*ఆటోనగర్లో ప్లాట్స్ సేల్ డీడ్ చెయ్యడం కొనసాగించాలని కలెక్టర్ కు వినతి..
.*
మంగళగిరి (ప్రజా అమరావతి);
మంగళగిరి ఆటోనగర్లో ప్లాట్స్ సేల్ డీడ్ చెయ్యడం యధావిధిగా కొనసాగించాలని కోరుతూ గుంటూరులో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని గురువారం ది మంగళగిరి ఆటోనగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ మహ్మద్ జానీ, నాయకులు కలిసి వినతి పత్రం అందజేసి కోరారు. ఆటోనగర్లో 405 ఫ్లాట్స్ ఉన్నాయని, 2022 నుంచి సేల్ డీడ్ జరుగుతున్నాయని, గత ఏడాది ఎలక్షన్ కోడ్ దగ్గర నుండి ఆపడం జరిగిందన్నారు. ఏపీఐఐసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్తే ఆటోనగర్ మీద విజిలెన్స్ ఎంక్వయిరీ వేశారని, అది పూర్తయిన తర్వాత సేల్ డీడ్ చేయడం జరుగుతుందని చెప్పారని వారు ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు.
addComments
Post a Comment