల్ ప్లాంట్ను నిలబెట్టేందుకు కేంద్రం రూ. 11,440 కోట్లు ప్యాకేజ్ ప్రకటించింది.
• గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖకు వస్తున్నాయి.
• రూ.1.43 లక్షల కోట్లతో అర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీని అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నాం.
*రాయలసీమ దశ మారుతోంది:*
• వెనుకబడిన రాయలసీమపై మరింత ఫోకస్ పెట్టాం. కేంద్ర మద్దతు కోరుతున్నాం.
• సీమలో డిఫెన్స్ సంస్థలు, కర్నూలులో హై కోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రధాని సాయం కోరుతున్నాం.
• లేపాక్షి-ఓర్వకల్ కారిడార్ లో ఏరోస్పేస్, ఆటోమొబైల్, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకువస్తాం.
• రామాయపట్నంలో బిపిసిఎల్ రిఫైనరీ వస్తుంది.
• తిరుపతిని అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా విస్తరిస్తాం. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తాం.
• కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్లకు ఇప్పటికే కేంద్రం నిధులు కేటాయించింది.
• రాష్ట్ర ప్రజల కోసం ప్రణాళికతో పనిచేస్తున్నాం. మీ సహకారం, సాయంతో స్వర్ణాంధ్ర సాధిస్తాం.
• విశాఖలో NTPC ప్రాజెక్టుకు మీరు శంకుస్థాపన చేశారు...నేడు అమరావతి పనులను ప్రారంభించారు.
• రేపు రాయలసీమ లో వచ్చే ప్రాజెక్టులను కూడా మీ చేతుల మీదుగా మొదలుపెట్టాలని మేం కోరుతున్నాం.
• రాష్ట్రం పట్ల మీరు చూపే ఆదరణకు మరో మారు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
*జై అమరావతి.... జై ఆంధ్రప్రదేశ్..జై హింద్*
addComments
Post a Comment